తిరువెళుకూట్ఱిరుక్కై 12 వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 11వ భాగము

కున్ఱా మదుమలర్చ్ చోలై వణ్కొదిప్ పదప్పై
వరుపునల్ పొన్ని మామణి అలైక్కుం
సెన్నెల్ ఒణ్ కళనిత్ తిగళ్వనం ఉదుత్త
కఱ్పోర్ పురిసై కనక మాళిగై
నిమిర్కొడి విసుంబిల్ ఇళంపిఱై తువక్కుం
సెల్వం మల్గు తెన్ తిరుక్ కుడందై
అంతణర్ మంతిర మొళియుడన్ వణంగ
ఆదరవు అమళియిల్ అఱితుయిల్ అమరంద పరమ
నిన్ అడి ఇణై పణివన్
వరుం ఇడర్ అగల మాఱ్ఱో వినైయే.

ప్రతి పదార్థము:

కున్ఱా మదు – అక్షయముగా తేనె ఉండే

మలర్చోలై – పూల తోటలు

వణ్కొదిప్పదప్పై -తోటంతా అల్లుకున్న తీగలు

పొన్ని –  కావేరి నది

వరుపునల్ – నితంతరము ప్రవహించే నీరు

మామణి – గొప్ప మణులు

అలైక్కుం అలలు

సెన్నెల్ ఒణ్ కళని – బంగారు వర్ణములో మేరయు వరి చేలు

తిగళ్వనం ఉడుత్త – నాలుగు దిక్కుల వస్త్రములలా అమరిన అడవులు,  తోటలు

కఱ్పోర్ పురిసై విద్యావంతులతో నిండిన నగరములు

 కనక మాళిగై నిమిర్కొడి –  బంగారు మేడలమేద ఎగురుతున్న జెండాలు

 విసుంబిల్ తువక్కుం – ఆకాశమునంతు తుండగా

ఇళంపిఱై – విదియ చంద్రుడు

సెల్వం మల్గుసంపదలు పొంగు

తెన్ తిరుక్ కుడందై – దక్షిణాన ఉన్న తిరుక్కుడందై

ఆదరవు అమళియిల్ – పడగ విప్పిన ఆధి శేష తల్పము మీద

అఱితుయిల్ అమరంద – యోగ నిద్రలో ఉండి

అంతణర్ ... బ్రాహ్మణులు 

మంతిర మొళియుడన్ వణంగ –  వేద సూక్తములు పఠించు ధ్వనులు

పరమఓ  పరమేశ్వరా!

నిన్ అడి ఇణై పణివన్ – నీ పాద పద్మములు రెంటీని  సేవించిన  వాడికి

వరుం ఇడర్ అగల – కష్ట నివారణ  జరిగి తీరుతుంది

మాఱ్ఱో వినైయే – మా ఇడములను   పోగొట్టగల వాడివి    నీవే

thirukkudandhai_aravamudhAzhvAr

తిరుక్కుడందై ఆరావముదాళ్వాన్

ఈ చివరి భాగములో , తిరుమంగైఆళ్వార్లు  తిరుక్కుడందై పెరుమాళ్ళను శరణాగతి చేసారు . అక్కడి సంపదను, ఆ ప్రాంత ప్రత్యేకతను, కావేరి ప్రవాహమును, అందులో దొరికే విలువైన రాళ్ళను వర్ణిస్తున్నారు. అక్కడ నివసించే శ్రీ వైష్ణవుల పాండిత్యము ఎనిమిది దిక్కుల వ్యాపించినదని చెపుతున్నారు.

 నమ్మాళ్వార్ల లాగే తిరుమంగై ఆళ్వార్లు కూడా ఇక్కడి పెరుమాళ్ళను శరణాగతి చేసారు

వ్యాఖ్యానము:

 “కిడందవాఱు ఎళుందిరుందు పేసు” [తిరుచ్చంద విరుత్తం 61],”లేచి నిలబడి  మాట్లాడుమని తిరుమళిశై ఆళ్వార్లు ,  భగవంతుడు  భక్తులు ఎలా ఆఙ్ఞాపించినా వింటాడు,   బతిమాలినా వింటాడు” అని తిరుమంగై ఆళ్వార్లు  అంటున్నారు..  కోరుకుంటున్నారు  సౌలభ్యమును వీరు  

 కున్ఱా మధు మలర్చోలైసామాన్యముగా తోటలకు  మట్టి,  నీరు, ఎరువు వేసి పెంచుతారు. అలాంటి  పూవులలో తేనె కొంత కాలానికి తరిగి పోతుంది.  ఇది ఆరావముద పెరుమాళ్ళ కృపా దృష్టితో పెరుగుతున్న తోట.  దీనిలో  తేనె ఎప్పటికి తరగదు.    

వణ్కొదిప్పదప్పైబంగారు వర్ణములో మెరిసే గడ్డితో, చిక్కగా అల్లుకున్న తమల పాకుల తీవెలతో నిండిన నేలలు ఎంత సారవంతమో, సంపన్నమో కదా!   

వరుపునల్ పొన్ని మామణి అలైక్కుంకావేరి నది ఇరు దరులు ఒరుసుకొని పారుతూ విలువైన వజ్రాలను వొడ్డుకు చేరవేస్తుంది :  (చన్జచ్చచామర చంద్ర చంధన మహా మాణిక్య ముక్తోత్కరాన్   కావేరీ లహరీకరైర్ విధధతీ” [రంగరాజ స్థవం 1-21] ( కావేరి  చామరం,(వీచేగాలి), పచ్చ కర్పూరము ,చందనము, వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటిని మోసుకు వస్తుంది.

(ఆళరియాల్ అలైప్పుణ్డ  యానై  మరుప్పుం  అగిలుం  అణిముత్తుం వెణ్ సామరైయోడు పొన్ని మలైప్పణ్డం మణ్డత్  తిరైయుండు” [పెరియ తిరుమొళి 3-8-3];

చందినోడు మణియుం కొళిక్కుం పునల్ కావిరి” [పెరియ తిరుమొళి 5-4-1], “వేయిన్ ముత్తుం మణియుం కొణరందు ఆర్ పునల్ కావిరి” [పెరియ తిరుమొళి 5-4-9],

తిసై విల్ వీసుం సెళు మామణిగళ్ సేరుం ‘    తిరుక్కుడందై” [తిరువాయిమొళి 5-8-9]

 పై ఉపపత్తులను చూస్తే ఆళ్వార్లు  కావేరీనదిని  ఎలా అనుభవించారో తెలుస్తున్నది.

సెన్నెల్ ఒణ్ కళణి –  కావేరీ పరివాహ ప్రాంతములో వరి చేలు కళ కళ లాడుతుంది.

తిగళ్ వనం ఉడుత్తనిరంతర నీటి ప్రవాహము వలన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి.

కఱ్పోర్ పురిసై –  “తిసై విల్ వీసుం సెళుమామణిగళ్”  [తిరువాయిమొళి5-8-9],)లో అన్నట్లు అక్కడి శ్రీవైష్ణవుల పాండిత్యము ఎనిమిది దిక్కులా వ్యాపించిందితిరుమంగై ఆళ్వార్ల ఖ్యాతి కూడా అలాగే వ్యాపించింది.

 పురిసై”- పురి=నగరము/స్థానము,

ఇసై  –గోడధృఢమైన గోడ.

కఱ్పు ఓర్ పురిసై”- దివ్యమైన గోడలు.

కనక మాళిగైబంగారు మేడలు.

నిమిర్ కొడి విసుంబిల్ ఇళం పిఱై తువక్కుంఇళ్ళ మీది జెండాలు ఆకాశములో విదియ చంద్రుడిని తాకటము వలన పడగ విప్పిన పామేమోనని భ్రమ కలుగుతుంది.

శెల్వం మల్గు తెన్ తిరుక్కుడందైసంపదలు పొంగి పొరలు దక్షిణ దిక్కున వున్న తిరుక్కుడందై.‘, -. తీయని సంపదలుకోరుకోదగిన, న్యాయమైన,ఆనదానిచ్చే సంపదలు.

అందణర్ మందిర మొళియుదన్ వణంగవేదాధ్యనము చేసిన  బ్రాహ్మణులు, వేధాంత సూక్తులను ఉచ్చస్వరములో పఠిస్తుంటే వినకూడని వారి చెవిన పడుతుందని మంత్రం యత్నేన గోపయేత్అంటున్నారు.

ఆడు అరవు అమళియిల్ అఱి తుయిల్ అమరంద పరమఆదిశేషునిపై శయనించిన భగవంతుడు నిరంతరం లోక రక్షణార్థమే ఆలోచిస్తుంటాడు.  సరేశ్వరుడు ఆయన  కదా 

ఆడు అరవు…. పాములు పడగ విప్పి ఆడతాయి.అలాగే ఇక్కడ అనంతాళ్వాన్ తన ఉచ్వాస,నిశ్వాసములతో ఊయలలా ఊగుతుంటాడు.    , అలాగే  భగవంతుడికి అనుగుణముగా తన శరీరమును కుంచించి  విస్తరించి నిరంతర కైంకర్యము చేస్తాడు. అనంతాళ్వాన్ ఆయన   ! కదా  

నిన్ అడియిణై పణివన్ –  పిరాట్టియుం అవనుం విడిల్ తిరువడిగళ్ విడాదు, తిణ్ కళలాయి ఇరుక్కుం – (ముముక్షుప్పడి} అన్నట్లు దాసుడు నీ శ్రీపాదములనే శరణు కోరుతున్నాడు  శ్రీపాదాలు  ఆ  దాసుడిని స్వీకరించినాతిరస్కరించినా వేరే దారి ఏదీ లేదు.

 వరుం ఇడర్ అగలనీ స్వరూప రూప గుణములను అనుభవించటములో విరోధులెదురైనా ఆ శ్రీపాదాలే దాసుడిని రక్షింస్తాయి.

మాఱ్ఱో వినైయేఈ సంసారము నుండి  దాసుడిని రక్షించాలి.

అడియిణై పణివన్ మాఱ్ఱో వినైనమ్మాళ్వార్లు  తరియేన్ ఇని ఉన్ చరణం తందు ఎన్ శన్మం కళైయాయే” [తిరువాయిమొళి 5-8-7](ఇంకా తట్టుకోలేను నీ శ్రీ పాదములనిచ్చి నా జన్మను చాలించు అని) 

ఈ సంసారము నుండి దాసుడిని రక్షించి  అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తిని  ఇవ్వమని కోరుతున్నారు తిరుమంగై ఆళ్వార్  భగవంతుని శ్రీ పాదములయందు శరణు వేడుచున్నారు. 

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-12/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment