యతిరాజ వింశతి – 18

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 17

కాలత్రయేsపి కరణత్రయనిర్మితాతిపాపక్షయస్య శరణం భగవత్క్షమైవ |
సా చ త్వయైవ కమలారమణౌsథ్రితా యత్ క్షేమస్య ఏవ హి యతీంద్ర! భవచ్చితానాం ||

ప్రతి పదార్థం:

యతీంద్ర = ఓ యతీంద్రా

కాలత్రయేsపి = భూత భ్విష్యత్ వర్తమానాలనే మూడు కాలాలలో

కరణత్రయనిర్మిత = మనోవాకాయ కర్మణా

అతిపాపక్షయస్య =  మహా ఘోర పాపములు చేసిన జీవాత్మలకు( సకల పాపములను భరించు పరమాత్మకే భరింప సక్యము కాని మహా ఘోర పాపములు)

శరణం = పాపములను పోగొట్టు ఉపాయమైన

భగవత్క్షమైవ = దోషములను పరిహరించుటయే గుణములైన భగవంతుడి గొప్పదనమే అయినా

త్వయయ ఏవ = ఆ భగవంతుడినే వశపరచుకున్నా తమరి వలన మాత్రమే

కమలారమణే = దయా స్వరూపుడైన భగవంతుడిలో దయాది గుణములకు రాణీంపు కలుగజేయు శ్రిరంగనాచ్చియార్ పతి అయిన శ్రిరంగనాధుల వద్ద

అర్థ్రితా ఇతి యత్ = ప్రార్థించినది ఏదీనా ఉందా

స ఏవ = ఆ ప్రార్థనయే (శరణాగతి గద్యములో)

భవచ్చరితానాం = (తమ అభిమానమునకు) తమరిచే స్వీకరింపబడిన దాసులకు

క్షేమః హి = ఉత్తారకము కదా

భావము:

కిందటి శ్లోకములో శ్రీరంగనాధులు యతిరాజులకు వశపడియున్నారని చెప్పి , ఈ శ్లోకములో ఆ  శ్రీరంగనాధులను దాసుడి పాపాలను తొలగించవలసినదిగా కొత్తగా ప్రార్థించనవసరము లేదు.  శరణాగతి గద్యములో  ‘ మనోవాక్కాయైః ‘  ప్రారంభమయ్యే చూర్ణికలో , ‘ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాం చ సర్వాన్ అశేషతః క్షమస్వ  ‘  ( గతములో చేసినవి,  ఇప్పుడు చేస్తున్నవి, ఇక ముందు చేయబోయేవి అయిన సకల విధ అపచారములను నిశ్శేషముగా తొలగించి అనుగ్రహించాలి ) అని దాసుల పాపములను పోగొట్టుటకు  ప్రార్థించియే వున్నారు.  ఆ ప్రార్థనయే దాసులను ఉజ్జీవింప గలదు కదా!

శరణాగతి గద్యములో తమకు సంబంధించిన వారి పాపాలను సహించమని భగవంతుడిని  ప్రార్థించినట్లు స్పష్టముగా కనపడకున్నను “ఇమైయోర్ తలైవా!ఇన్నిన్న నీర్మై ఇని యామురామై ,అడియేన్ సెయ్యుం విణ్ణప్పం కేట్టరుళాయ్ ” (దేవాది దేవా!  ఇక మామీద నీ దయ ఎప్పటికీ లేకుండా పోకూడదు,ఇది దాసుడు చేయు విన్నపము)  అని అన్న నమ్మాళ్వార్ల శ్రీపాదములను నమ్ముకున్న వారు కావున రామానుజులు కూడా అలాగే ప్రార్థించినట్లు గ్రహించాలి. వాస్తవముగా ఇతరుల ధుఃఖమును చూచి సహించలేని వారు కాబట్టే తిరుకోట్టియుర్ నంబి 18 సార్లు తిప్పించి ఆఖరికి కృప చేసిన ద్వయమంత్రార్థమును కోరికగల వారందరికీ ఉపదేశించి ‘ ఉడయవర్ (ఉభయ విభూతి మంతుడు),కృపా మాత్ర ప్రసన్నాచార్యులు ‘ ఆయినారు. రామానుజులు తమ సంబంధీకుల పాపములను కూడా పోగొట్టమని అడిగినట్లుగా స్పష్టమవుతున్నదని భావించే శేషస్స ఏవహి యతీంద్ర!-భవచ్చరితానాం.”(తమరి ప్రార్థనయే తమరి దాసుల ఉజ్జీవనానికి వర్తిస్తుంది.)అని మామున్లే చెప్పినట్లు గ్రహించవచ్చు. గద్య వాఖ్యములో మమ(అపచారాన్)అని లేనందున,అందరి పాపములను సహించ గలరని ప్రార్థించినట్లు అర్థము చేసుకోవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-18/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment