దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – పరిచయం 

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాస మాలిక

దివ్య ప్రబంధము అంటే ఏమిటి?

దివ్య ప్రబంధానికి “అరుళిచ్చెయల్” అనే పేరు కూడా ఉన్నది. ప్రబంధం అంటే కట్టి ఉంచేది అని అర్ధం. ఆళ్వార్ల ప్రబంధం ఎమ్పెరుమాన్ ని (శ్రీమన్నారాయణుడు) అడియార్గళ్ తో  (భక్తులు / పాదదాసులు) తో కట్టి ఉంచి, అడియార్గళ్ కి భగవద్ అనుభవాన్ని అందించి, వారిని పెరుమాళ్ళ కట్టి ఉంచుతాయి కనుక వాటిని దివ్య ప్రబంధమని కీర్తిస్తారు. 

అంతే కాక, అవి సాంసారికమైన మాలిన్యాలు చేత కట్టబడవు కనుక వాటికి దివ్య ప్రబంధం అని పేరు.  దివ్య ప్రబంధం జీవులని దోషరహితమైన పరమాత్మతో అనుసంధానం చేస్తాయి. 

ఆళ్వార్లు ఎవరు?

ఎమ్పెరుమాన్ కొందరిని ఎంచుకుని వారికి “మయర్వర మదినలం” అన్నట్టు నిజమైన జ్ఞానాన్ని, భక్తిని అనుగ్రహించి, వారి అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించి, వారిని ఆళ్వార్లు గా మార్చాడు. “ ఆళ్వార్లు” అంటే భగవద్ అనుభవంలో మునిగి ఉన్నవారు అని అర్ధం. వారు ఎప్పుడూ ఎమ్పెరుమాన్ కళ్యాణ గుణాలను, దివ్య తిరుమేని సౌందర్యాన్ని అనుభవిస్తూ, భక్తి పరవశులై ఉంటారు. 

ఆళ్వార్లు పన్నిద్దరు. 

పొయిగై ఆళ్వార్, భూతత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమజిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు పదుగురు. మధురకవి ఆళ్వార్, ఆండాళ్ తో కలిపి పన్నెండు మంది. 

మధురకవి ఆళ్వార్ మరియు ఆండాళ్ ఆచార్య నిష్ఠలో పూర్ణులు. ఆండాళ్ సాక్షాత్తు భూదేవి అవతారం, ఆమెకు తన ఆచార్యులైన పెరియాళ్వార్ల శ్రీ సూక్తులు ద్వారా పరమాత్మ పై భక్తి కలిగింది. అదే విధంగా, మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల యందు భక్తి కలిగిన వారు. 

మణవాళమామునులు ఉపదేశ రత్తినమాలై  లో ఆళ్వార్లను, వారు ప్రబంధాన్ని స్తుతిస్తూ

“ఆళ్వార్గళ్ వాజి అరుళిచ్చెయళ్ వాజి 
తాజ్ వుయాదుమిల్ కురువర్ దామ్ వాజి| ఏజ్ పారుమ్
ఉయ్య అవర్ గళ్ ఉరైత్త వైగళ్ తామ్ వాజ్|
శెయ్య మఱై తన్నుడనే శేర్ న్దు ||” 

“దివ్య సురులైన ఆళ్వార్లు వర్ధిల్లు గాక!
వారి రచనలైనా అరుళిచ్చెయల్ వర్ధిల్లు గాక!
ఎటువంటి లోటు లేని పూర్వాచార్యులు వర్ధిల్లు గాక!
వారి వ్యాఖ్యానాలు వర్ధిల్లు గాక!” అని సాయించారు. 

నమ్మాళ్వార్ల ప్రబంధాలకూ వేదాలకూ ఉన్న సామ్యం: నమ్మాళ్వార్లు ఆళ్వార్లకు నాయకులుగా భావింపబడతారు. వారి ప్రబంధాలు నాలుగు వేదాలకు సమానం. 

  • తిరువాయిమొళి – 1102 పాశురాలు- సామవేదం తో సమానం 
  • తిరువిరుత్తం – 100 పాశురాలు- ఋగ్వేదం  తో సమానం 
  • పెరియ తిరువందాది – 87 పాశురాలు- అథర్వణ వేదం  తో సమానం 
  • తిరువాసిరియమ్ – 7 పాశురాలు- యజుర్వేదం  తో సమానం 

వేదములకు 6 అంగములు ఉన్నట్టుగానే, తిరుమంగై ఆళ్వార్ల ప్రబంధం నమ్మాళ్వార్ల 4 ప్రబంధాలకీ అంగాలుగా భావించబడతాయి. (1) శిక్ష (శబ్దముల ఉచ్చారణ) (2) వ్యాకరణం (3) ఛందస్సు (4) నిరుక్తం (పదముల ధాతువులకు సంబంధించిన శాస్త్రం) (5) జ్యోతిష్యం (6)కల్పం (కర్మ విధానం) ఆరు వేదాంగములు అయితే, తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించిన పెరియ తిరుమొళి, తిరుక్కురుంతాండగం, తిరువెళుకూట్టిరుక్కై ,  శిరియ తిరుమడల్ , పెరియ తిరుమడల్ , మరియు తిరునెడుంతాండగం నమ్మాళ్వార్ల ప్రబంధానికి అంగములు. 

పరమాత్మ యొక్క అయిదు స్థితులు- ప్రమాణము: 

ప్రమేయం- పరమాత్మే ప్రమేయం- పొందవలసిన వస్తువు 
ప్రమాణము-మనకు దారిచూపించే శాస్త్రాలు 
ప్రమాత- ఆచార్యులు 

పరమాత్మా అయిదు రూపాలు:

పరత్వానికి – వేదములే ప్రమాణము 
వ్యూహ రూపానికి (క్షిరాబ్ధి లో ఉండే రూపం)- పాంచరాత్ర ఆగమం ప్రమాణము 
విభవ అవతారములు- ఇతిహాస, పురాణములు ప్రమాణము 
అంతర్యామి రూపానికి- మనుస్మృతి ప్రమాణము 
అర్చావతారము- దివ్య ప్రబంధములు ప్రమాణములు 

ఆళ్వార్లు అర్చామూర్తి అనుభవం లో మునిగిపోయారు, ప్రబంధం వారి హృదయానికి అద్ధం వంటిది. వారు స్తుతించిన క్షేత్రములు దివ్యదేశములు. ప్రబంధములో ఆళ్వార్ల అనుభవం సమగ్రంగా  నిక్షిప్తం అయి ఉంది. 

దివ్యప్రబంధం వల్ల ఉపయోగం ఏమిటి?

మణవాళ మామునుల 8 మంది శిష్యులలో ఒకరైన ఎరుంబియప్పచే వ్రాయబడిన వరవరముని దినచర్య అనే గ్రంధములో మామునిగళ్ దినచర్య వర్ణింపబడినది. వారు  అష్ట దిగ్గజములలో ఒకరిగా పరిగణించబడ్డారు. వారు మణవాళ మామునులకు నమస్కరించి, వారి పూర్వ దినచార్య (ఉదయం కార్యకలాపాలు) మరియు ఉత్తర దినచర్య (సాయంత్రం కార్యకలాపాలు) వివరించారు. 

ఎరుంబియప్ప దివ్య ప్రబంధం గొప్పతనము..మనకు విరక్తి కలిగించడమే వాటి ప్రయోజనము (అంటే మన లక్ష్య సాధన కోసం లౌకిక విషయాలకు దూరంగా ఉండటం) అని సాయించారు. అంతే కాక, దివ్య ప్రబంధములో రహస్యాత్రయం (తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం) చక్కగా వివరించబడ్డాయి. 

పూర్వదినచర్య 28లో, 

తత్వం దివ్యప్రబంధానాం సారం సంసార వైరిన్నమ్ |
సరసం సరహస్యానామ్ వ్యాచక్షానామ్ నమామి తమ్ ||

(దివ్య ప్రబంధమే సత్యం యొక్క సారాంశమని ( మరియు పాదదాసులు సాధించవలసిన లక్ష్యమని) మరియు అవి ఈ సంసార చక్రం నుండి విడదీస్తాయని సాయించిన మణవాళ మామునులకు దాసుడు నమస్కరిస్తున్నాడు. ప్రబంధం రహస్య త్రయం అర్ధాన్ని కూడా నిస్సంశయంగా వివరిస్తుంది). 

జీవితంలో విరక్తిని తీసుకురావడం గురించి ప్రబంధం ఏదైనా ఉందా? నమ్మాళ్వార్ తిరువిరుత్తం, 1వ పాసురంలో భౌతిక జీవితంలో విరక్తి అనే భావనను ప్రధానంగా చూపించారు. 

పోయిన్నిన్రా జ్ఞానము పొల్లా ఒజుక్కుమ్ అజుక్కుడంబుం
ఇన్నిన్రా నిర్మై ఇనియం ఉరమై ఉయిరాలిప్పన్
ఎన్నిన్రా యోనియుమ్ఆయ్ప్ పిరాంధాయ్ ఇమైయోఆర్ తలైవా
మెయిన్నిన్రు కెత్తరులాయ్ అదియన్ సెయ్యుం విన్నాప్పమే

సామాన్య అర్థం:

సృష్టించబడిన వారందరినీ రక్షించడానికి అనేక జన్మలలో అవతరించిన వాడా!  నిత్యసూరులకు నాయకుడా! మా దుఃఖానికి కారణమైన, అవిద్యతో నిండి, తప్పుడు పనులు, అపవిత్రతతో నిండిన ఈ శరీరాలు మాకు వద్దు. నీవు దృఢంగా నిలబడి నీ సేవకుడి విజ్ఞప్తిని వినాలి!

పద-పదార్థం 

పోయిన్నిన్రా – నిజాయితీగా ఉండకపోవడం
జ్ఞానము – జ్ఞానం
పోల్అ ఒజుక్కుమ్ – చెడు ప్రవర్తన
అజుక్కు – అపవిత్రం
ఉదంబం – శరీరం
లోపల రా – ఈ స్వభావం
నిర్మయి – గుణం
– ఇకమీదట
యమ్  – మేము
ఊరమై – పొందము
ఉయిర్ – అన్ని సృష్టించబడిన ప్రాణులను
అలిప్పన్ – రక్షించడానికి
నుదురు – అనేక రకాలు
యొనియమాయ్  – జన్మలు
పిరందాయ్  – అవతరించిన
ఇమైయోర్ – నిత్యసూరులకు
తలైవా –  ప్రభువా!
మే – వాస్తవంగా
నిన్రు – ధృడంగా నిలబడి  

కెత్తరులాయ్ – దయతో విను
అడియేన్ – నేను, మీ సేవకుడిని
సెయ్యమ్ – చేయు
విన్నాప్పం – విజ్ఞప్తి

మనం ఈ పాశురాలను చదివే కొద్దీ మనకు సంసార పై విరక్తీ , భగవత్ అనుభవం (ఎమ్పెరుమాన్‌కు సంబంధించిన విషయాలు) పట్ల అనుబంధం కలుగుతాయి. మనం ఎమ్పెరుమాను కళ్యాణ గుణాలు , అవతార లీలలు  చూసినప్పుడు, అవి ఆనందాన్ని కలిగిస్తాయి.  ఆత్మ యొక్క నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాము మరియు పెరుమాళ్లకు సేవకుడిగా మన స్వరూపాన్ని అర్థం చేసుకుంటాము.

మనం శరీరానికి బదులు ఆత్మ దృక్కోణంలో చూసినప్పుడు, “వైయత్తు వాళ్వీర్గాళ్ ”అని ఆండాళ్ సాయించినట్టు, భగవత్ అనుభవంలో లీనమైతే మనం పెరుమాళ్ సేవను అనుభవించగలుగుతాము, శరీరాన్ని వదిలిన తరువాత, పరమపదం లో స్వామిని సేవిస్తాము. 

ఇహమునందు, పరమునందు, జీవుని లక్ష్యం దివ్య ప్రబంధంలో అందంగా వివరించబడింది. 

ఆత్మ పెరుమాళ్లకు సర్వవిధ శేషి, ఆత్మా స్వరూపం పరమాత్మ కైంకర్యం చేయడమే. ఇదే తిరుమంత్రంలో చెప్పబడినది. 

  • తిరుమంత్రంలో- ఆత్మ పెరుమాళ్లకి కింకరుడు, ఆయన పాదాలే శరణం అని చెప్పబడినది. 
  • ద్వయ మంత్రంలో – తాయార్ (శ్రీమహాలక్ష్మి) ద్వారా మనం పెరుమాళ్లను శరణాగతి చేయాలని మరియు ఆ దివ్య శేర్తి సంతోషం కోసం వారికి కైంకర్యం చేయాలని నేర్చుకుంటాము.
  • చరమ శ్లోకం – భగవద్గీత శ్రీ కృష్ణుడు “మిగతా ధర్మాలన్నిటినీ విడిచిపెట్టి, నా చరణాలను పట్టుకో. నేను నీ  పాపాలన్నిటి నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను. చింతించకు” అన్నాడు. 

ఈ రహస్య త్రయం ద్వారా, జీవుడు ఈ లీలా విభూతి లోనూ, నిత్యా విభూతిలోనూ పరమాత్మకి కింకరుడు అని తెలుస్తోంది. పరమపదంలో పరమాత్మా నిత్యా కైంకర్యం చేయడమే జీవుని పరమ కర్తవ్యం. 

దివ్య ప్రబంధం ఎలా విభజింపబడింది?

వేదం ఒకే శాస్త్రమైనప్పటికీ, అందరూ అధ్యయనం చేయడానికి వీలుగా, వేద వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు- ఋగ్, యజుర్, సామ, అథర్వణ గా.

అదే విషంగా, శ్రీ నాథమునిగళ్ దివ్య ప్రబంధాన్ని నాలుగు భాగాలుగా విభజించారు: 

ముదల్ ఆయిరం (మొదటి వెయ్యి), పెరియ తిరుమొళి (రెండవ వెయ్యి), ఇయర్పా (మూడవ వెయ్యి), తిరువాయిమొళి (నాలుగవ వెయ్యి). వాటిలో ఉన్న ప్రబంధాలు:

  • ముదల్ ఆయిరం- నాథమునిగళ్ ఈ ఆయిరం లో పెరియాళ్వార్, ఆండాళ్, కులశేఖరాళ్వార్, తొందరప్పొడి ఆళ్వార్, తిరుమజిశై ఆళ్వార్ పాడిన ప్రబంధాలు పొందుపరిచారు.  
  • పెరియ తిరుమొళి- పెరియ తిరుమొళి, తిరుక్కురుంతాండగం, మరియు తిరునెడుంతాండగం పొందుపరచబడ్డాయి 
  • ఇయర్పా – ఇందులో గద్య రూపం లో ఉన్న ప్రబంధాలు చేర్చబడ్డాయి.  వాటిని రాగం తాళాలతో కూర్చారు. 

తమిళ సాహిత్యంలో మూడు రకాల రచనలు ఉంటాయి:

  • ఇయల్ – గద్యం 
  • ఇసై- రాగయుక్తంగా పాడడానికి వీలైనవి 
  • నాటకం 

ఇయర్పా లో ముదలాళ్వార్లు (పొయిగై ఆళ్వార్, భూతత్తాళ్వార్, పేయాళ్వార్),  తిరుమజిశై ఆళ్వార్(నాన్ముగం తిరువందాది), నమ్మాళ్వార్ (తిరువిరుత్తం, పెరియ తిరువందాది, తిరువాసిరియమ్), తిరుమంగై ఆళ్వార్ల (తిరువేంజ్హుకూఱిరుక్కై, పెరియ తిరుమడల్ , శిరియ తిరుమడల్) ప్రబంధాలు ఉన్నాయి. 

నాలుగవ ఆయిరం లో నాథమునులు తిరువాయిమొళిని చేర్చారు. 

పత్తు, పదిగం, దశకం అంటే ఏమిటి?

సరిగ్గా 4000 పాశురాలు ఉన్నాయా?

నమ్మాళ్వార్లు “ఆయిరత్తుల్ ఇప్పత్తుమ్” అంటారు , అంటే వెయ్యి లో ఈ పది పాశురాలు అని. కానీ నిజానికి తిరువాయిమొళి లో 1102 పాశురాలు ఉన్నాయి. ఒక్కో పదిగం లో 11 పాశురాలు. ఒక్క “కేశవన్ తమర్” పదిగం లో మాత్రం 13 పాశురాలు. 

పదిగం అంటే?

10-11 పాశురాలను కలిపి పదిగం అంటారు. 10 పదిగాలు ఉంటే అది ఒక పత్త్తు. తిరువాయిమొళి లో 10 పత్తులు. పెరిమా తిరుమొళి లో 11 పత్తులు. 

పెరియాళ్వార్ల తిరుమొళి లో 5 పత్తులు, కానీ సారిగ్గా 500 కాదు, 461 పాశురాలు ఉన్నాయి. 

దివ్య ప్రబంధాలు మనకు ఎలా లభించాయి?

ముదలాళ్వార్లు, తిరుమజిశై ఆళ్వార్ ద్వాపరయుగం చివర లో అవతరించారు. నమ్మాళ్వార్ల నుండి మిగిలిన వారందరూ కలియుగం లో అవతరించారు. 

ఆళ్వార్లు అందించిన ప్రబంధాలు బహుళ ప్రాచుర్యం లో ఉండేవి. తిరుమంగై ఆళ్వార్లు కూడా అధ్యయనోత్సవాలు జరిపినట్టు మనకు తెలుస్తోంది. వారు నమ్మాళ్వార్ల పరమపదోత్సవం సందర్భంగా వారి పాశురాలను వైకుంఠ ఏకాదశి నుండి మొదలుపెట్టి 10 రోజుల పాటు సేవించారు. 

తరువాత కాలక్రమేణా పాశురాలు మెల్లగా మరుగున పడ్డాయి. చాలా కొద్దిమందికి, చాలా కొంచం మాత్రమే వీటి గురించి తెలిసేది. నాథమునులు మళ్ళీ వీటిని నమ్మాళ్వార్ల వద్ద నుండి స్వీకరించి ప్రచారంలోకి తెచ్చారు. 

మహాభారతం లో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎవరు, ఆయన మహిమ ఎట్టిదన్న సందేహం వస్తే, స్వామి భగవద్గీత లోని నాలుగవ అధ్యాయంలో చెప్తున్నాడు, “ నేను మొదట (ఈ జ్ఞానాన్ని) విశ్వావసువుకి చెప్పగా, తరువాత మను, ఇక్షువ్వాకు కి అందింది. కానీ ఒక సమయంలో అది కనుమరుగు అయ్యింది, అందుకే ఇప్పుడు నీకు చెప్తున్నాను” అన్నాడు. అప్పుడు అర్జునుడు “నీవు మనువు సమయం లో ఎల్లా ఉన్నావు?” అని అడుగగా, శ్రీ కృష్ణుడు,

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున 
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప” అన్నాడు. 

(మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి, ఓ అర్జునా. నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా)

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ 

(ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.)

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

(ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.)

అని ఎమ్పెరుమానార్ తన అవతార రహస్యాన్ని తెలిపాడు. నాలుగవ అధ్యాయంలో అక్కడ చెప్పబడ్డ జ్ఞానం కొన్నాలు కనుమరుగు అవ్వగా, మళ్ళీ ఉద్ధరింపబడిందని చెప్పినట్టుగానే, లుప్తం ఆయన దివ్య ప్రబంధాలని పరమాత్మ నాథమునుల ద్వారా ప్రకాశింపచేసాడు. 

ఒకమారు కొందరు శ్రీ వైష్ణవులు మేల్ నాడు (తిరునారాయణపురం ప్రాంతం) నుండి కాట్టుమన్నార్ కోయల్ కి వేంచేసి, తిరువాయిమొళి (5.8) “ఆరావముతే …” పాశురాలను పెరుమాళ్ళ సన్నిధిలో గానం చేస్తున్నారు. 

ఆ పాశురాల భావానికి పరశించిన నాథమునులు వారిని వివరం కోరగా, వారు తమకు ఆ 11 పాశురాలే వచ్చునని, మరిన్ని వివరాలు కావాలంటే తిరుక్కురుగూర్ వెళ్ళమని సూచించారు. నాథమునులు మన్నార్ (పెరుమాళ్లు) వద్ద శలవు తీసుకుని ఆళ్వార్ తిరునగరికి వేంచేయగా, వారికి మధురకవి ఆళ్వార్ల శిష్యులైన పరాంకుశదాసర్ కణ్ణినుణ్ శిరుత్తాంబు ఉపదేశం చేశారు. నమ్మాళ్వార్లు ఏ చింత చెట్టు (పులియాళ్వార్) ఛాయ లో వేంచేసి ఉండేవారో, అక్కడ ఏక పీఠంపై 12000 మార్లు అనుసంధానం చేయమని సాయించారు.  అప్పటికే అష్టాంగ యోగం లో ప్రవీణులైన నాథమునులు ఆ విధంగా చేయగా, నమ్మాళ్వార్లు ప్రసన్నులై సాక్షాత్కరించి 4000 పాశురాలు , వాటి అర్ధం సాయించారు. పెరుమాళ్ళ నుండి తమకు లభిన జ్ఞానాన్ని, నమ్మాళ్వార్  నాథమునులకు ప్రసాదించారు. ఈవిషయాన్ని ఉపదేశినరత్తినమాలై లో మణవాళ మహామునులు “ అరుళ్ పెఱ్ఱ నాథముని “ (నమ్మాళ్వార్ కృపకు పాత్రులైన నాథమునులు) అని అన్నారు. ఆ విధంగా నాథమునులు నమ్మాళ్వార్లకు శిష్యులైయ్యారు. అష్టాంగ యోగ నిష్ఠులైన నాథమునులు ఆ 4000 పాశురాలను, వాటి  అర్ధాన్ని గ్రహించి, కాటుమన్నారు కోయల్ కు వేంచేసి, పెరుమాళ్ళ ఎదుట నివేదించారు. అంత పెరుమాళ్లు ఎంతో సంతసించి, వారిని ఆ దివ్య ప్రబంధాన్ని విభజించి ప్రచారం చేయమని ఆజ్ఞాపించారు నాథమునులు అరుళిచెయల్ లోని 3000 పాశురాలను స్వరపరచి తమ మేనల్లుళ్లు అయిన కేజయయాగత్తాళ్వాన్ మరియు మేలైయాగత్తాళ్వాన్లకు నేర్పించారు.  వారి ద్వారా ఈ 3000 పాశురాలే కాక, మిగిలిన ఇయర్పా తో పాటు మొత్తం ప్రబంధాన్ని అఱైయర్ సేవగా (దివ్య ప్రబంధాన్ని నృత్య రూపకంగా పెరుమాళ్ల  ముందు నివేదించడం) ఏర్పరిచారు. నాథమునులు తరువాత ఉయ్యక్కొండార్ కి నేర్పించగా, వారు తమ శిష్యులైన మణక్కాల్ నంబికి నేర్పించారు, వారి నుండి నాథమునుల మనుమలైన ఆళవందార్ కి అందింది. ఆళవందార్లు సన్యాసి అయి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. వారి శిష్యుల్లో ప్రముఖులైన వారు పెరియ నంబి, పెరియతిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరుమలైయాణ్డాన్, దైవవారి ఆణ్డాన్, మారినేని నంబి మరియు తిరుకచ్చినంబి. కానీ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రుచించలేదు. పెరియ నంబి శిష్యులైన రామానుజులు దివ్యప్రబంధం అంటే ఎంతో అభిమానం కానీ, వారు వాటిపై వ్యాఖ్యానం రుచించలేదు. వారు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళం వారిని తిరువాయిమొళి పై వ్యాఖ్యానం రచించమని ఆజ్ఞాపించారు. 

ఆ తరువాత భట్టర్లు దివ్య ప్రబందానికి 6000 పడి వ్యాఖ్యానం ( 1 పడి  అంటే 32 అక్షరములు) ఆధారంగా అద్భుతమైన అర్ధం నంజీయర్ కు సాయించారు. వారి ఆజ్ఞ పై నంజీయర్ తిరువాయిమొళి కి 9000 పది వ్యాఖ్యానం రచించారు. నంజీయర్ శిష్యులైన నంపిళ్ళై స్వామి గొప్ప విద్వత్తు కలిగినవారు. వారికి కలివైరిదాసర్, లోకాచార్యర్ అని తిరునామములు కలవు. వారు తిరువాయిమొళి కాలక్షేపం చేస్తుంటే ఎంతోమంది వచ్చి సేవించుకునేవారు. నంపిళ్ళైవారి గోష్ఠియా, నమ్పెరుమాళ్ గోష్ఠియా? అని అనేవారు. నమ్పెరుమాళ్ తమ పుఱప్పడుకి ఏవిధంగా జనాన్ని ఆకర్షిస్తారో, నంపిళ్ళై స్వామి తన కాలక్షేపానికి అలా ఆకర్షించేవారు.  వారు దివ్య ప్రబంధానికి చక్కటి అర్ధం చెప్పేవారు. వారికి వడక్కు తిరువీధిపిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై మొదలైన శిష్యులు ఉండేవారు. పెరియవాచ్చాన్ పిళ్ళై దివ్య ప్రబంధానికి చక్కటి వ్యాఖ్యానం రచించారు, వారు దివ్య ప్రబంధానికి చేసిన సేవ అమోఘమైనది. వ్యాఖ్యానం లేకపోతే దివ్య ప్రబంధాన్ని అర్థం చేసుకోలేము. వారు ఆచార్యుల వ్యాఖ్యానాలు, వారు నంపిళ్ళై వారి వద్ద విన్న విషయమూ సంకలనం చేసి అద్భుతమైన వ్యాఖ్యానం రచించారు. 

అదే విధంగా, వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళై వారి వద్ద విన్న విషయాన్ని మొదటి సారిగా “ఈడు” వ్యాఖ్యానంగా  గ్రంధస్థం చేశారు. ఇవి వీరు ఇరువురూ మన సాంప్రదాయానికి చేసిన సేవ. వడక్కు తిరువీధి పిళై కి ఇద్దరు తిరుక్కుమారులు- పిళ్ళై లోకాచార్యర్, అళగియ మణవాళప్పెరుమాళ్ నాయనార్. వారు మన సంప్రదాయానికి రెండు రత్నాల వంటి వారు. వారి గొప్పతనం ఏమిటంటే, దివ్యప్రబంధం లో ఉన్న విషయానన్ని అందరికీ అర్థమైయే సరళ తమిళ భాషలో రహస్య గ్రంథాలుగా ఆసక్తి ఉన్న వారి కోసం ప్రసాదించారు. ఆ విధంగా వారు మన ప్రమాణాలని రక్షించారు. పిళ్ళైలోకాచార్యర్ తమ శ్రీవచన భూషణం లో తిరువాయిమొళి లోని గూడార్ధాన్ని తీసుకుంటే,  అళగియ మణవాళప్పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం లో తిరువాయిమొళి, ఆళ్వార్ల, దివ్య ప్రబంధం గొప్పతన్నాని వర్ణించారు. 

పిళ్ళై లోకాచార్యుల శిష్యులైన తిరువాయిమొళిపిళ్ళై ఆళ్వార్ తిరునగరి ని పునరుద్ధరించి, నమ్మాళ్వార్ల మూర్తిని తిరుక్కనాంబి (కేరళ) నుండి వేంచేపు చేసి  ప్రతిష్ఠ చేశారు. అక్కడి ఆలయ వ్యవస్థని పునరుద్ధరించి, రామానుజులవారికి  (భవిష్యద్ ఆచార్యర్ – నమ్మాళ్వార్లు నాథుమునులకు ప్రసాదించిన రామానుజుల తిరుమేని) క్షేత్రానికి పడమర వైపున ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి నాలుగు వైపులా చతుర్ వేధి మంగళం ఏర్పరిచి, అక్కడ కొన్ని శ్రీవైష్ణవ కుటుంబాలను ఆలయ నిర్వహణ కోసం నియోగించారు. 

నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానాన్ని ఈయున్ని మాధవ పెరుమాళ్ కి ఇవ్వగా, వారు తమ తిరుక్కుమారులైన ఈయన్ని పద్మనాభ పెరుమాళ్ కి అందించారు. వారి శిష్యులైన నాలురు పిళ్ళై తమ తిరుక్కుమారులైన నాలురు ఆచ్చాన్ పిళ్ళై కి ప్రసాదించారు. 

తిరువాయిమొళి పిళ్ళై ఈడు ని నాలురు ఆచ్చాన్ పిళ్ళై వద్ద సేవించారు. వారి కైంకర్యానికి ప్రసన్నులైన ఆచ్చాన్ పిళ్ళై స్వామి వారికి తమ తిరువారాధన పెరుమాళ్ళను (ఇనవాయర్ తలైవన్) అనుగ్రహించారు. ఆ విధంగా 36000 పడి  ప్రచారాన్ని పొందింది. తిరువాయిమొళి పిళ్ళై ఆళ్వార్ తిరునగరి లో వేంచేసి ఉండిపోయారు.   

వారి వైభావాన్ని విన్న మణవాళ మామునులు (ఆదిశేషుల అవతారం, రామానుజుల పునరావతారం) వారిని ఆశ్రయించారు. మణవాళ మామునులకు రామానుజాలంటే ఎంతో అభిమానం, అందుకే వారికి యతీంద్ర ప్రవణర్ అని పేరు వచ్చింది.  వారు రామానుజుల వారి సన్నిధి లో కైంకర్యం చేస్తుండేవారు. వారు అరుళిచ్చెయళ్, ముఖ్యంగా తిరువాయిమొళి, 3600 పడి వ్యాఖ్యానం లో నిష్ణాతులయ్యారు. తమ ఆచార్యుల ఆదేశానుసారం వారు శ్రీరంగానికి వేంచేసి, సంప్రదాయ ప్రచారం చేయసాగారు. శ్రీరంగానికి వెళ్లే ముందు ఆళ్వార్ల అనుమతి తీసుకుని వెళ్లారు. వారు దివ్య ప్రబంధానికి ఎంతో వైభవాన్ని తీసుకుని వచ్చారు. 

నమ్పెరుమాళ్ల ఆదేశం పై వారు అందరు కైంకర్యపరులు, ఆచార్యపురుషులు, జీయర్లు, శ్రీవైష్ణవులు మొదలైన వారి ముందు 3600 పడి వ్యాఖ్యాన కాలక్షేపం నిరాటంకంగా అనుగ్రహించారు. వారు 3600 పడి  తో పాటు మిగిలిన వ్యాఖ్యానాలైన 6000 పడి , 9000 పడి, 12000 పడి, మరియు 24000 పడి లో సాయించారు. ఇది సుమారుగా 10 నెలలు పట్టింది. ఆణి తిరుమూలం రోజున శాత్తుమరై పూర్తి అయ్యాకా, నమ్పెరుమాళ్ళు ఒక బాలుని రూపం లో వేంచేసి “శ్రీ శైలేశ దయాపాత్రం…” తనియన్ ను మణవాళ మామునులకు సమర్పించారు. 

మణవాళ మామునుల కాలం తరువాత నుండి దివ్యప్రబంధం వైభవంగా వర్ధిల్లుతోంది. వేదముల వలే, దివ్యప్రబంధములు కూడా అనాది. నమ్మాళ్వార్లు తిరువాయిమొళి ఏడవ పత్తులో (7.9.1 ) లో ఎమ్పెరుమాన్ తమను ఎమ్పెరుమాన్ వైభవం చెప్పటానికి ఒక పరికరంగా వాడుకున్నారని సాయించారు. 

ఎన్ఱరైక్కుమెన్నై, ఉయ్యక్కొండు పోగియ 
అన్రిక్కన్నరెన్నై తన్ ఆక్కి ఎన్నాళ్ తన్నై 
ఇన్ తమిళ్ పాడియ ఈశనై ఆదియాయ్ 
నిన్ఱ ఎం శోదియై ఎం శోల్లి నిర్రపనో 

(తొలిసారిగా ఇది అనాది అని అంగీకరించి, నన్ను అనుగ్రహించి, నన్ను నడిపించి, నాలో ఆయన కోసం మాత్రమే ఉండాలనే కోరికను కలిగించి, ఎటువంటి జ్ఞానం లేని నాచే పాడించుకుని, ఆయన నాలో ఉండడమే మూల కారణంగా ఉంది, అందుకోసం స్థిరంగా మారిన నా ప్రభువు ఈ మధురమైన తమిళ పాశురాలను తన మీద తానే పడుకున్నాడు. తన దివ్యమైన రూపమును చూపించిన ఆయన గురించి నేను ఏమి చెప్పగలను? అతను నన్ను మొదట తన పట్ల అనుకూలంగా ఉండటానికి అంగీకరించలేదని చెప్పాలా? అతను దానిని ముందుకు తీసుకెళ్లలేదని నేను చెప్పాలా? నేను పాడినట్లు చెప్పుకోవడానికి అతను వీటిని పాడలేదని చెప్పాలా? దాని వల్ల అతను ప్రకాశించలేదని చెప్పాలా? అంటే, “ఏమి చెప్పి నేను స్థిమిత పడగలను?”)

ఆధారం: https://youtu.be/r_AU-bU3kys

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/10/simple-guide-to-dhivyaprabandham-introduction/

మూలము : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org