జ్ఞానసారము 25

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 24

lord-maha-vishnu

అవతారిక

కిందటి పాశురములో శరణాగతి చేసిన తన భక్తులు తెలియక చేసిన తప్పులను గ్రహించడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు వివరించారు కదా! దానికి కారణము  భగవంతుడు  “వాత్సల్య పరిపూర్ణుడు”. అందు వలన   “వత్సలుడు ” అని పిలువబడతాడు. తన భక్తులు తెలియక చేసిన తప్పులను గణించక పోగా వాటిని దీవెనలుగా స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు . అందువలన ఎవ్వరూ బయపడనవసరము లేదు అని చెపుతున్నారు .

“అఱ్ఱం ఉరైక్కిల్ అడైందవర్ పాల్ అంబుయైకోన్

కుఱ్ఱం ఉణరందిగళుం కొళ్గైయనో? – ఎఱ్ఱే తన్

కన్ఱిన్ ఉడంబిన్ వళువన్ఱో? కాదలిప్పదు

అన్ఱదనై ఈన్ఱుగంద ఆ”

ప్రతిపదార్థము

అఱ్ఱం ఉరైక్కిల్ = ఆఖరికి చెప్పేదేవిటంటే

అంబుయైకోన్ = తామారపై వేంచేసి వుండే మహలక్ష్మి ధవుని

అడైందవర్ పాల్ = శరణాగతి చేసిన వారి

కుఱ్ఱం = దోషములను

ఉణర్దు = తెలుసుకొని

ఇగళుం కొళ్గైయనో?= వాటిని ద్వేషించడు

ఎఱ్ఱే  = ఎంత ఆశ్చర్యము!

ఆ = ఆవు

అన్ఱదనై ఈన్ఱుగంద = ఈనిన వెంటనే

తన్ కన్ఱిన్ = తన దూడ యొక్క

ఉడంబిన్ = శరీరముపై

వళువన్ఱో? =  కప్పి ఉన్న మావిని

అన్ఱు = అప్పుడు

కాదలిప్పదు = ప్రేమగా నోటితోస్వీకరించి శుభ్రముచేస్తుంది

వ్యాఖ్యానము

అఱ్ఱం ఉరైక్కిల్……అఱ్ఱం…ఆఖరికి-అనగా చివరికి చెప్పేది ఏవిటంటే

అడైందవర్ పాల్……తనను శరణాగతి చేసిన వారి పట్ల .

అంబుయైకోన్…… శ్రీదేవికి భర్త , లక్ష్మణాదులకు సోదరుడు అయిన శ్రీమన్నారాయణుడు ,’ పాల్ ‘- పట్ల …ఎవరి పట్ల ?భక్తుల పట్ల … ఎవరు? అంబుయైకోన్ …భక్తులు అమ్మవారి పురుషకారము వలననే స్వామిని చేరుకుంటారు. అందు వలన ఇక్కడ శ్రీమన్నారాయణుని ‘ అంబుయైకోన్ ‘ (తామర పై వేంచేసి వుండే మహలక్ష్మి ధవుడు)అన్నారు. ఆమె పురుషకారముతో వచ్చారు కాబట్టి ఆయన వారిని దరి చేర్చుకుంటాడు కదా!జీవాత్మను , పరమాత్మ దగ్గరికి చేర్చేది అమ్మవారి పురుషకారము కావున పరమ్మాత్మ వారి దోషములను గణించడు. అది ఆయన సహజ స్వభావము. ఒక జీవాత్మను , ఆయన స్వీకరించాక .నిజంగా నిండు మనసుతో అంగీకరించారా లేక ఏదో పోనీలే అని స్వీకరించారా ? అన్న విషయమును అమ్మవారు పరీక్షింటము కోసము వారి దోషములను గురించి స్వామితో మాట్లాడతారు . అది విని ఆయన ఆ జీవుడిని  వదిలి వేస్తారా! లేక శిక్షిస్తారా అని చూస్తారు . స్వామి దానికి ‘ ఎన్ అడియార్ అదు సెయ్యార్ సెయ్దారేల్ నన్ఱు సెయ్దార్ ‘ పెరియాళ్వార్ తిరుమొళి 3.9.2 ( నా దాసులు అలా చేయరు.చేస్తే మంచికే చేసి వుంటారు) అని ఆ జీవుడిని నిండు మనసుతో అంగీకరిస్తారు .

కుఱ్ఱం ఉణరందిగళుం కొళ్గైయనో? ……పరమాత్మ “కొళ్గై” (స్వభావమును ) స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ తన ప్రశ్నల ద్వారా రూఢి చేసుకుంటారు. అలా ఎందుకు చేయాలి అంటే చదువరులకు పరమాత్మ స్వభావము బోధపడటము కోసము అని చెపుతారు . పరమాత్మ స్వభావము ఎటువంటిది ? అమ్మవారి పురుషకారముతో తన శ్రీపాదము లను చేరినవాడు ఎటువంటి వాడైనా స్వీకరించటము , వాడు చేసిన దోషములను గుణములుగా చూడటము , వాడి మీద కోపమును చూపక పోవటము ఆయన స్వభావము . అందుకే ఆయన “వాత్సల్యము గలవాడు , వత్సలుడు . వత్సం  అంటే దూడ . దూడ దోషములను ఆవు గుణములుగా స్వీకరించినట్లు  ఆయన తన దాసుల దోషములను గుణములుగా స్వీకరిస్తాడు .

ఎఱ్ఱే తన్ కన్ఱిన్ ఉడంబిన్ వళువన్ఱో? కాదలిప్పదు అన్ఱదనై ఈన్ఱుగంద ఆ”……. ‘ ఎఱ్ఱే ‘ అనేది ఆశ్చర్యార్థకము . స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఎందుకలా అన్నారు ? అంటే ఆవు సాధారణముగా శుభ్రముగా వున్న గడ్డిని తప్ప ఎవరైనా తొక్కినా ,అపరి శుభ్రముగా వున్నా , ఆ గడ్డిని తినదు . కాని తాను ప్రసవించగానే , తన వత్సం  శరీరము మీద వున్న మావి, ఇతర మలినములను తన నోటితో నాకి శుభ్రము చేస్తుంది .అది వాత్సల్యము . “ఈన్ఱ పొళుదిన్ పెరిదువక్కుం”, అలాగే భగవంతుడు తన భక్తులు చేయు తప్పులను ద్వేషించక ప్రేమతో స్వీకరిస్తాడు. మన పూర్వాచారులు ఎప్పుడు భగవంతుడి వాత్సల్యమునకు ఈ వృత్తాంతమునే ఉదాహరణగా చెపుతారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్  భగవంతుడి వాత్సల్యమును చూసి ‘ ఎఱ్ఱే ‘ అని అన్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-25-arram-uraikkil/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment