యతిరాజ వింశతి – 15

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 14

శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవరోక్తసమస్తనైచ్యం |
అద్యాస్త్యసండుంచితమేవ మయీహ లోకే తస్మాధ్యతీంద్ర !కరుణైవ తు మద్గతిస్తే ||

 

ప్రతి పదార్థము:

యతీంద్ర != ఓ యతిపతి

ఈహ లోకే = పాపాత్ములుండు ఈ లోకములో

అద్య = కలి పురురుషుడు ఏలుతున్న ఈ కాలములో

శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవర = దోషములే లేని శుధ్ధమైన ఆత్మ స్వరూపమును కల్లిగి వున్న యామునార్యులని పిలివబచే ఆళవందార్లు ,ఆత్మ గుణపరిపూర్ణులైన కూరత్తాళ్వాన్లు , పూర్వాచార్యులందరిలో మిక్కిలి ఉన్నతులైన పరాశర భట్టరు మొదలైన వారు

ఉక్తసమస్తనైచ్యం = తమ గ్రంధములలో ఆరోపించుకున్న నీచ గుణములన్నీ

మైయి ఏవ = దాసుడొక్కడి యందే

అస్త్యసంకుంచితం (అస్తి) = పూర్తిగా నిండి వున్నవి

తస్మాత్ =  అందువలన

తే కరుణా తు = లోకములో ప్రసిధ్ద్ధమైన తమ కారుణ్యము

మధ్గతిః ఏవ (భవతి) = దాసుడి విషయములో కృప చూపవలసింది

 

భావము:

         ఆళవందార్, కూరత్తళ్వాన్, శ్రీ పరాశర భట్టరు మొదలైన వాళ్ళు శుధ్ధాత్మలు కలవారు. వారి వారి రచనలలో వారిపై ఆరోపించుకున్న దోషాలేవీ మచ్చుకైనా లేని వారు. భట్టరు, కూరత్తళ్వాన్ల పెద్ద కుమారులు. వారి అసలు పేరు శ్రీరంగనాధులు . విష్ణుపురాణములో పరాశర ముని లాగా ‘ పరమాత్మ శ్రీమన్నారాయణుడే  ‘  అని విశ్వసించి ప్రచారము చేసినందు వలన వారిని శ్రీరంగనాధులే పలు తడవలు ‘ పరాశర భట్టరు ‘అని కీర్తించటము వలన వారికి ఆ పేరు స్థిరపడినది.

         ‘ సమస్తనైచ్యం మమ ఏవ అసంగుచితం అస్తి ‘అన్న పదాన్వయమే కాక

‘ సమస్తనైచ్యం మయి అసంగుచితమెవ అస్తి ‘అన్న అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఎంపెరుమానార్ (ఉడయవర్లు)  ‘  మన కారుణ్యమునకు కడుపు చాలా పెద్దది. దానికి దోషాలు తక్కువైతే కడుపు నిండదు. మీ దగ్గర దోషాలు అంత లేవే ! మరి మా కరుణకు పాత్రులు ఎలా కాగలరు?  ‘ అని అడిగినట్లు భావించి ఇలా చెపుతున్నారు. స్వామీ యతిరాజా ! తమరి కరుణకు కావలసినంత దోషములు పరిపూర్ణముగానే దాసుడి వద్దవున్నాయి. కావున తమరి కరుణకు దాసుడికి అర్హత కలదు. అని చెప్పినట్లు పై అన్వయము వలన తెలుస్తున్నది.  ‘ తేతు కరుణావ మద్గతి ‘ -శాస్త్రములలో , చెప్పబడిన జ్ఞానము , అనుష్టానము , వైరాగ్యము గలవారికి కర్మయోగమో,  జ్ఞానయోగమో, భక్తియోగమో ఉపాయము కావచ్చును. కాని దాసుడికి అటువంటి సద్గుణాలేవీ లేనందున తమరి కరుణ ఒక్కటే ఉపాయము అని చెపుతున్నారు.

           ఆళ్వందార్లు తమ స్తొత్రరత్నము(62)  శ్లోకములో దాసుడు శాస్త్రమును మీరి ప్రవర్తించిన వాడిని, మిక్కిలి నీచమైఅన వాడిని ఎందులోను మనసు నిలపలేని చంచల బుధ్ధి గలవాడను , ఓర్వలేని వాడిని, ఒక్క మంచి పని చేసిన వాడను కాను, వంచన పరుడను, హంతకుడను, మిక్కిలి పాపిని – అని చెప్పుకున్నారు.

           కూరత్తళ్వాన్లు అతిమానుష స్తవము (59,60) శ్లోకములలో ‘ఎంపెరుమానే! భగవద్భాగవత, ఆచార్య అపచారములను చేయుట ఇంకా మాన లేదు. ఇటువంటి పాపి అయిన దాసుడు దరి చేరలేని మహా పాప కూపములో పడి వున్నాడు . వేరు ఉపాయములు లేని దాసుడు తమరి శ్రీపాదములనే ఉపాయముగా ఆశ్రయించి వున్నాడు. గతములో శరణాగతి చేసిన విషయము మీద దాసుడికి శ్రద్ద లేదు. అందు వలన ఇప్పుడు ఇలా తమరి శ్రీపాదములను పట్టినంతనే తమరు  మన్నిస్తారని తలచను, అని తమ దోషములను చెప్పుకుంటున్నారు.

శ్రీపరాశర భట్టరు తమ ‘ శ్రీరంగరాజ స్తవము ఉత్తర శకము(89)లో మోక్షోపాయముగా చెప్పబడిన జ్ఞాన , కర్మ ,భక్తి యోగములు ఉపాయములు కావు. మోక్షమును పొందాలన్న కోరిక కూడా లేదు. వేరే గతి లేదు అర్హతలు లేవు. పాపములు మాత్రము అనంతముగా కలిగి వున్నాను. మూర్ఖత్వము వలన శబ్దాది విషయములకు వశపడి కలత చెందిన మనసుతో ‘ నీవే నాకు శరణము ‘ అన్న మాటను మాత్రమే చెప్పగలను, అన్నట్లుగా తాము కూడా అనేక దోషములు చేశామని నైచ్యానుసంధానము చేసుకుంటూ ‘ యామునగురూత్తమ కూరనాధ భట్టాఖ్య దేశిక వరోక్త సమస్త నైచ్యం ‘అన్నారు.

 అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-15/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment