శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రుత్యగ్రవేద్యనిజదివ్యగుణస్వరూ
వశ్యస్సదా భవతి తె యతిరాజ తస్మాచ్చకతః స్వకీయజనపాపవిమోచనే త్వం ||
ప్రతి పదార్థము:
యతిరాజ = ఓ యతిరాజా
శ్రుత్యగ్రవేద్య = ఆచార్య ముఖముగా తెలుసుకొన తగినదయిన వేదాంతసారము
నిజదివ్యగుణస్వరూపః = అపార జ్ఞానము, శక్త్యాది గుణములు ,అందరిని నియమించగల శక్తి, తననాశ్రయించినవారికి పరతంత్రులుగా వుండగలుగుట
ఇహ తు = ఈ భూమి మీద
ప్రత్యక్షతాముపగతః = అందరికీ కన్నుల పండుగగా వుండుట
రంగరాజః = శ్రీరంగరాజులు
తె = తమరికి
సదా = ఎల్లప్పుడు
వశ్యః = వశపడి ( ఏది చెప్పినా తప్పక చేయువాడు)
భవతి = శక్తుడవుతున్నాడు ( తమరు చెప్పిన పనులు చేయుటయే తాము ఇక్కడ వేంచేసి వుండుటకు ప్రయోజనముగా భావించు వారు)
తస్మాత్ = ఆ విధముగా శ్రీరంగరాజులు తమరికి వశపడి వుండుట వలన
స్వకీయ = తమరి దాసుల
జన = దాస జనుల
పాపవిమోచనే = పాపాములను పోగొట్టుటలో
త్వం = తమరు
శక్తః భవసి = శక్తులవుతున్నారు
భావము:
శబ్దాది దోషములను పోగొట్టుట, రామానుజుల దాసాదిదాస వర్గములో అందరికీ ,దాస్యము చేయవలననే కోరిక మొదలైన వాటిని కిందటి శ్లోకములో తెలియజేసారు. దీనికి రామానుజుల వద్ద వుండవలసిన దయను గురించి అంతకు ముందున్న రెండు శ్లోకములలో చెప్పారు. ప్రస్తుతము తన కోరికను నెవేర్చుటకు రామానుజులకు ఉన్న శక్తిని గురించి తెలియజేస్తున్నారు. శ్రీరంగరాజులు అర్చా మూర్తిగా వుండి అందరి కళ్ళకు ఆనందమును కలుగజేయుతున్న వైలక్షణ్యమును ‘ఉపగతస్తుఇహ ‘ అన్నప్రయోగములోని ‘అస్తు ‘ తో నొక్కి చెపుతున్నారు. పరత్వము,వ్యూహత్వము (పరమ పద నాధులు , క్షీరాబ్ధి నాధులు)చాలా దూరముగా వుండుట వలన ఈ లోకములో వున్న మన కళ్ళకు కనపడరు. రామ క్రిష్ణాది విభవావతారముల యుగములలో మనము లేము. అందు వలన ఆ మూర్తులను చూడలేము. అంతర్యామిగా వున్న రూపమును చూచుట కఠోర యొగాభ్యాసము చేసిన యోగులకు మాత్రమే సాధ్యము. మనబోటి చర్మ చక్షువులకు అసాధ్యము. అర్చామూర్తి అయిన శ్రీరంగనాధులు ఈ కాలములో ,ఈ దేశములో వేంచేసి వుండి కఠోర యొగాభ్యాసము చేయకుండా, చర్మ చక్షువులకు కూడా కనపడుటయే ఆయన విలక్షణము. అటువంటి శ్రీరంగనాధులు రామానుజులకు వశపడి వుండుట చేత ఆ శ్రీరంగనాధుల దగ్గర దాసుడి గురించి చెప్పి గట్టెక్కించ వచ్చని ఈ శ్లోకములో తెలుపుతున్నారు. మొక్షోపాయమైన క్రమ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగముల కన్నా భిన్నమైన ఐదవదైన ఆచార్యాభిమానమనే ఉపాయమును చేపాట్టారు. అందుకే ఆచార్యులైన ఎంబెరుమార్లను ఆశ్రయించి వారి పురుషకారమును కోరుతున్నారని వ్యాఖ్యాత అభిప్రాయ పడుతున్నారు. పాపములు తొలగిపోయినప్పుడు పరమపదములో భగవదనుభవము, కైంకర్యము ప్రాప్తి తధ్యము కావున పాప విమొచనమును కోరుకుంటున్నారు.
అడియేన్ చూడమణి రామానుజదాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-17/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org