జ్ఞానసారము 4

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురం 3

పాశురం 4

543439_636314269732920_1530777401_n

“మఱ్ఱొన్ఱై ఎణ్ణాదే మాదవనుక్కు ఆట్చెయలే

ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు ఉళం తెళిందు-పెఱ్ఱ

పెరుం పేఱ్ఱిన్ మేలుళ్ళదో పేర్ ఎన్ఱు ఇరుప్పార్

అరుం పేరు వానత్తవర్ క్కు”

ప్రతి పదార్థము:

మఱ్ఱొన్ఱై= = సంపద మొదలగు కోరికలను

ఎణ్ణాదే = లక్ష్యముగా చేసుకోకు

మాదవనుక్కు = భగవంతుడికి

ఆట్చెయలే  = దాసత్వము పాటించడములో

ఇతు ఉఱ్ఱతు = ఇది ఉన్నతమైనది

ఎన్ఱు = అని నిర్ణయించు కొని

ఉళం తెళిందు- = హృదయము తెలిసిన

పెఱ్ఱ పెరుం పేఱ్ఱిన్ మేల్ = పొందిన ఈ పెద్ద ఉపకారమునకు

పేర్ ఉళ్ళదో = వేరొక ప్రయోజనము ఉన్నదా

ఎన్ఱు ఇరుప్పార్ = అన్న దృఢ విశ్వాసముతో ఉంటారు

వానత్తవర్కు = వైకుంఠములో ఉన్న నిత్య ముక్తులకు

అరుం పేరు = (ఇట్లు జీవించే వారు) చాలా విలువైన దుర్లభులైన దాసులు

అవతారిక:

“ఊన ఉడల్”   మొదటి పాశురములలో ద్వయ మంత్రములోని మొదటి పాదములో చెప్పిన శరణాగతి ఔన్నత్యమును వివరించారు. శరణాగతి చేయడానికి కారణము జనన మరణ ధుఃఖమును సహించలేక పోవుట. ఈ స్థితినే పర భక్తి  అంటారు. ఇది  “నరగo స్వర్గమాగుం ” అనే రెండవ పాశురములో వివరించారు. దాని కంటే ఉన్నతమైన స్థితి  పరమ భక్తి , అనగా విశ్లేషణలో ప్రాణములే పొవునన్నంత క్లేశము ఏర్పడు   విషయాన్ని ” ఆనై ఇడర్ కడింద ” అన్న మూడవ పాశురములో చెప్పారు. ఇప్పుడు ద్వయ మంత్రములోని రెండవ భాగమైన కైంకర్యము ( భగవంతునికి, తాయారు మరియు దాసులు కు చేయు సేవ ) యొక్క గొప్పతనమును  తెలుసుకున్నావారై , ఇతర ప్రయోజనములు వీడి మరియు స్వరూపమునకు తగిన కైంకర్యము చేయుటలోనే దృఢ నిశ్చయులైన దాసుల యొక్క గొప్ప తనమును చెప్పుతున్నారు .

వ్యాఖ్యానము:

మఱ్ఱొన్ఱై  ఎణ్ణాదే:   కైంకర్యము భగవంతుడికి ఇష్టమైన క్రియ . చేతనులు పొందవలసిన అంతిమ లక్ష్యము. ఇంతకంటే ఉన్నతమైనది మరొకటి లేదు. ఇక్కడ మరొకొటి అనగా ఇహ లోకములోని తాత్కాలిక సుఖములు ,పరలోక సుఖములైన స్వర్గము ,  ఆత్మానుభవమైన కైవల్యము మొదలైనవి. ఈ మూడు కైంకర్యానికి భిన్నమైన  విషయములు. ఆత్మానుభవము అనగా తనను తానే అనుభవించుట, అనగా  దేహాత్మ సంబంధము  లేక పోవుట . అనగా ఆత్మ శరీర సంబంధము లేక ఆనందానుభవమును పొందుట. ఆ స్థితినే మోక్షమని కొందరు అంటారు. అది భగవత్ కైంకర్యమునకు భిన్నమైనది. దాని పేరు కూడా చెప్పటము ఇష్టము లేక మఱ్ఱొన్ఱై అంటే మరొకటి అన్నారు. ” కోరకు ” అనటానికి బదులుగా ఎంచకు అని చెప్పారు. ఇటువంటి దాసులు ఇతర విషయములను ఎంచరు అనగా తలవరు కూడా  ఇక ఆశ పడుట గురించి ప్రశక్తిరాదు.  ఇహ లోకములోని తాత్కాలిక సుఖములు , పరలోక సుఖములైన స్వర్గము ,  ఆత్మానుభవమైన కైవల్యమును కోరు కొను వారికి భగవద్ కైంకర్యములో కోరిక వుండదు. భగవద్ కైంకర్యములో కోరిక వున్నవారికి పై మూడింటిలో ఆశక్తి ఉండదు. ఎవరికైతే కైంకర్యంలో ని విలువ తెలుసుకుంటారో ఇతర విషయములను ఉప్పు నీటి తో పోలుస్తారు మరియు అటువంటి విషయముల ఉన్నట్లుగాను వారు గుర్తించరు.

మాధవనుక్కు ఆట్చెయల్: మాధవుడికి కైంకర్యము అనగా అమ్మతోకూడిన స్వామికి చేసే కైంకర్యమును (అమ్మ తో కూడిన స్వామి యొక్క సేవయే లక్ష్యము అని మాధవ అనే ప్రయోగం చేసారు)
ద్వయ మంత్రములోని “శ్రీమతే ” అన్న రెండవ భాగములోని మొదటి పదము ఈ విషయాన్నే తెలియజేస్తుంది. తిరుమంత్రములోని (ఓం నమో నారాయణాయ) మూడవ పదమైన ” నారాయణాయ ” కూడా దాసుల కైంకర్యమును స్వీకరించువారు అమ్మతో కలసి వున్న స్వామి అన్న రహస్యార్థమును  తెలియజేస్తున్నది. దానిని ద్వయ మంత్రము వివరిస్తున్నది.  పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షుపడి లో “ఇంగు తిరుమంత్రతిల్ శొన్న ప్రాప్యత్తై విశదంఆగానుసందికిరదు(ముముక్షుపడి, ద్వయప్రకరణము చుర్నికై ౧౬౮)  ” అనగా ” ఇందులో తిరుమంత్రములో చెప్పిన ప్రాప్యమును విశదముగా అనుగ్రహిస్తున్నది” అని అనుగ్రహించారు. “భగవద్ కైంకర్యమే ఒరువన్ వేండియ లక్ష్యం” (భగవద్ కైంకర్యమే చేతనుడు పొందవలసిన లక్ష్యము ) అన్నారు.”ఒళివిల్ కాలమెల్లం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్యవేండుం నాన్ ” అని నమ్మాళ్వార్లు అన్నారు.

ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు : “ఇదే పరమ పురుషార్ధం” అని అర్థం.  ఆళ్వార్ “నీళ్ కుడక్కుతనుక్కు ఆట్చేయ్వదే ” అని అన్నారు.  “ఉఱ్ఱతు” అనగా  తగినది (ఒక జీవాత్మ కు) . అనగా వేరొక ఏ విషయములు కూడా జీవాత్మ యొక్క శేషత్వము యొక్క నిర్వచమునకు తగనివి.అందువలన , అవి జీవాత్మకు తగనివికావని తీసివేసారు. వేదాంతం సారముగా “మాధవనుక్కు”  మరియు  “ఆట్చెయల్ ”  అను రెండు పదములతో  ఒక జీవాత్మ పిరాట్టి మరియు పెరుమాళ్ కు ఇద్దరికీ దాసభుతులని  మరియు వారికి కైంకర్యము చేయుటయే పరమ పురుషార్ధం అని  నిరూపణ చేసారు. స్వామి పెరియాళ్వార్  “తిరుమాలేనానుమునక్కుపళవడియేన్ ” (తిరుపల్లాండు 11) అని సాయించారు అనగా జీవాత్మ పిరాట్టి మరియు పెరుమాళ్కు దాసభుతులని. అదే విధంగా “అడిమైశెయ్ వార్తిరుమాలుక్కే”  మరియు “శేన్ఱాల్కుడయామ్, ఇరున్దాల్శింగా.

ఉళం తెళిందు : పైన చెప్పిన విధముగా ఆత్మ కైంకర్య ప్రాప్తిని పొందుటకు అన్య ప్రయోజనములందు విరక్తుడవ్వాలి,అలా కావడానికి ఆటంకముగా నిలిచే” నేను “,” నాది ” అన్న భావన పూర్తిగా తొలగిపోవాలి. భగవద్ ప్రీతి కొరకే కైంకర్యము చేయాలి. దీనినే నమ్మాళ్వార్లు ‘తనక్కే ఆగ ఎన్నై క్కొళ్ళుమీదే ‘ ( తనకోసమే నన్ను స్వీకరించాలి) అన్నారు. ‘ ఉనక్కే నాం ఆట్చెయ్వోం ‘ ( నీకే మేము కైంకర్యము చేస్తాము) అని ఆండాళ్ తల్లి చెప్పింది . కైంకర్యమొక్కటే ఆత్మకు ఉన్నతమైన ఉపయోగమని చెప్పినదానికి తగినట్లుగా హృద్యమున విశ్వాసము కలిగి ఉండి చెయ్యాలి. దీని వలన ద్వయ మంత్రము లోని చివరి పదమైన ” నమః ” పదము యొక్క అర్థము చెప్పబడింది.

పెఱ్ఱ పేరుం పేఱ్ఱి మేలుళదో పేరెన్రిరుప్పార్ : అర్థాత్ కైంకర్యము ప్రాప్తి లభిస్తే ఇంతకంటే ఉన్నతమైన ఫలితముమరొకటి లేదని తలుస్తారు. పరమ పదము ఎప్పటికీ మారకుండా ఒకే విధముగ ఉంటుంది. శుధ్ధసత్వ తత్వముగా ఉంటుంది. జ్ఞాన , ఆనందములకు నిలయము.  అందువలన కైంకర్యమును నిర్విఘ్నముగా చేయుటకు అనువైన ప్రదేశము. ఈ కారణముల వలననే జ్ఞానులు దీనినే కోరుకుంటారు. కైంకర్యము కంటే ఉన్నతమైన ఫలితము వేరొకటుంటుందా? అనడములో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఇంత ఉన్నతమైన కైంకర్యములో ధృఢముగావుండు వారు అని అర్థము.

అరుంపేరు వానత్తవర్క్కు: ముందు చెప్పిన దాసులు సహజముగానే తమను భగవంతుడి దాసులుగా భావించు వారు.  భగవద్  కైంకర్యములోనే ఎల్లప్పుడూ నిమగ్నమై వుండు వారు. భగవంతుడినే గొప్ప సంపదగా భావించు వారు. ఇలాంటి వారు ఈ లోకములో కనపడుట దుర్లభము. వీరు పరమపదమునకు వెళ్తే  అక్కడ వున్న నిత్య సూరులు మొదలైన వారికి ఆనంద హేతువవుతారు. అందువలన ఎల్లప్పుడు అతృప్తామృతమైన భగవంతుని అనుభవించు భాగ్యము పొందిన నిత్యసూరులకు ఆ భగవద్విషయము కంటే వీరిని అనుభవించుట దుర్లభమైన సంపదగా తోస్తుంది అని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-4-matrondrai-ennadhe/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment