Category Archives: telugu

ఆర్తి ప్రబంధం – 60

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 59

పరిచయము:

మాముణులు తమలో తాము ఇలా భావిస్తున్నారు – “మనం మన లక్ష్యం కోసం ఎందుకు ఆరాటపడాలి? పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి ప్రసాదించిన ప్రతిదీ క్రమంగా మనకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మనము ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల వద్ద సమర్పితులమై ఉన్నాము కాబట్టి. ప్రతిదీ మనకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనము ఎంబెరుమానార్ల సంతానము కాబట్టి”, అని భావిస్తున్నారు.  ఈ విధంగా, ఈ ఆఖరి పాశురములో, ఎంబెరుమానార్లకి పెరియ పెరుమాళ్ళు అనుగ్రహించిన వన్నీ తమకి కూడా దక్కుతాయని భావించి మాముణులు ఆనంద పడుతున్నారు.

మణవాళ మాముని తిరువడిగళే శరణం!!! 

పాశురము 60:

ఇంద అరంగత్తు ఇనిదు ఇరు నీయెన్ఱు అరంగర్
ఎందై ఎతిరాశర్ క్కింద వరం శిందై శెయ్యిల్
నమ్మదన్ఱో నెంజమే నఱ్ఱాదై సొంపుదల్వర్
తమ్మదన్ఱో తాయముఱై తాన్

ప్రతి పద్ధార్ధములు:

అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
ఇంద అరంగత్తు – ఈ కోయిల్లో (శ్రీ రంగంలో)
ఇనిదు ఇరు నీయెన్ఱు – “శ్రీరంగే సుఖమాస్వ” అని అన్నారు (సుఖంగా శ్రీ రంగంలో స్థిరమై)
ఎందై ఎతిరాశర్ క్కు – నా తండ్రి ఎంబెరుమానార్లకు
నెంజమే – ఓ నా మనసా!!!
శిందై శెయ్యిల్ – మనము దీని గురించి ఆలోచిస్తే
ఇంద వరం – పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి అనుగ్రహించిన విలువైన వరం
నమ్మదన్ఱో – ఆ వరం వాస్థవానికి మనది కూడా కదా?
నఱ్ఱాదై – ఎంబెరుమానార్లు మనకి కారణరహితమైన తండ్రి వంటివారు
తాయముఱై తాన్  – మన తల్లిదండ్రుల కారణంగా
సొంపుదల్వర్ తమ్మదన్ఱో – ఆస్థిపాస్థులన్ని కొడుకులకి దక్కుతాయి

(మాముణులు తమ హృదయంతో – “ఓ! నా ప్రియమైన మనసా. అందుకని, మన వంతు మనం ఏమీ చేయనవసరం లేదు. ప్రతిదీ మనకి సుళువుగా అందుబాటులో ఉంది. మన భారం మనకు ఇకపై భారంగా అనిపించదు (మాముణులకు కావలసినది అనుగ్రహించినట్లుగా, ఎంబెరుమానార్లు మన భారాన్ని భరిస్తారు).

 ముగింపు గమనిక:

పెరియ పెరుమాళ్ళు తన సంపద అయిన నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (పరమపదము కాని మిగిలిన అన్ని లోకాలు) రెండింటినీ ఎంబెరుమానార్లకి ప్రసాదించాడు. అందువల్ల, ఎంబెరుమానార్లను “శ్రీ విష్ణు లోక మణి మండప మార్గదాయి” (ధాటి పంచకం 5) అని వారిని కీర్తించారు. ప్రపన్నులందరికీ ఎంబెరుమానార్లు నాయకులు. “మణవాళ మామునిగళ్”, “యతింద్ర ప్రవణర్” అని ప్రఖ్యాతి గాంచిన ‘జీయర్’ తమను తాము అటువంటి ఎంబెరుమానార్లకి సంపూర్ణ శరణాగతులై వారికి ప్రపత్తి చేశారు. వారు పరమపదానికి వెళ్లి భగవానుడికి (మరియు భాగవతుల) నిత్య కైంకర్యం చేసే మహద్భాగ్యము పొందారు. అనగా, ఎంబెరుమానార్ల అభిమానము ఉన్న  ప్రతి ఒక్కరికీ ఇదే ఫలితం లభిస్తుంది అని అర్థం. దీనిని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలంటే, ఎంబెరుమానార్ల దివ్య చరణాలకు శరణాగతి చేసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట తనపై ప్రేమను కలిగింపజేసి, ఆపై వారిని ఒకేసారి పరమపదములోని పరమసుఖానుభవాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తారు.

సరళ అనువాదము:

ఈ చివరి పాశురములో, మాముణులు తాను కోరుకున్నది తనకి (ఎంబెరుమానార్ల సంబంధం వల్ల) లభించబోతున్నాదని ఎంబెరుమానార్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పరానందపడుతున్నారు. గద్య త్రయంలోని వాక్యాలను మనం గమనిస్తే, పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి సంపూర్ణ అధికారము ముందే ఇచ్చి ఉంచారు. ఎంబెరుమానార్ల సంతానము అవడం వలన, పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి ప్రసాదించిన ప్రతి వరము (ఈ శేష జీవితములో తాను చేసే కైంకర్యము నుండి పరమపదములో నిత్య కైంకర్యము వరకు) తనకి కూడా వారసత్వముగా లభిస్తుంది అని భావిస్తున్నారు.

వివరణ: 

మాముణులు తన హృదయంతో, “హే! నా ప్రియమైన మనసా! పెరియ పెరుమాళ్ళు మన తండ్రిగారైన ఎంబెరుమానార్లతో చెప్పిన ఒక విషయం గుర్తుందా! శరణాగతి గద్యములోని వారి పలుకులు గుర్తున్నాయా! మొదట వారు ఇలా అన్నారు, “ద్వయం అర్థానుసందానేన సహసదైవం వక్తా యావచ్చరీర పాతం అత్రైవ శ్రీరాంగే సుఖమాస్వ”. దీని తరువాత, వారు “శరీర పాద సమయేతు” నుండి మొదలై “నిత్యకింకరో భవిష్యసి మాతే భూదత్ర సంశయః ఇతి మయైవ హ్యుక్తం అత స్త్వం తవ తత్త్వతో మద్ జ్ఞాన దర్ష్న ప్రాప్తిషు నిస్సంశయః సుఖ మాస్వ” అని పలికారు.  ఈ ప్రపంచంలో తన శేష జీవిత ప్రయాణానికి అవసరమైన వాటితో పాటు, ఈ లోకాన్ని విడిచి పెట్టిన తర్వాత వారికి ఏమి లభించాలో (ఇది పరమపదంలో కైంకర్యం తప్ప మరేమీ కాదు) పెరియ పెరుమాళ్ళు స్వయంగా ఈ వరాలన్నీ మన తండ్రి అయిన ఎంబెరుమానార్లకి ప్రసాదించారు. పెరియ పెరుమాళ్ళు స్వయంగా ఈ వరాలన్నీ ఎంబెరుమానార్లకి ప్రసాదించారు. ఈ వరాలని మనం నిశితంగా పరిశీలిస్తే, ఎంబెరుమానార్ల సంతానమైన మనకి కూడా ఈ వరాలు వర్తిస్తాయి. ఎందుకంటే, తల్లిదండ్రుల సంపదను వారి పిల్లలు వారసత్వంగా పొందుతారు. అందువల్ల, నా ప్రియమైన మనసా! మనం ఇకపై మన స్వంతంగా దేని కోసం కష్టపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ మనకి సుళువుగా అందుబాటులో ఉంది, ఎంబెరుమానార్లకు ధన్యవాదాలు. పెరియ పెరుమాళ్ళు తన సంపద అయిన నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (పరమపదము కాని మిగిలిన అన్ని లోకాలు) రెండింటినీ ఎంబెరుమానార్లకి ప్రసాదించాడు. అందువల్ల, ఎంబెరుమానార్లను “శ్రీ విష్ణు లోక మణి మండప మార్గదాయి” (ధాటి పంచకం 5) గా కీర్తిస్తారు. ఎంబెరుమానార్లు అందరు ప్రపన్నులకు నాయకులు. “మణవాళ మామునిగళ్”, “యతింద్ర ప్రవణర్” అని ప్రఖ్యాతి గాంచిన ‘జీయర్’ అటువంటి ఎంబెరుమానార్లకి సంపూర్ణ శరణాగతులై వారికి ప్రపత్తి చేశారు. వారు పరమపదానికి వెళ్లి భగవానుడికి (మరియు భాగవతుల) నిత్య కైంకర్యం చేసే మహద్భాగ్యము పొందారు. అనగా, ఎంబెరుమానార్ల అభిమానము ఉన్న  ప్రతి ఒక్కరికీ ఇదే ఫలితం లభిస్తుంది అని అర్థం. దీనిని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలంటే, ఎంబెరుమానార్ల దివ్య చరణాలకు శరణాగతి చేసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట తనపై ప్రేమను కలిగింపజేసి, ఆపై వారిని ఒకేసారి పరమపదములోని అనంత సుఖానుభవాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తారు.

“ఎతిరాశా! ఎతిరాశా!” అని మాముణులు కీర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎంబెరుమానార్లు అందరు యతులకు నాయకుడు అన్న సందేశాన్ని ఇస్తున్నారు. వారి శిష్యులందరూ తమ నాయకుడైన “యతిరాజుల” నిరంతర నామ జపము చేసి వారికి మంగళము పాడుతారు. మాముణులు తమని తాము ఎంబెరుమానార్ల శిష్యులలో ఒకరిగా భావించి, “యధ్యస్సుదసత్వాః” ప్రకారం వారి నిరంతర నామ జపము చేయడానికి తాను కూడా అర్హుడు అని భావిస్తున్నారు. అందువల్ల, మాముణులు నిత్యమూ “ఎతిరాశా! ఎతిరాశా!” అన్న నామాన్ని జపించారు.

జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/04/arththi-prabandham-60/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 59

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 58

పరిచయము:

మాముణులు ఎంబెరుమానార్లతో ఇలా అంటున్నారు – “నాకు మరియు మీ పాద పద్మాల మధ్య ఉన్న సంబంధాన్ని నేను అర్థం చేసుకున్నాను (స్వాచార్యులైన  తిరువాయ్మొళి పిళ్ళైలకు ధన్యవాదాలు). నా ఈ శరీరాన్ని నాశనం ఎప్పుడు అయ్యి, ఆ తరువాత పెరియ పెరుమాళ్ళు (ఆత్మ శ్రేయస్సుని కోరేవారు) గరుడున్నిఅధీష్థించి వచ్చి తమ శ్రీముఖాన్ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఎంబెరుమానారే, మీరు ఈ పని ఎప్పుడు చేస్తారో దయచేసి చెప్పండి?” అని అడుగుతున్నారు.

పాశురము 59:

ఎందై తిరువరంగర్ ఏరార్ గరుడన్ మేల్
వందు ముగమ్ కాట్టి వళి నడత్త చిందై శెయ్దు
ఇప్పొల్లా ఉడంబుతనై పోక్కువదు ఎన్నాళ్కొలొ?
శొల్లాయ్ ఎతిరాశా! శూళ్ందు!!!

ప్రతి పద్ధార్ధములు:

ఎందై – (దేహాన్ని ఆత్మ విడిచిపెట్టే సమయంలో) నా యొక్క తల్లి తండ్రి
తిరువరంగర్ – పెరియ పెరుమాళ్ళు నివాసుడై ఉన్న కోయిల్ (శ్రీ రంగం) లో
ముగమ్ కాట్టి – నాకిష్ఠమైన కస్తూరి తిలకాన్ని, చిరు మందహాసాన్ని మొదలైనవి చూపిస్తారు.
వందు – నా వద్దకి వచ్చి
ఏరార్ గరుడన్ మేల్ – అందమైన వారి గరుడుని పైన
వళి నడత్త –  “అర్చరాది మార్గం” అనే దివ్య దారిగుండా తీసుకొని వెళతారు
ఎతిరాశా! – ఎంబెరుమానారే
శొల్లాయ్ – దయచేసి నాకు చెప్పండి
ఇప్పొల్లా ఉడంబుతనై పోక్కువదు ఎన్నాళ్కొలొ? – నా యొక్క ఈ నీచమైన శరీరం నాశనమై, ఆత్మ నిన్ను చేరుకునే రోజు ఎప్పుడు వస్తుంది?
చిందై శెయ్దు – దయచేసి ఆలోచించండి
శూళ్ందు –  దాని గురించి నాకు వివరించండి, దాని యొక్క ఖచ్చితత్వం గురించి తెలుసుకొని సంతోషిస్తాను. దయచేసి ఆలోచించండి.

సరళ అనువాదము:

శ్రీ రామానుజులను, తన ఈ శరీరాన్ని ఎప్పుడు తిరిగి తీసుకొని, తన కోసమే అంకిమై ఉన్న ఈ ఆత్మని ఏ రోజు విముక్తి చేస్తరని మాముణులు అడుగుతున్నారు. అది ఎప్పుడు జరగాలని నిర్ణయించుకున్నారని వారిని అడుగుతున్నారు. తమ చివరి క్షణాలలో ఏమి జరుగుతుందో కూడా వివరించారు. శ్రీరంగంలో ఉన్న పెరియ పెరుమాళ్ళు తన అందమైన గరుడునిపైన వస్తారని, “అర్చరాది మార్గం” గుండా తనని పరమపదానికి తీసుకువెళతారని మాముణులు వివరిస్తున్నారు.

వివరణ: 

“హే! శ్రీ రామానుజా! ముక్తి పొందాలనే ఏకైక లక్ష్యముగా ఉన్న నా ఈ శరీరాన్ని మీరు ఎప్పుడు ఏ రోజు నాశనం చేయబోతున్నారు? ఈ శరీరాన్ని విడిచిపెట్టే నా అంతిమ క్షణాలలో  “కోయిల్”/“శ్రీరంగం”లో నివాసుడై ఉన్న నా తల్లియు  తండ్రియు అయిన పెరియ పెరుమాళ్ళను నేను చూస్తాను. “అం చిరై పుళ్ పాగన్” అని తిరునేడుంతాండగం 6వ పాశురములో వర్ణించినట్లుగా, వారి అతి అందమైన గరుడునిపైన వేంచేస్తారు. ఆతడి కస్తూరి తిలకాన్ని, “నల్ కదిర్ ముత్త వెణ్ణగై చెయవాయ్” అని పెరియ తిరుమొళి 4.4.5 వ పాశురములో వర్ణించిన ఆతడి చిరునవ్వుని, చంద్రుడి లాంటి ఆతడి శ్రీముఖాన్ని నాకు దర్శింపజేస్తాడు. “శ్రీరంగంలో ప్రియమైనవాడిగా” లేదా “అరంగతుఱైయుం ఇంతుణైవనాన తాం” అని పెరియ తిరుమొళి 3.7.6 వ పాశురములో వర్ణించిన విధంగా, “నయామి పరమాం గతిం (వరాహ చరమ శ్లోకము) లో చెప్పినట్లుగా “అర్చరాది మార్గం” గుండా తనని పరమపదానికి తీసుకువెళతారని మాముణులు వివరిస్తున్నారు.  “అన్ చరణం తందు ఎన్ సన్మం కళైయాయే”, అని నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి 5.8.7వ పాసురములో పలికినట్లుగా, ఎంబెరుమానారే !!! మీ పాద పద్మాలను నాకు ఎప్పుడు ప్రసాదించి, నా ఈ జనన మరణ చక్రానికి పూర్ణ విరామం ఎప్పుడు ఇవ్వబోతున్నారు? అని మాముణులు అడుగుతున్నారు.

మీరు ఎప్పుడు నా ఈ శరీరాన్ని తిరిగి తీసుకొని ఈ ఆత్మను మీ సొంతము  చేయబోతున్నారు?  “పూర్ణే చతుర్దశే వర్షే” అని శ్రీ రామాయణం శ్లోకములో చెప్పినట్లుగా, అయోధ్యా రాజ్యానికి తిరిగి రావడానికి శ్రీ రాముడికి ఖచ్చితంగా 14 సంవత్సరాల కలము ఇవ్వబడింది.  శ్రీ రాముడు ఖచ్చితమైన ఆ కాలపరిమితి తరువాత తిరిగి వస్తారని తెలిసినందున భరతుడు వూరడి చెందాడు. “అరురోహరతం హృష్ఠః” అనే వాఖ్యము ప్రకారం, చీకటి తరువాత వెలుగుని చూడవచ్చని అతను కొంత ఆనందాన్ని పొందాడు. ఏదేమైనా, ఈ ఊరడింపులని నేను ఇక భరించలేకపోతున్నాను. కావున, దయచేసి నాకు సంతోషాన్నిచ్చే సమాధాన్ని ఇవ్వండి. ఇక్కడ “శూళ్ందు” అనే పదాన్ని “అవావర చ్చూళ్” (తిరువాయ్మొళి 10.10.11) మరియు “శొల్లు నీయాం అఱియ చ్చూళ్ందు” (పెరియ తిరువందాది 16)” అనే పదబంధంలో ఉపయోగించినప్పుడు అదే అర్థాన్ని కలిగి ఉంటుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-59/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 58

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 57

పరిచయము:

మాముణులు తమ మునుపటి పాశురములో “తిరువాయ్మొళి పిళ్ళై వాసమలర్ త్తాల్ అడైంద వత్తు” అని అన్నారు. తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య చరణ కమలాలను చేరిన తరువాత మాముణులు తనను తాను ఒక “వస్తువు” గా కీర్తిస్తున్నారు. దీన్లో ఇంకా లోతైన విషయము ఉందని చెబుతున్నారు. తిరువాయ్మొళి పిళ్ళై (ఆచార్య – శిష్య సంబంధం) లతో వారికున్న అనుబంధం వల్లనే, తాను శ్రీ రామానుజుల సంబంధం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం, అభినందించడం, అర్థం చేసుకోవడం జరిగాయని వారు వివరిస్తున్నారు.

పాశురము 58:

ఎందై తిరువాయ్మొళి పిళ్ళై ఇన్నరుళాల్
ఎందన్ ఉఱవై ఉణర్ త్తియ పిన్ ఇంద ఉయిర్ క్కు
ఎల్లా ఉఱవుం నీ ఎన్ఱే ఎతిరాశా
నిల్లాదదు ఉణ్డో ఎన్ నెంజు

ప్రతి పద్ధార్ధములు:

ఎందై – “తిరుమంత్రం మాతావుం, పితా ఆచార్యనుం  ఎన్ఱు అరుళిచ్చెవర్గళ్” అని ప్రసిద్ధ వాఖ్యము ఉంది. దాని ఆధారంగా నా తండ్రి తిరువాయ్మొళి పిళ్ళై. (మాముణులు చెబుతున్నారు)
తిరువాయ్మొళి పిళ్ళై – వారి
ఇన్నరుళాల్– నిర్హేతుక కృప
ఎందన్ ఉఱవై – (నాకు అర్థమయ్యేలా చేసింది) మీ (శ్రీ రామానుజుల) దివ్య చరణాల వద్ద అన్ని రకాల సంబంధాలు
ఇంద ఉయిర్ క్కు – వారి ఆ ఆత్మ పంచుకునే
ఉణర్ త్తియ పిన్ – నా అజ్ఞానాన్ని నాకు తెలియజేసి నన్ను రక్షించిన తరువాత
ఎతిరాశా– ఎంబెరుమానారే!!!
నీ ఎన్ఱే – నీవు కాదా?
ఎల్లా ఉఱవుం – తిరుమంత్రంలో ఉన్న అన్ని సంబంధాలను ఎవరిని సూచించబడింది?
ఎన్నెంజు నిల్లాదదు ఉణ్డో – నా మనస్సుని కదిలించేటటువంటి పరిస్థితి ఒకటేదైనా  ఉంటుందా? (స్పష్టంగా ఉండదు). “తందై  నఱ్ఱై తారం తనయర్ పెరుంజెల్వం ఎందనక్కు నీయే” మరియు “అల్లాద శుఱ్ఱముమాగి” లోని వాఖ్యాలను తెలుసుకోవడం మనకి తగును.

సరళ అనువాదము:

మాముణులు తమ ఆచార్యులు, ఆధ్యాత్మిక తండ్రి అయిన తిరువాయ్మొళి పిళ్ళైల కృప వల్లనే  శ్రీ రామానుజులతో తన ఆత్మ పంచుకునే భిన్న భిన్న సంబంధాలన్నింటినీ గ్రహించగలిగారని వివరిస్తున్నారు. ఇప్పటి వరకు తన్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి అతన్ని కాపాడింది వారి దయనే అని తెలుపుతున్నారు. దీని తరువాత, తన మనస్సు చంచలము అయ్యే పరిస్థితి అంటు ఉంటుందా? అని మాముణులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఉండదు అన్నది సమాధానము.

వివరణ: 

“తిరుమంత్రం మాతావుం, పితా ఆచార్యనుం ఎన్ఱు అరుళిచ్చెవర్గళ్” అని ప్రసిద్ధ వాఖ్యము ఒకటి ఉంది అని మాముణులు తెలుపుతున్నారు. దాని ఆధారంగా మాముణులు తమ ఆచార్యులు, ఆధ్యాత్మిక తండ్రి అయిన తిరువాయ్మొళి పిళ్ళైల కృప వల్లనే  శ్రీ రామానుజులతో తన ఆత్మ పంచుకునే భిన్న భిన్న సంబంధాలన్నింటినీ గ్రహించగలిగారని వివరిస్తున్నారు. హే ఎంబెరుమానారే!!! నా అజ్ఞానాన్ని నేను గ్రహించేలా చేసి నన్ను సంరక్షించిన తరువాత, తిరుమంత్రంలో అవ్యక్తంగా ఉన్న అన్ని సంబంధాలలో సూచించబడినది మిమ్మల్ని కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చెప్పిన తరువాత, నా హృదయం మనస్సు చంచలము అయ్యే పరిస్థితి అంటూ ఉంటుందా? (సమాధానం స్పష్టంగా లేదు). “తందై  నఱ్ఱై తారం తనయర్ పెరుంజెల్వం ఎందనక్కు నీయే” (ఆర్థి ప్రబంధం 3)” మరియు “అల్లాద శుఱ్ఱముమాగి” (ఆర్థి ప్రబంధం 54)” లోని అనుకూలమైన వాక్యములను  తెలుసుకోవడం మనకు తగును.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-58/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 57

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 56

పరిచయము:

శ్రీ రామానుజుల మనస్సులో ఒక ప్రశ్న ఉందని ఊహించిన మాముణులు, ఈ పాశురములో ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. శ్రీ రామానుజుల మనస్సులో ఉందని భావించిన ప్రశ్న ఈ విధంగా ఉంది. శ్రీ రామానుజులు అంటున్నారు – “హే మాముని! నేను మీ అభ్యర్థనలను విన్నాను. నీవు ఒక దాని తరువాత ఒకటి కొన్ని విషయాలను అడిగావు. నిన్ను నేను ఒక విషయము అడగవచ్చా? నీవు చేసిన ఈ విన్నపాలకి నీవైపు నుండి ఏదైన బలమైన శిఫార్సు ఉందా? ఎవరైనా ఉన్నారా?”. ఈ ప్రశ్నకు మాముణులు బదులు ఇలా ఉంది – “అవును. నా ఆచార్యులు  ‘తిరువాయ్మొళి పిళ్ళై’ లకి శరణాగతులైన తరువాత నన్ను నేను ఒక వస్థువుగా భావిస్తున్నాను. నా గొప్ప అర్హత అదే. దయచేసి నా వద్ద ఉన్నఈ అరుదైన వజ్రాన్ని పరిగణలోకి తీసుకోండి. హే ఎంబెరుమానారే! మీరు నాలో లోపాలను ఎన్నకండి.  ‘యతీశ్వర శృణు శ్రీమాన్ కృపయా పరయా తవ’ అని చెప్పినట్లుగా, దయచేసి ఈ దాసుని అల్ప మాటలను మీ చెవిలో పెడేలా చేయండి”.

పాశురము 57:

దేశిగర్గళ్ పోఱ్ఱుం తిరువాయ్మొళి పిళ్ళై
వాశమలర్ తాళ్ అడైంద వత్తువెన్నుం
నేశత్తాల్ ఎన్ పిళైగళ్ కాణా ఎతిరాశరే
అడియేన్ పున్పగర్వై కేళుం పొఱుత్తు

ప్రతి పద్ధార్ధములు:

వాశమలర్ తాళ్ అడైంద వత్తువెన్నుం – దివ్య సుగంధముతో నిండి ఉన్న వారి మృదువైన పాదాల యందు శరణాగతి చేసిన నేను ఒక వస్తువుని.
దేశిగర్గళ్ పోఱ్ఱుం తిరువాయ్మొళి పిళ్ళై – తిరువాయ్మొళి పిళ్ళైని “శెంతమిళ్ వేద తిరుమలయాళ్వార్ వాళి” అని మన పూర్వాచార్యులు కీర్తిస్తారు. నమ్మాళ్వార్లు, వారి గ్రంథాలను ఎంతగానో సేవించి, అపారమైన సేవాభావం ప్రదర్శించిన వ్యక్తి వారు. మాధుర్యముతో నిండిన నమ్మాళ్వార్ల పాశురములను ఊపిరిగా తమ జీవనము గడిపారు.
నేశత్తాల్ – ఈ సాంగత్యము కారణంగా
ఎతిరాశరే– ఎంబెరుమానారే!!!
కేళుం – దయచేసి వినండి
అడియేన్ – నేను
పున్పగర్వై – తక్కువైన మాటలు
ఎన్ పిళైగళ్ కాణా – నాలో తప్పులెంచకుండా, వాటిపైన దృష్థి పెట్టకుండా
పోఱ్ఱుం – కోప్పడకుండా

సరళ అనువాదము:

శ్రీ రామానుజులకు తిరువాయ్మొళి పిళ్ళై (వారి ఆచార్యులు) లతో ఉన్న గొప్ప అనుబంధాన్నికీర్తిస్తున్నారు మాముణులు. తన లోపాలను పట్టించుకోవద్దని, తన అల్ప మాటలను కోపగించు కోకుండా వినమని శ్రీ రామానుజులను ప్రార్థిస్తున్నారు.

వివరణ: 

మాముణులు శ్రీ రామానుజులతో ఇలా అంటున్నారు – “శెంతమిళ్ వేద తిరుమలయాళ్వార్ వాళి” అని తిరువాయ్మొళి పిళ్ళైని మన పూర్వాచార్యులు కీర్తించారు. అటువంటి వారి దివ్య సువానతో నిండిన చరణాలకు శరణాగతులైన నేను ఒక వస్తువు వంటి వాడను. నమ్మాళ్వార్లు  మరియు వారి గ్రంథాలకు ఎనలేని కృషిచేసి, అప్పరమైన దాస్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి వారు. మాధుర్యముతో నిండిన నమ్మాళ్వార్ల పాశురములను ఊపిరిగా తమ జీవనము గడిపారు”.

ఎంబెరుమానారే !!! ఈ  సంబంధము కారణంగా, దయచేసి నాలో లోపాలను ఎంచక వాటిపై దృష్టి పెట్టకుండా, దయచేసి ఈ దాసుని అల్ప మాటలను కోపగించుకోకుండా వినండి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-57/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 56

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 55

పరిచయము:

మునుపటి పాశురములో, “మధురకవి శొర్పడియే నిలయాగ ప్పెఱ్ఱోం” అని మాముణులు అన్నారు. దానికి సంబంధించి ఈ పాశురములో, వారు ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల యందు శాశ్వతమైన సేవని అభ్యర్థిస్తారు.

పాశురము 56:

ఉందన్ అభిమానమే ఉత్తారకం ఎన్ఱు
శిందై తెళిందిరుక్క చెయ్ద నీ
అందో యతిరాశా! నోయ్గళల్ ఎన్నై నలక్కామల్
శదిరాగ నిన్ తిరుత్తాళ్ తా

ప్రతి పద్ధార్ధములు:

యతిరాశా! – హే! యతులకు నాయకుడా!!!
ఉందన్ అభిమానమే ఉత్తారకం ఎన్ఱు – “ఆచార్య అభిమానమే ఉత్తారగం” (శ్రీ వచన భూషణం 447వ సూత్రములో) అని పిళ్ళై లోకాచార్యులు పలికినట్లు, మీకు (ఎంబెరుమానార్లకు) నా పైన ఉన్న భక్తి శ్రద్ధలు, జీవి యొక్క ఆత్మోద్ధారణకి కావసిన ఏకైక కారణహేతువు.
శిందై తెళిందిరుక్క చెయ్ద నీ – ఈ విషయము నా మనస్సులో ఎప్పటికీ పాతుకుపోయి ఉంటుంది. “తెళివుఱ్ఱ శిందైయర్అని తిరువాయ్మొళి 7.5.11వ పాశురములో చెప్పినట్లుగా, ఎంబెరుమానార్లు నా మనస్సు ఎప్పటికీ శుద్దముగా ఉండేలా దీవించారు.
అందో – అయ్యో!!!
తా – మీరు అనుగ్రహించాలి
ఎన్నై  – నేను
శదిరాగ – తెలివిగా
నిన్ తిరుత్తాళ్ – (సేవతో) మీ పాదపద్మాల యందు
నలక్కామల్– ప్రభావితం కాకుండా
నోయ్గళల్ – బాధలతో

సరళ అనువాదము:

మాముణులు ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల యందు కైంకర్యాన్ని కోరుతున్నారు. ఇది మునుపటి పాశురములో, “”మధురకవి శొఱ్పడియే నిలైయాగ ప్పెఱ్ఱోం” అని వారు కోరిన దానికి సంబంధించినది. “ఆచార్యుడు తన గురించి ఏమి ఆలోచిస్తున్నారన్నది, వారికి తనపై ఎంత భక్తి ఉందన్నది చాలా ముఖ్యము”, అన్న ఈ జ్ఞానం కూడా వారి దయతోనే తనకి కలిగించని వివరిస్తున్నారు. ఈ జ్ఞానము నా బుద్ది మనస్సులలో సజీవిమై ఉన్నది కూడా వారి కృప వల్లనే అని చెప్పుచున్నారు. అయ్యో! తన బాధలన్నింటినీ అంతం చేసి త్వరగా తమ పాద పద్మాల వద్దకి చేర్చమని మాముణులు ఎంబెరుమానార్లను అభ్యర్థిస్తున్నారు.

వివరణ: 

“హే! యతీల నాయకుడా! “ఆచార్య అభిమానమే ఉత్తారకం” అని శ్రీవాచన భూషణం 447) ప్రబంధాన్ని నాకు బోధించి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన వారు మీరు. దాని ఆధారంగా చూస్తే, నా పట్ల మీకున్న ప్రేమ భక్తులే నాకు సర్వస్వము. “తెళివుఱ్ఱ శిందైయర్” అని తిరువాయ్మొళి 7.5.11వ పాశురములో వివరించిన విధంగా ఈ మూలతత్వము నాలో పాతుకుపోయింది. మీ కృపతో నేను దాని అనుసరిస్తూ నడుచుకుంటున్నాను. కనీ,  కష్థాలను అనుభవించుకుంటూ ఈ ప్రపంచంలో ఉండేలా దయచేసి నన్ను ఇంకా చేయవద్దు “సుఖేనేమాం ప్రకృతిం స్థూల సూక్ష్మ రూపాం విశృజ్య” అని శరణాగతి గద్యములో మీరు చెప్పినట్లు, “ఉన్ పద యుగమాం యేర్ కొండ వీడు”, అని ఇరామానుజ నూత్తందాది 83వ పాశుర వివరణ ప్రకారము, మీరు నన్ను త్వరగా మీ చరణాల వద్దకు చేర్చుకొని, వాటికి నిత్య కైంకర్యము చేసేలా అనుగ్రహించాలి అని మాముణులు విన్నపించుకుంటున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-56/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 55

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 54

పరిచయము:

నిజమైన శిష్యుడిగా,  గొప్ప అనుచరుడిగా మనము రెండు విషయాలను తెలుసుకోవాలి.

(1) తమ ఆచార్యుడు తనకు చేసిన అన్ని ఉపకారాలను గురించి ధ్యానించడం.

(2) భవిష్యత్తులో ఆచార్యుడు అతనికి చేయబోయే వాటి పట్ల ఆసక్తి చూపించడం.

ఈ పాశురము ప్రత్యేకంగా మొదటి విషయము గురించి వివరిస్తుంది. ఎంబెరుమానార్లు తనకి ప్రసాదించిన అద్భుత గుణాలను మాముణులు కీర్తిస్తున్నారు. వారు ప్రతి ఒక్కటిని గుర్తు చేసుకొని, ఎంబెరుమానార్ల కృప కారణంగా తాను ఈ గుణాలను పొందగలిగారని మాముణులు చెప్పుచున్నారు.  

పాశురము 53:

తెన్నరంగర్ శీర్ అరుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోం
తిరువరంగం తిరుపదియే ఇరుప్పాగ ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మాఱంకలై ఉణవాగ ప్పెఱ్ఱోం
మధురకవి శొఱ్పడియే నిలైయాగ ప్పెఱ్ఱోం
మున్నవరాం నంకురవర్ మొళిగళుళ్ళ ప్పెఱ్ఱోం
ముళుదుం నమక్కవై పొళుదుపోక్కాగ  ప్పెఱ్ఱోం
పిన్నై ఒన్ఱు తనిల్ నెంజు పేరామఱ్పెఱోం
పిఱర్ మినుక్కం పొఱామయిల్లా ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే!!!

ప్రతి పద్ధార్ధములు:

ఇలక్కాగ ప్పెఱ్ఱోం – (మనము) లక్ష్యము అవుతాము
శీర్ అరుళుక్కు– నిర్హేతుక కృప
తెన్నరంగర్ – పెరియ పెరుమాళ్ళు, దక్షిణ దిశలో శ్రీలంక వైపు చూస్తూ, కళ్ళకు చాలా ఆహ్లాదకరమైన “కోయిల్” అనే చోటులో శయనించి, తన భక్తులను ఆకర్షిస్తూ అనుగ్రహిస్తున్నారు. (“అరుళ్ కొడుతిట్టు అడియవరై ఆట్ క్కొళ్వాన్ అమరుం ఊర్” (పెరియాళ్వార్ తిరుమోళి 4.9.3)
ఇరుప్పాగ ప్పెఱ్ఱోం –  “తెన్నాడుం వడనాడుం తోళ  నిన్ఱ తిరువరంగం తిరుప్పది (పెరియాళ్వార్ తిరుమోళి  4.9.11)”, “ఆరామం శూళ్ంద అరంగం (శిరియ తిరుమడళ్ 71)”, తలైయరంగం (ఇరండాం తిరువందాది 70) అని శ్రీరాంగ క్షేత్రాన్ని మన ఆళ్వార్లు వర్ణించిన ‘తిరువరంగం తిరుపదియే’లో నిత్య వాసము ఉండే అద్భుత  మహద్భాగ్యం లభించింది. ఈ క్షేత్రము అన్ని 108 దివ్య దేశాలలో ప్రధానమైనది.
ఉణవాగ ప్పెఱ్ఱోం – మా ఆహారము
కలై  – అతి మధురమైన పాశురములు (భక్తులకు తేనెలగా భగవానుడికి మాలగా)
మారన్ – నమ్మాళ్వార్లు
మన్నియ శీర్ – పరభక్తి మొదలైన శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు
నిలైయాగ ప్పెఱ్ఱోం –  “చరమ పర్వ నిష్ఠ” యొక్క చివరి దశకి చేరుకున్నము, దీనిని “యతీంద్రమేవ నీరంద్రం హిశేవే ధైవతంబరం” అని కీర్తిస్తారు. “ఉన్నయొళియ ఒరు దెయ్వం మఱ్ఱఱియా మన్నుపుగళ్ శేర్ వడుగనంబి తన్నిలైయై (అర్తి ప్రబంధం 11) అని నేను, నా సహచరులు కీర్తించడం ప్రారంభించాము.
శొఱ్పడియే – (ఈ చరమ పర్వ నిష్ఠ (సమస్థం మన ఆచార్యులే నని భావించుట) మధురకవుల దివ్య పలుకుల నుండి తీసుకోబడినవి. మధురకవి – “తేవు మఱ్ఱఱియేన్ (కణ్ణినున్ శిరుత్తాంబు 2)” అని మధురకవి ఆళ్వార్లు చెప్పినట్లు . (మనము మధురకవి ఆళ్వార్ల సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి).
మున్నవరాం నంకురవర్ మొళిగళుళ్ళ ప్పెఱ్ఱోం – మనము మన పూర్వాచార్యుల రచనలు, వారి దివ్య రహస్య ఉద్దేశ్యాలను అనుసరిస్తూ జీవించాలి. ఆళ్వారులు చూపిన బాటను అనుసరిస్తూ జీవించిన ఆచార్యుల రచనలు ఇవి.
ముళుదుం నమక్కవై పొళుదుపోక్కాగ  ప్పెఱ్ఱోం – మనము మన సమయాన్ని వారికి కైంకర్యము చేస్తూ గడిపాలి. మన పూర్వాచార్యుల ఈ దివ్య రచనలను అనుసరిస్తూ వేళ్ళగలిగితే మన మనస్సు భ్రమించదు.
పిన్నై ఒన్ఱు తనిల్ నెంజు పేరామఱ్పెఱోం – మన పూర్వాచార్యుల ఈ రచనలు మన మనస్సులను ఎన్నడూ ఎక్కడికీ వెళ్ళ నివ్వవు,
ఒన్ఱు తనిల్ – మన పూర్వాచార్యుల రచనలు తప్పించి ఇతర రచనలు
పిఱర్ మినుక్కం పొఱామయిల్లా –  ఎంబెరుమానార్ల దయతో  మనకు లభించిన ఈ గుణాలు తక్కెడలో ఒక వైపు ఉంచితే, నేను ఇప్పుడు చెప్పబోయేది పైన పేర్కొన్న వాటికి సమానమైనది లేదా బరువైనదిగా ఉంటుంది. “ఇప్పడి ఇరుక్కుం శ్రీవైష్ణవర్గల్ ఎఱ్ఱం అఱిందు ఉగందు ఇరుక్కైయుం (ముముక్షుపడి ద్వయ ప్రకణం 116)” లో వర్ణించినట్లు పైన చెప్పిన అన్ని గుణాలతో అంత అరుదైన శ్రీవైష్ణవుడు ఎదురైతే, వారిని చూసి ఎప్పుడూ మనము అసూయపడము. ఎంబెరుమానార్లు మనకి ఇచ్చిన కీర్తి అలాంటిది.
ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే – మనకు అది దొరికింది! అయ్యో! మనము ఎంత అదృష్టవంతులము. ఎంబెరుమానార్ల నిర్హేతుక కృపకు ధన్యవాదాలు.

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు ఎంబెరుమానార్ల  దయని కీర్తిస్తున్నారు. ఎంబెరుమానార్లకు తన పట్ల ఉన్న అనంతమైన దయ కారణంగానే అతనిలో కొన్ని విలువైన గుణాలు వచ్చాయని మాముణులు వివరిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళ అనుగ్రహం అందించడం కోసం వాళ్ళను (తాను, ఇతర శ్రీవైష్ణవ సహచరులు) ఎంచుకున్నారని, మొత్తం 108 దివ్య దేశాలలో ప్రముఖమైన శ్రీరంగంలో నివాసముండే అద్భుతమైన అవకాశం వారికి లభించిందని, వారు భుజించడానికి, త్రాగడానికి, పీల్చుకోడానికి నమ్మాళ్వార్ల రచనలు ప్రతి రోజు లభించే అరుదైన ఆశీర్వాదాలు పొందారని మాముణులు కీర్తిస్తున్నారు. చరమ పర్వ నిష్ఠ (తమ ఆచార్యులే సర్వస్వము అని భావించుట) ని మధురకవి ఆళ్వార్లు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం జీవించడానికి వారికి చక్కని అవకాశము లభించిందని వారు కీర్తిస్తున్నారు. ఇలా అతి అరుదుగా జరుగుతుంది. ఆళ్వార్ల దివ్య సూచనలను అనుసరిస్తూ జీవించిన మన పూర్వాచార్యులు (వారు శ్రీవైష్ణవ గ్రంథాలు తప్ప మరే ఇతర వాటి వద్దకు వెళ్ళలేదు. వాటిని అనుసరిస్తూ తమ జీవితాలను గడిపారు), వాళ్ళ బాటలో నడుచుకునే భాగ్యము మనకి లభించినది.  చివరగా అతి ముఖ్యమైనది, పైన పేర్కొన్న అన్ని లక్షణాలతో అటువంటి శ్రీవైష్ణవుడు ఎదురుపడితే, వారిని చూసి ఎప్పుడూ అసూయ చెందరు. పైగా సంతోషిస్తారు అని వివరిస్తూ తమకు లభించిన ఈ అదృష్టాలన్నీ కేవలం ఎంబెరుమానార్ల  ఆశీర్వాదం వల్లనే అని మాముణులు కీర్తిస్తున్నారు.

వివరణ: 

మాముణులు ఇలా అంటాడు, “శ్రీలంక దిశలో దక్షిణం వైపు ఉన్న ఆహ్లాదకరంగా “కోయిల్” లో శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ళ కారణ రహిత కృపకు మేము పాత్రులమైనాము. “అరుళ్ కొడుతిట్టు ఆడియవరై ఆట్కొళ్వాన్ అమరుం ఊర్” అని పెరియాళ్వార్ తిరుమొళి 4.9.3వ పాశురములో చెప్పినట్లుగా, అందరినీ ఆకర్షిస్తూ పెరియ పెరుమాళ్ళ తన భక్తులను ఆశీర్వదిస్తున్నారు. “తెన్నాడుం వడనాడుం తొళ నిన్ఱ తిరువరంగం తిరుప్పది” అని పెరియాళ్వార్ తిరుమొళి 4.9.11 వ పాశురములో వర్ణించినట్లుగా , “ఆరామమ్ శూళ్ంద అరంగం” అని శిరియ తిరుమడల్ 71వ పాశురములో చెప్పినట్లుగా, “తలైయరంగం” అని ఇరండాం తిరువందాది 70వ పాశురములో వర్ణించినట్లుగా, అటువంటి శ్రీరంగంలో నివాసము ఉండే అద్భుత అవకాశం మాకు లభించింది. అన్ని 108 దివ్య దేశాలలోకి శ్రీ రంగము ప్రధానమైనది. పరభక్తి మొదలైన పవిత్ర గుణాలతో, మాధుర్యముతో నిండి ఉన్న నమ్మాళ్వార్ల పాశురములు ఇక్కడ మాకు ఆహారము. “యతీంద్రమేవ నీరంద్రం హిశేవే దైవతంబరం” అని కీర్తించబడే “చరమ పర్వ నిష్ట” కి మనము చేరుకున్నాము. నేను, నా సహచరులు దానిని మనమము చేయ ప్రారంభించాము. “ఉన్నైయొళియ ఒరు దెయ్వం మఱ్ఱఱియా మన్నుపుగళ్ శేర్ వడుగనంబి తన్నిలైయై” అని ఆర్థి ప్రబంధం 11 వ పాశురములో చెప్పినట్లుగా, నా సహచరులతో నేను వాటి గురించి చర్చించడం మొదలుపెట్టాము. చరమ పర్వ నిష్ఠ యొక్క ఈ సిద్ధాంతం (సమస్థము తమ ఆచార్యులే అన్న నిష్ఠ)  “తేవు మఱ్ఱఱియేన్” అని కణ్ణినున్ చిరుత్తాంబు 2 వ పాశురములోని మధురకవి ఆళ్వార్ల దివ్య పలుకుల నుండి ఉద్భవించింది. మధురకవి ఆళ్వార్ల నిష్ఠని మనము అనుసరించి నడుచుకోవాలి. మధురకవి ఆళ్వార్లని సూచిస్తూ, “అవర్గళై చ్చిరిత్తిరుప్పార్ ఒరువర్ ఉణ్డిరే” అని శ్రీ వచన భూషణము 409 వ సూత్రములో వివరించబడింది. (ఇతర 10 ఆళ్వార్లను చూసి, పెరుమాళ్ళను చేరుకోవటానికి వారి విధానంలో విశ్వసనీయత లేదని, మధురకవి ఆళ్వార్ల విషయంలో వారికి సర్వస్వము నమ్మాళ్వార్లు అని వారి భావన). మనము మన పూర్వాచార్యుల రచనలను పరిశోదిస్తూ వారి దివ్య రహస్యాలను శ్వాసిస్తూ జీవించాలి. ఆళ్వార్లు చూపించిన బాటలో నడుచుకొన్న మన పూర్వాచర్యుల రచనలు ఇవి. ఈ రచనలలో జీవితము సాగిస్తూ సమయము గడిపాము. మన పూర్వాచర్యుల ఈ దివ్య రచనలలో మన మనస్సు ఎంతగా ఇమిడిపోయి ఉందంటే వీరి రచనలు తప్పా ఇతరమైన దేనిపైన మనము ఆధరపడే అవసరము ఉండదు.

ఎంబెరుమానార్ల దయతో మనము పొందిన ఈ పైన పేర్కొన్న గుణాలను తక్కేడలో ఒక వైపున ఉంచితే, నేను ఇప్పుడు చెప్పబోయేది పైన పేర్కొన్న వాటికి సమానమైనది లేదా బరువైనదిగా ఉంటుంది. “ఇప్పడి ఇరుక్కుం శ్రీవైష్ణవర్గల్ ఏఱ్ఱం అన్ఱిదు ఉగందు ఇరుక్కైయుం” అని ముముక్షుపడి ద్వయ ప్రకరణం 116వ సూత్రములో చెప్పినట్లుగా ఈ గుణాలతో ఉన్న అటువంటి అరుదైన శ్రీవైష్ణవుడు కనబడితే, వాళ్ళను చూసి ఈర్ష్యానుభవం మనకు కలగదు. అటువంటి గుణము మనకి ఎంబెరుమానార్ల దయతో లభించింది. ఆహా! ఎంతటి అదృష్థము.  ఎంబెరుమానార్ల నిష్కామ కృపకి ధన్యవాదాలు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-55/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినాంగాం తిరుమొళి – పట్టి మెయ్ందోర్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< పదిన్మూన్ఱాం తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం

తిరుప్పావైలో, ఆండాళ్ ప్రాప్యం (అంతిమ ప్రయోజనం) మరియు ప్రాపకం (దానిని పొందుటకు సాధనము అని అర్థం) స్థాపితము చేసింది. ఆమె ఫలితాన్ని పొందలేదు కాబట్టి, ఆమె ఆందోళనతో నాచ్చియార్ తిరుమొళిలో, మొదట్లో కాముని (మన్మధుడు) పాదాలను ఆశ్రయించింది. ఆ తర్వాత, ఆమె తెల్లవారుజామున స్నానము (పనినీరాట్టం) ఆచరించింది; ఆమె కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి వలయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించింది; కోకిల పలుకులు వినింది; ఎంబెరుమానుని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనుకుంది, కానీ అది కూడా ఫలించకపోవడంతో, తన కలలలో అతడిని అనుభవించి తనను తాను కాస్త నిలపుకుంది; ఎంబెరుమానుని దివ్య నోటి అమృతాన్ని గురించి శ్రీ పాంచజన్య ఆళ్వాన్ని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించింది; ఎంబెరుమానుని గురించి మేఘాలను అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించింది, ఆ మేఘాలను అతని వద్దకి దూతగా పంపించి; నిండుగా వికసించిన పుష్పాలు ఎంబెరుమానుని గుర్తుచేస్తున్నాయని దుఃఖించింది; అవి ఆమెను ఎలా హింసించాయో వర్ణించింది; ఆమె ఆడపిల్లగా ఎలా పుట్టిందో గుర్తు చేసుకుంది, ఇంకా  ఎంబెరుమానుని చూడలేకపోయేసరికి ఆతడు పెరియాళ్వార్ల కోసం తప్పక వస్తాడని తనను తాను ఓదార్చుకుంది, అయినా రాకపోయేసరికి ఎలాగైనా సరే ఆతడి నివాస ప్రదేశాలకు తీసుకెళ్లమని చుట్టు పక్కల ఉన్న వారిని ప్రార్థించింది; తనను తాను నిలబెట్టుకోడానికి ఆతడు ధరించిన పీతాంబరము, మాల మొదలైన వస్తువులను తీసుకురమ్మని వారిని కోరింది;  అప్పుడు కూడా ఎంబెరుమానుడు రాలేదు.

ఆమె ప్రపన్న కులంలో జన్మించినప్పటికీ, ఎంబెరుమానుడు పట్ల ఆమెకున్న అమితమైన ప్రేమయే ఆమె ఈ స్థితికి కారణము. ఎంబెరుమానుడు కూడా ఆమె పరమభక్తి స్థితిని చేరుకోవాలని వేచి ఉన్నాడు (భగవానుడితో కలిసి ఉంటేనే జీవించగలరు, భగవానుడి నుంది విడిపోతే జీవించలేని స్థితి). నమ్మాళ్వార్లలాగా, అతన్ని బలవంత పెట్టినా సరే, భగవానుని చేరుకోవాలని ఆండాళ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విరహ వేదన పొంగి ప్రవహించుటచే, ఆమె దయతో ఈ పదిగంలో “కండీరే” (ఎవరో ప్రశ్న అడుగుతున్నట్లు) మరియు “కండోమే” (ఆ వ్యక్తి ప్రతిస్పందిస్తున్నట్లు) తెలుపుతుంది.

ఆమె ప్రయత్నాలను చూస్తుంటే, ఆమె అతడిని పొందడానికి భగవానుడు తప్పా ఇతరోపాయాలని ప్రయత్నిస్తోందని మనం చెప్పగలమా? లేదు, అలా చెప్పలేము. ఆమె ఈ పరిస్థితికి కారణం ఎంబెరుమానునిపైన ఆమెకున్న అత్యధిక ప్రేమ, ఎంబెరుమానుని ఔన్నత్యము, అతని విరహం భరించలేకపోవడం వల్ల మాత్రమే; ఆమె ఇతరోపాయములను అనుసరించి ఈ చర్యలను చేయలేదు. అవి ఆమె స్వరూపానికి తగినవి కావు. భగవానుడే సాధనము అని భావించేవారు ఇతర మార్గాల గురించి ఆలోచించరు.

మొదటి పాశురము: తన పరమపద అనుభవాన్ని పక్కన బెట్టి,  శ్రీగోకులంలోని వెన్నని అనుభవించాలని, నప్పిన్నై పిరాట్టితో వివాహమాడాలన్న కోరికతో ఇక్కడ అవతరించాడు. తన కోరిక ప్రకారం వృందావనం (బృందావనం) లో స్వేచ్ఛగా విహరించి గొప్పతనాన్ని పొందాడు.

పట్టి మేయ్ందోర్ కారేఱు బలదేవఱ్కు ఓర్ కీళ్ క్కన్ఱాయ్
ఇట్టీరిట్టు విళైయాడి ఇంగే పోదక్కండీరే?
ఇట్టమాన పశుక్కళై ఇనిదు మఱిత్తు నీరూట్టి
విట్టుక్కొండు విళైయాడ విరుందావనత్తే కండోమే

నల్లని వృషభములా (ఎద్దు) ఉండే కృష్ణుడు, తనకి సాటిలేని వాడిలా  ఎలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా వృందావనంలో విహరించేవాడు. ఆతడు బలదేవుడి (బలరాముడు) విధేయుడైన విశేష సోదరుడు. ఆతడి సంతోషం కోసం అన్నో ఆటలాడి అతనిని మెప్పించేవాడు. మీరు అవన్నీ చూశారా? వృందావనంలో, తనకి ఇష్టమైన పేర్లతో కృష్ణుడు ఆవులను పిలవడం, వాటిని నీళ్లు తాగడానికి తీసుకెళ్లడం, వాటిని మేపడానికి తీసుకెళ్లడం, ఆడుకోవడం మేము చూశాము అని అంటున్నారు.

రెండవ పాశురము: ఆతడు వనమాల వైజయంతిని (దివ్య మాల) ధరించి వృందావనంలో తన సఖులతో ఆడుకోవడం వాళ్ళు చూశారని ఆమె తెలుపుతుంది.

అనుంగ ఎన్నైప్పిరివు శెయ్దు ఆయర్పాడి కవర్ందుణ్ణుం
కుణుంగు నాఱిక్కుట్టేఱ్ఱై గోవర్థనైక్కండీరే?
కణంగళోడు మిన్మేగం కలందార్పోల్ వనమాలై
మినుంగ నిన్ఱు విళైయాడ విరుందావనత్తే కండోమే

నా నుండి దూరమై నన్ను దుఃఖ సాగరంలో ముంచి, శ్రీగోకులాన్ని చేజిక్కించుకొని, ఆవులను మేపుతూ, ఆనందిస్తూ, వెన్న వాసనతో ఉన్ననల్లని ఎద్దులా కనిపించే కృష్ణుడిని మీరు చూశారా? నల్లని మేఘం మరియు మెరుపులు ఒకేసారి కనిపిస్తున్నట్లుగా, తన నల్లటి దివ్య స్వరూపంపై తెల్లటి వనమాలతో వృందావనంలో ఆతడి మిత్రులతో ఆడుకోవడం మేము చూశాము.

మూడవ పాశురము: వృందావనం ఆకాశంలో గరుడాళ్వాన్ తన రెక్కలను కృష్ణుడిపై గొడుగులా చాచి కైంకర్యం చేస్తుండటం వాళ్ళు చూశారని ఆమె తెలుపుతుంది.

మాలాయ్ ప్పిఱంద నంబియై మాలే శెయ్యుం మణళానై
ఏలా ప్పొయ్గళ్ ఉరైప్పానై ఇంగే పోదక్కండీరే?
మేలాల్ పరంద వెయిల్ కాప్పాన్ వినదై శిఱువన్ శిఱగెన్నుం
మేలాప్పిన్ కీళ్ వరువానై విరుందావనత్తే కండోమే

అన్నీ అబద్ధాలు చెప్పేవాడు, అందరికీ ప్రియ వరుడైనవాడు, గోపికలకై దివ్య అవతారము ఎత్తిన ఆ కృష్ణుడిని ఇక్కడెక్కడైనా చూశారా? దహించే సూర్య కిరణాలు ఎంబెరుమానుడి నల్లని దివ్య తిరుమేనిపైన పడకూడదని, ఆకాశంలో గరుడాళ్వాన్ తన రెక్కలను గొడుగులా చాచి ఉండటం మేము వృందావనంలో చూశామని అంటున్నారు.

నాలుగవ పాశురము: నల్లని ఏనుగు పిల్లలా కనిపించే అద్భుతమైన ఎమ్పెరుమానుని చూచి ఆమె ఆనందిస్తుంది.

కార్ త్తణ్ కమలక్కణ్ ఎన్నుం నెడుంగయిఱు పడుత్తి ఎన్నై
ఈర్ త్తుక్కొండు విళైయాడుం ఈశన్ తన్నైక్కండీరే?
పోర్ త్తముత్తిన్ కుప్పాయ ప్పుగర్మాల్ యానై క్కన్ఱే పోల్
వేర్ త్తు నిన్ఱు విళైయాడ విరుందావనత్తే కండోమే

నల్లని మేఘములపై వికసించిన చల్లని తామరపువ్వుల వంటి దివ్య నేత్రాలు కలిగి ఉన్నవాడు ఎమ్పెరుమానుడు. ఆ దివ్య నేత్రాలు ఒక తాడులా నన్ను కట్టివేసుకుని, నా హృదయాన్ని తన వైపుకి లాక్కుని ఆడుకుంటున్న సర్వేశ్వర భగవానునుని మీరు చూశారా? తన వొల్లంతా ముత్యాలలా మెరిసే చెమట బిందువులతో ఆడుకుంటూ ఒక ఏనుగు పిల్లలా ఉన్న అతడిని వృందావనంలో మేము చూశాము అని వారు అంటున్నారు.

ఐదవ పాశురము: నల్లని మేఘాల మద్య మెరుపులు మెరుస్తున్నట్లుగా ఎమ్పెరుమానుడు తన దివ్య పితాంబరాన్ని ధరించి వీధిలో తిరుగుతున్నాడని ఆమె వివరిస్తుంది.

మాదవన్ ఎన్ మణియినై వలైయిల్ పిళైత్త పన్ఱి పోల్
ఏదుం ఒన్ఱుం కొళత్తారా ఈశన్ తన్నైక్కండీరే?
పీదగ ఆడై ఉడై తాళప్పెరుంగార్ మేగక్కన్ఱే పోల్
వీదియార వరువనై విరుందావనత్తే కండోమే

నీలిమణిలా నాకు అతి మధురమైనవాడు, వల నుండి తప్పించుకున్న వరాహంలా గర్వంగా ఉన్నవాడు, తన వద్ద ఉన్న వాటిని ఎవ్వరికీ ఇవ్వనివాడు, శ్రీమహాలక్ష్మికి పతి అయిన గొప్ప సర్వేశ్వరుని మీరు చూశారా? నల్లని మెఘవర్ణంతో ఉన్న ఎమ్పెరుమానుడు క్రిందకు వ్రేలాడుతూ తన దివ్య పీతాంబరాన్ని ధరించి వృందావనం వీధులలో స్వేచ్ఛగా విహరిస్తుండగా మేము చూశాము.

ఆరవ పాశురము: ఉదయగిరి (సూర్యుడు ఉదయించే పర్వతం) నుండి ఉదయించే సూర్యుని మాదిరిగానే ఎర్రటి తేజస్సుతో తన నల్లని దివ్య స్వరూపంతో వాళ్ళు ఆతడిని చూశారని ఆమె వివరిస్తుంది.

దరుమం అఱియక్కుఱుంబనై త్తన్ కైచ్చార్ంగం అదువే పోల్
పురువ వట్టం అళగియ పొరుత్త మిలియై క్కండీరే?
ఉరువు కరిదాయ్ ముగం శెయ్ధాయ్ ఉదయప్పరుప్పదత్తిన్ మేల్
విరియుం కదిరే పోల్వానై విరుందావనత్తే కండోమే

నిత్యం అల్లరి చేస్తూ ఉండేవాడు, తాను చేత పట్టిన ‘సార్న్గ’ విల్లువంటి దివ్య కనుబొమ్మలతో అందంగా అలంకరించబడినవాడు, దయ అనే మాటకి అర్థం తెలియనివాడు, తన అనుచరులతో పొందిక లేని ఎంబెరుమానుడిని మీరు చూశారా? వృందావన పర్వతం నుండి ఉదయించే సూర్యుని వలె ఎర్రటి తేజస్సును కలిగి దివ్య స్వరూపముతో ఉన్న ఆతడిని మేము చూశాము.

ఏడవ పాశురము: ఆకాశంలో తారలలాగా వృందావనంలో ఎంబెరుమానుడు తన స్నేహితులతో కలిసి రావడం వాళ్ళు చూశారని ఆమె తెలిపింది.

పొరుత్తం ఉడైయ నంబియై ప్పుఱం పోల్ ఉళ్ళుం కరియానై
కరుత్తై పిళైత్తు నిన్ఱ అక్కరుమా ముగిలై క్కండీరే?
అరుత్తి త్తారా కణంగళాల్ ఆరప్పెరుగు వానం పోల్
విరుత్తం పెరిదాయ్ వరువానై విరుందావనత్తే కండోమే

తన దివ్య స్వరూపం వలె నల్లని హృదయం కూడా కలవాడు [ఎటువంటి దయ లేని], నా భావనలకు భిన్నమైన ఆ నల్లని మేఘవర్ణుడు, అందరికీ స్వామి అయిన కృష్ణుడిని మీరు చూశారా? నక్షత్రాలతో నిండిన ఆకాశంలా, అనేక మంది తన స్నేహితుల మధ్య ఉన్న ఎంబెరుమానుడిని  వృందావనంలో మేము చూశాము.

ఎనిమిదవ పాశురము: తన దివ్య భుజాల వరకు మెరుస్తున్న అందమైన శిరోజాలతో ఎమ్పెరుమాన్ ఆడుకోవడం వాళ్ళు చూశారని ఆమె వివరిస్తుంది.

వెళియ శంగు ఒన్ఱు ఉడైయానై ప్పీదగ ఆడై ఉడైయానై
ఆళి నంగుడైయ తిరుమాలై ఆళియానై క్కండీరే?
కళి వండు ఎంగుం కలందాఱ్పోళ్ కమళ్ పూంగుళల్గళ్ తడందోళ్ మేల్
మిళిర నిన్ఱు విళైయాడ విరుందావనత్తే  కండోమే

సాటిలేని తెల్లటి శ్రీ పాంచజన్యం (దివ్య శంఖం), దివ్య పట్టు పీతాంబరములు ధరించినవాడు, కరుణామయుడు, దివ్య చక్రాన్ని ధరించిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన ఆ కృష్ణుడిని మీరు చూశారా? తేనేను త్రాగిన భ్రమరాలు ఆనందంతో విహరిస్తున్నట్లు సుగంధభరితమైన ఆతడి దివ్య శిరోజములు తన దివ్య భుజాలపై శోభాయమానంగా వేలాడుతుండగా ఆయన మాకు వృందావనంలో దర్శనమిచ్చాడు.

తొమ్మిదవ పాశురము: వృందావన అడవుల్లో రాక్షసులను వేటాడే ఎంబెరుమానుడిని వాళ్ళు చూశారని ఆమె వివరిస్తుంది.

నాట్టై పడై ఎన్ఱు అయన్ ముదళాత్తండ నళిర్ మామలర్ ఉంది
వీట్టై పణ్ణి విళైయాడుం విమలన్ తన్నై క్కండీరే?
కాట్టై నాడి త్తేనుగనుం కళిఱుం పుళ్ళుం ఉడన్ మడియ
వేట్టై ఆడి వరువానై విరుందావనత్తే  కండోమే

బ్రహ్మ మరియు అతను ఉండుటకు నివాసాన్ని తన నాభీ కమలములో సృష్థించినవాడు. ఆపై ప్రజాపతులకు (సృష్థి చేయువారు) సృష్థి కార్యము చెయ్యమని ఆదేశించి తాను ఆడే రసాన్ని ఆనందించిన ఆ ఎంబెరుమానుని మీరు చూశారా? ధేనుకాసురుడిని, కువలయాపీడమ్ ఏనుగుని, బకాసురుడిని వధించిన కృష్ణుడిని మేము చూశాము.

పదవ పాశురము: ఈ పది పాశురాలని నిత్యం ధ్యానించేవారు ఎంబెరుమానునితో విడదీయరాని విధంగా ఉంటారని, ఆయనకు కైంకర్యాన్ని నిర్వహిస్తారని చెబుతూ ఆమె ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

పరుందాల్ కళిఱ్ఱుక్కు అరుళ్ శెయ్ద పరమన్ తన్నై పారిన్ మేల్
విరుందావనత్తే కండమై విట్టుచిత్తన్ కోదై శొల్
మరుందాం ఎన్ఱు తం మనత్తే వైత్తుక్కొండు వాళ్వార్గళ్
పెరుందాళ్ ఉడైయ పిరాన్ అడిక్కీళ్ పిరియాదెన్ఱుం ఇరుప్పారే

బలిష్టమైన కాళ్లు ఉన్న శ్రీ గజేంద్రాళ్వాన్ (ఏనుగు)పై తన కృపను కురిపించిన సర్వేశ్వరుని ఆరాధిస్తూ ఈ పాశురములను పెరియాళ్వార్ల దివ్య కుమార్తె అయిన ఆండాళ్ దయతో పాడింది. పుట్టుక అనే వ్యాధికి విరుగుడుగా ఈ పాశురాలను మనస్సులో ధ్యానించేవారు, ఎన్నడూ విడిపోకుండా ఎంబెరుమానుని దివ్య పాదాల వద్ద శాశ్వత కైంకర్యము పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-14-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 54

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 53

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు తనను ఈ లోకము నుండి విముక్తులను చేసి ఉన్నత గతికి చేర్చమని శ్రీ రామానుజులతో విజ్ఞప్తి చేశారు. తన కోరికను శ్రీ రామానుజులు నెరవేరుస్తారని మాముణులు ఆశిస్తున్నారు. అయితే, మాముణులు అంతటితో సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే, “ఒరు పగల్ ఆయిరం ఊళియాయ్” అని తిరువాయ్మొళి 10.3.1వ పాశురములో చెప్పినట్లుగా , మాముణులకు ఈ ప్రపంచంలో గడిపే ప్రతి క్షణం ఒక యుగములాగా అనిపిస్తుంది. మాముణులు శ్రీ రామానుజులను అభ్యర్థిస్తూ, “అన్ని విధాలుగా మీరు నాకు బంధువు. మీరు నన్ను ఈ శరీరంతో ఈ లోకంలో ఈ బాధను అనుభవించమని వదిలిపెట్టకూడదు. మీరు నన్ను ఎప్పుడు ఇక్కడి నుండి విముక్తులను చేసి అనంతమైన పరమానందముతో (పరమపదము) నిండి ఉన్న చోటికి తీసుకొని వెళతారో ఏమో నాకు తెలియదు”.

పాశురము 53:

ఇన్నం ఎత్తనై నాళ్ ఇవ్వుడంబుడన్
ఇరుందు నోవు పడక్కడవేన్ ఐయో
ఎన్నై ఇదినిన్ఱుం విడువిత్తు నీర్
ఎన్ఱు తాన్ తిరునాట్టినుళ్ యేఱ్ఱువీర్
అన్నైయుం అత్తనుం అల్లాద శుఱ్ఱముం ఆగి
ఎన్నై అళిత్తరుళ్ నాదనే
ఎన్ ఇదత్తై ఇరాప్పగల్ ఇన్ఱియే
ఏగమెణ్ణుం ఎతిరాశ వళ్ళలే!!!

ప్రతి పద్ధార్ధములు:

నాదనే– ఓ!!! నా స్వామి
అళిత్తరుళ్ – (నీవు) ఆశీర్వదించుము
ఎన్నై – నన్ను
ఆగి – నాతో ఉండి
అన్నైయుం – తల్లిగా ప్రేమను కురిపించి
అత్తనుం – తండ్రిగా హితాన్ని చూపించి
అల్లాద శుఱ్ఱముం – కావాల్సిన దగ్గర బంధువులు.
ఎతిరాశ వళ్ళలే – “ఎంబెరుమానార్” అని పిలువబడు యతులకు రాజు!!!
ఇరాప్పగల్ ఇన్ఱియే ఏగమెణ్ణుం – రాత్రిం బగళ్ళు ఏకధాటిగా ధ్యానించివాడు
ఎన్ – నా
ఇదత్తై – కోరిక
(నీ చరణాల యందు పడిన తరువాత కూడా)
ఎత్తనై నాళ్ – బంధువులూ
ఇన్నం –ఇంకా
నోవు పడక్కడవేన్ – నేను బాధపడాలి
ఇవ్వుడంబుడనే ఇరుందు – ఈ శరీరముతో?
ఐయో – అయ్యో!!!
విడువిత్తు – దయచేసి ముక్తినివ్వు
ఎన్నై – నేను
ఇదినిన్ఱుం – అవరోధమైన ఈ శరీరములో
ఎన్ఱు తాన్ – ఎప్పుడు
నీర్ – నీవు
యేఱ్ఱువీర్– తీసుకొని
తిరునాట్టినుళ్ – పరమపదము?

సరళ అనువాదము:

ఈ పాశురములో, ఎంబెరుమానార్లు తనకు తల్లి, తండ్రి, మంచి బంధువు అని మాముణులు తెలుపుతున్నారు. వారు ఎల్లప్పుడూ తన శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. అందుకని, ఎప్పుడు ఈ బంధనము నుండి తనని ముక్తి చేసి పరమానంద భరితమైన పరమపదాన్ని అనుగ్రహిస్తారని మాముణులు అడుగుతున్నారు.  ఈ శరీరంతో ఈ లోకములో ఇంకా అతను ఎంతకాలం ఇలా బాధపడాలి అని మాముణులు శోకిస్తున్నారు.

వివరణ: 

“అన్నైయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్డిడుం తన్మైయాన్” అని  కణ్ణినున్ చిరుత్తాంబు 4వ పాశురములో మధురకవి ఆళ్వార్లు చెప్పినట్లుగా,  ఎంబెరుమానారే! మీరు నాకు, బిడ్డ పట్ల ఎంతో ప్రేమను కురిపించే తల్లి వంటి వారు. మీరు నాకు, తన బిడ్డ శ్రేయస్సు కోరే తండ్రి వంటి వారు. విలువైన శాస్త్ర సూత్రాలతో జీవితాన్ని గడుపుతున్న నా దగ్గరి బంధువు వంటి వారు. మీరు యతీలకు నాయకులు! “ఎన్ మనమేగమెన్నుం ఇరాప్పగలిన్ఱియే” అని తిరువాయ్మొళి 9.3.7వ పాశురములో చెప్పినట్లుగా, ఏకధాటి శ్రద్ధతో రాత్రింబగళ్ళు నా శ్రేయస్సు గురించి మీరు ఆలోచిస్తారు. “ఉనక్కాట్పట్టుం అడియేన్ ఇన్నుం ఉళల్వేనో” అని తిరువాయ్మొళి 5.8.10వ పాశురములో వివరించిన విధంగా, మీ పాద పద్మాల యందు శరణాగతి చేసిన తరువాత కూడా, ఈ శరీరముతో ఈ ప్రపంచంలో ఇంకా ఎంత కాలం బాధపడాలి? అయ్యో!!! “శరీరం” అనే ఈ అవరోధము నుండి మీరు నన్ను ఎప్పుడు విముక్తి చేస్తారో, అనంతమైన ఆనందంతో కూడిన పరమపదానికి నన్ను ఎప్పుడు చేరుస్తారో? ఆ రోజు ఒక అసమానమైన రోజు అవుతుంది అని మాముణులు చెప్పుచున్నారు.  వళ్ళల్ అంటే – గొప్ప ఔన్నత్యము ఉన్న గొప్ప వ్యక్తి,  వారు చేసిన మహోపకారానికి తిరిగి ఏమీ ఇచ్చుకోలేము.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము :  http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-54/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 53

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 52

పరిచయము:

మునుపటి పాశురములో మాముణులు, ఈ ప్రపంచంలో తన శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు తాను ఉన్న చోటికి ఎలా వస్తాడో వివరించారు. పెరియ పెరుమాళ్ళు తన వాహమైన పెరియ తిరువడిపై వస్తారని వారు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది, “తన చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు  తాను ఉన్న చోటికి వస్తారు సరే, కానీ ఆ చివరి క్షణాలు వచ్చేవరకు మాముణులు ఏంచేస్తారు?”.  “ఆ అంతిమ క్షణం వచ్చేవరకు, చేసిన పాపాలకు ప్రపంచంలో పరిణామాలను అనుభవిస్తూ ఈ నా శరీరం శిధిలమైపోవాలి. ఈ శరీరం వల్ల కలిగే కర్మలను వాటి ప్రభవాలను అనుభవించుకుంటూ నేను ఇక్కదే ఎప్పటికీ ఉండలేను. కాబట్టి, హే శ్రీ రామానుజ!!!, మీరు నాకు ఉత్తమమైనది అవసరమైనది ప్రసాదించుము. బాధలు, కష్థాలతో నిండి ఉన్న ఈ లోకము నుండి నన్ను మీరు విముక్తి చేయాలి”, అని మాముణులు ప్రార్థిస్తున్నారు.

పాశురము 53:

ఇదత్తాలే తెన్నరంగర్ శెయ్గిఱదు ఎన్ఱఱిందే
ఇరుందాలుం తఱ్కాల వేదనైయిన్ కనత్తాల్
పదైత్తు ఆవో ఎన్నుం ఇందప్పావ ఉడంబుడనే
పల నోవుం అనుబవిత్తు ఇప్పవత్తు ఇరుక్కప్పోమో?
మదత్తాలే వల్వినైయిన్ వళి ఉళన్ఱు తిరింద
వల్వినైయేన్ తన్నై ఉనక్కు ఆళాక్కి క్కొణ్డ
ఇదత్తాయుం తందైయుమాం ఎతిరాశా! ఏన్నై
ఇనిక్కడుగ ఇప్పవత్తినిన్ఱుం ఎడుత్తరుళే!!!

ప్రతి పద్ధార్ధములు:

ఇదత్తాలే – “హితము” కారణంగా (ఒక వ్యక్తి మంచిని ఆలోచించి ఆ ప్రకారము నడుచుకొనుట)
తెన్నరంగర్ – పెరియ పెరుమాళ్ళు (శ్రీ రంగనాధులు)
య్గిఱదు ఎన్ఱఱిందే ఇరుందాలుం – వారి కృప కారణంగా, నా కర్మల ఫలితాన్ని నేను అనుభవించుట. వారు నా మంచి కోసమే చేస్తున్నారని నాకు తెలుసినా
తఱ్కాల వేదనైయిన్ కనత్తాల్ – ఆ సమయంలో నేను అనుభవించే క్షణిక బాధ
పదైత్తు – నొప్పితో గిలగిలలాడుట
ఆవో ఎన్నుం – “ఆ”, “ఓ” అని బాధను తట్టుకోలేక వచ్చే శబ్దాలు
ఇరుక్కప్పోమో? – నేను జీవించగలనా
ఇప్పవత్తు – ఈ సంసారములో
ఇందప్పావ ఉడంబుడనే – ఈ శరీరముతో (ఈ శరీరమే ఒక పాపి)
పల నోవుం అనుబవిత్తు – అనేక బాధలను అనుభవించాను
మదత్తాలే – ఈ శరీర సంబంధము కారణంగా
ల్వినైయిన్ వళి ఉళన్ఱు తిరింద – నా కర్మల నిర్దేశించిన మార్గంలో అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
వల్వినైయేన్ తన్నై– అతి కౄరుడిని, పాపి అయిన నేను
ఆళాక్కి క్కొణ్డ – మీ దాసులుగా చేసుకున్నారు
ఉనక్కు – సమస్థ ఆత్మలకు ఆధారము
ఇదత్తాయుం – మీరు నా తల్లి లాగా (“హితము” చేశారు)
తందైయుమాం – తండ్రి
ఎతిరాశా! – హే! ఎంబెరుమానారే!!!
ఇని – ఇకపై
కడుగ – త్వరగా
ఎడుత్తరుళే – సంస్కరించి ముక్తిని
ఎన్నై – నన్ను
ఇప్పవత్తినిన్ఱుం – ఈ సంసారము నుండి

సరళ అనువాదము:

నిరంతరము మాముణులు తనను విముక్తులను చేయమని శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళ వల్ల తాను ఇంత బాధను అనుభవిస్తున్నానని గ్రహిస్తారు, ఎందుకంటే వారి మంచితనము కారణంగా, తన కర్మ ఫలాలను పూర్తిగా అనుభవింపజేయాలనే ఉద్దేశ్యముతో  తనని ఇంత బాధ పెడుతున్నాడని గ్రహిస్తారు. పెరియ పెరుమాళ్ళ ఉద్దేశ్యము అర్థం చేసుకున్నప్పటికీ, కర్మ పరిణామాలను అనుభవించే సమయము వచ్చినపుడు భరించలేమని మాముణులు వివరిస్తున్నారు. ఈ శరీర సంబంధం కారణంగానే ముళ్ళతో నిండిన ఈ అంతులేని ప్రయాణాన్ని చేస్తున్నాను. అందువల్ల, ఈ పాప ప్రపంచం నుండి వీలైనంత త్వరగా తనను విముక్తి చేయమని తన తల్లి, తండ్రి అయిన శ్రీ రామానుజులను వేడుకుంటున్నారు.

వివరణ: 

మాముణులు వివరిస్తున్నారు – “ఆరప్పెరుంతుయరే సెయ్దిడినుం” అని జ్ఞాన సారము 21వ పాశురము మొదలైన వాటిలో వివరించినట్లుగా,  అతడి “హితము” (ఒక వ్యక్తికి ఏది మంచిదో దాని గురించి నిత్యము ఆలోచించుట మరియు చేయుట) వల్ల, అతడి అనుగ్రహము వల్లనే తాను కష్థాలను అనుభవిస్తున్నాను (ఎందుకంటే కర్మలు ఏదో ఒక విధంగా కరిగి పోవాలి, అందుకని బాధలు అనుభవించక తప్పదు) అని నేను అర్థం చేసుకున్నాను. నేను దీనిని గ్రహించి, అర్థం చేసుకున్నప్పటికీ, ఆ బాధల విషయానికి వస్తే, ఆ నొప్పి భవించలేము. అది నాకు ఎంత బాధ కలిగిస్తుంది అంటే, నేను “హా”, “ఓహ్” అన్న నా కేకలతో ఎంత విసుగు చెందానో తెలుస్తుంది. అన్ని పాపాలకు మూలం అయిన ఈ శరీరంతో నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. ఈ లోకములో నేను ఎంతో కాలంగా ఇలా బాధపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇలాగే ఉండటం సముచితమా?  “పావమే సెయ్దు పావి ఆనేన్” అని పెరియ తిరుమోళి 1.9.9వ పాశురములో తిరుమంగై ఆళ్వార్లు చెప్పినట్లుగా, ఈ శరీర సంబంధం కారణంగా నేను అపరాధములు తప్ప మరేమీ చేయట్లేదు. దురదృష్టవశాత్తు పాపాలతో నిండిన ఈ నా శరీరం నన్ను లాగి తీసుకెళ్ళే వైపు నేను వెళ్ళి దిగజారిపోతున్నాను. ఫలితంగా అంతులేని పాప పరిణామాలను అనుభవిస్తున్నాను, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణం విసుగు చెందుతున్నాను. కానీ ఎంబెరుమానారే !!! నా తండ్రిగా, తల్లిగా మీ “హితము” అను గుణము కారణంగా నా మెరుగుదల కోసం నన్ను అనుగ్రహించారు, నన్ను స్వీకరించారు. అందువల్ల, నా ఈ అంతులేని బాధల నుండి వెలికి తీసి, ఈ సంసార సంకెళ్ళ నుండి నన్ను విముక్తులను చేయుము అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-53/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 52

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 51

పరిచయము:

మాముణులు తాను చేసిన కాల యాపనకి పశ్చాత్తాప పడే అవకాశం కలిగిందని ఇదివరకటి పాశురములో వివరించారు. శ్రీ రామానుజుల అనన్య కృప కారణంగా, వారి అనుగ్రహము వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని కూడా వివరిస్తున్నారు. అనంతరం, ఈ పాశురములో మాముణులు శ్రీ రామానుజుల కోసమై, పెరియ పెరుమాళ్ళు తన వద్దకు వచ్చే విధానాన్ని కీర్తిస్తున్నారు. “శ్రీమాన్ సమారూఢపదంగరాజః” అనే వాఖ్యములో ఆతడు తన వద్దకు ఎలా వచ్చారో వర్ణించారు.

పాశురము 52:

కనక గిరి మేల్ కరియ ముగిల్ పోల్
వినదై శిఱువన్ మేఱ్కొణ్డు
తనువిడుం పోదు ఏరార్ అరంగర్ ఎతిరాశర్ క్కాగ ఎన్పాల్
వారా మున్నిఱ్పర్ మగిళ్ందు

ప్రతి పద్ధార్ధములు:

కరియ ముగిల్ పోల్ – పైన తేలియాడు మేఘాలు లాగా
కనక గిరి మేల్ – “మేరు” అనే బంగారు పర్వతం పైన
అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
శిఱువన్ –  “వైనతేయుడు” మరియు “పెరియ తిరువడి” అని పిలువబడే వానిపైన ఎక్కి వస్తారు
వినదై – “వినతా” అనే ఒక స్త్రీ
మేఱ్కొణ్డు–  పెరియ పెరుమాళ్ళు ‘వినదై శిఱువన్’ పైన (తమ వాహనమైన గరుడుని పై) సవారీ చేస్తూ వేంచేస్తారు
తనువిడుం పోదు – ఎప్పుడు నా ఈ శరీరం రాలి పడిపోతుందో
అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
ఆర్ – నిండి ఉన్న
ఏర్  – సౌందర్యము
ఎన్పాల్ వారా – నేను ఉన్న చోటికి వస్తారు
ఎతిరాశర్ క్కాగ– యతిరాజుని కొరకై (ఒక తల్లిలాగ)
మున్నిఱ్పర్ – వచ్చి నా ముందు నిలబడతారు
మగిళ్ందు  – చాలా ఆనందంతో
(పెరియ పెరుమాళ్ళు వచ్చి, చిరుమందహాసముతో నిండిన తన ముఖాన్ని చూపించి నన్ను ఆనందింపజేస్తాడు. ఇది నిజం)

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తమ చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు తాను ఉన్న చోటికి వచ్చే విధానాన్ని కీర్తిస్తున్నారు. “వినదై శిఱువన్”, “పెరియ తిరువడి” (గరుడ వాహనము) పైన ఆతడు వేంచేస్తారని మాముణులు వివరిస్తున్నారు. తాను ఉన్న చోటికి వచ్చి అతడి అందమైన చిరుమందహాసముతో నిండి ఉన్న ముఖారవిందాన్ని దర్శింపజేస్తారు. ఇవన్నీ అతడు ఎంబెరుమానార్ల కొరకై చేస్తాడు.

వివరణ: 

మాముణులు ఇలా అంటాడు, “కాంచనస్ప గిరేశ్శృంగే సగతిత్తో యదోయదా”,  “మంజుయర్ పొన్మలై మేల్ ఎళుంద మాముగిల్ పోన్ఱుళర్ (పెరియ తిరుమొళి 9.2.8)” అని దివ్యప్రబంధములో వివరించినట్లుగా, నల్లని వర్ణముతో కూడిన మేఘాలు స్వర్ణమయమైన “మేరు” పర్వతముపై విహరించినట్లు, నేను ఈ భూమిపై నా ఈ శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాలలో,  “పెరుం పవ్వం మణ్డియుణ్డ పెరు వయిఱ్ఱ కరు ముగిల్” అని తిరునెడుంతాండకం 24వ పాశురములో వివరించినట్లుగా, పెరియ పెరుమళ్ళు గరుడారూడూడై వేంచేస్తాడు. గరుడను “పెరియ తిరువడి” అని, “వినతా” కుమారుడు అయినందున “వినదై శిఱువన్” అని కూడా పిలుస్తారు. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, ఒక తల్లిలా పెరియ పెరుమళ్ళు వస్తాడు. సౌందర్యములో అన్ని హద్దులు దాటిన ఆతడు, ఆ సమయంలో నేను ఉన్న చోటికి వస్తాడు, ఎంబెరుమానార్ల కోసం ఆతడు సంతోషంగా వస్తాడు. తన చిరునవ్వుతో నిండిన శ్రీ ముఖారవిందాన్నినాకు దర్శింపజేస్తారు. ఇది తద్యం.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-52/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org