యతిరాజ వింశతి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

ramanujar-alwai

భవిష్యదాచార్యులు, ఆళ్వార్ తిరునగరి

mamunigal-srirangam

మణవాళ మహామునులు,శ్రీరంగం

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygjUzfftL54KaEesD

ముందు మాట:

మన్నుయిర్కాళింగే మణవాళమామునియవన్
పొన్నడియాం చ్చెంగమల పోదుగళై-ఉన్ని
శిరత్తాలే తీండిల్ అమానువనం నమ్మై
కరత్తాలే తీండల్ కడన్

ఎందరో మహాచార్యులవతారము వలన పునీతమైన ఈ పుణ్యభూమిలో పూర్వాచార్య పరంపరగా ఈనాటికీ అందరిచే కొనియాడేబడే పరంపర మణవాళ మామునులతో సుసంపన్నమైనది. వారి తరవాత కూడా మహాచార్యులు ఎందరో అవతరించినప్పిటికీ, నంపెరుమాళ్ళనబడే శ్రీరంగనాధులే స్వయముగా శిష్యులుగా కూర్చుని తిరువాయ్ మొళికి ఈడు వ్యాఖ్యనమును విని,అచార్య కైంకర్యముగా తనియన్ చెప్పినందున మామునులతో ఆచార్య పరంపర సుసంపన్నమైనట్లు పెద్దలచే నిర్ణయించబడినది. తిరునావీరుడయపిరాన్ దాసర్ కుమారులుగా సాధారణ నామ సంవత్సరములో,సింహ మాసములో,మూలానక్షత్రయుక్త శుభదినములో వీరు ఆళ్వార్ తిరునగరిలో  అవతరించారు.తిరువాయిమొళి పిళ్ళై వీరి  ఆచార్యులు.

తిరువాయిమొళి పిళ్ళై ఒక రోజున ఉడయవర్ల గుణానుభవము  చేస్తూ,మాఱన్ అడి పణిందు ఉయ్ద రామానుశన్ అని పేర్కొన్న పలు ఫాశురాలను తలచుకుంటూ నమాళ్వార్ల మీద ఉడయవర్లకు ఉన్న భక్తి, అనురాగములకు పొంగి పోయి, ఉడయవర్లకు అక్కడ (ఆళ్వార్ తిరునగరి)విడిగా ఒక ఆలయము నిర్మిచాలని శిష్యులను ఆదేశించారు.

మామునులుకూడా ఉడయవర్ల మీద అపారమైన భక్తి కలిగి వుండి,అనేక కైంకర్యములను చేస్తూ వచ్చారు. ఉడయవర్ల మీద ఒక స్తొత్రమును విఙ్ఞాపనము చేయాలని ఆచార్యుల ఆఙ్ఞ అయినందున ఈ ‘యతిరాజ వింశతి ‘ని విఙ్ఞాపనము చేశారు. ఇందులోని మాధుర్యమును మొదలైన గుణ విశేషములను కోయిల్ అణ్ణా వరవరముని శతకములో చక్కగా వివరించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment