Category Archives: varavaramuni dhinacharyA

ఉత్తర దినచర్య శ్లోకం 14 – దినచర్యామిమాం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 13

శ్లోకము

దినచర్యామిమాం దివ్యాం రమ్యజామాతృయోగినః !

భక్త్యా నిత్యమనుధ్యాయన్ ప్రాప్నోతి పరమం పదమ్ !!

ప్రతిపదార్థము:

ఇమాం = “ ప్రేత్యుః ప్రసిద్దయామే ( పూర్వ దినచర్య-14) అని ప్రారంభంచేసి  ‘స్నానం సంస్మరామి తమ్ ‘ అనే శ్లోకం వరకు అనుసంధానం చేయబడింది,

దివ్యాం రమ్యజామాత్రుయోగిన దినచార్యాం – అళగియమణవాళ జీయర్ల  నిత్యనుష్టానాన్ని తెలిపే ఈ కృతిని

నిత్యం = ప్రతిదినము( పగలు, రాత్రి )

భక్త్యా మనుధ్యాయన్ = భక్తితో అనుసంధానము చేయువారు

పరమం పదమ్ = జనన మరణములు లేని నిత్య విభూతి అయిన శ్రీవైకుంఠమును

ప్రాప్నోతి = పొందుతారు

భావము:

             ‘దినచర్య ‘ అనే ఈగ్రంధం చివరలో ఫలశ్రుతిగా ఈగ్రంధ అధ్యయనం వలన కలిగే ఫలితాలను చెపుతు న్నారు. పూర్వ దినచర్యలో 13వ శ్లోకం వరకు ఉపోద్ఘాతంగా అమరిందని ముందరే చెప్పుకున్నాము. 14వ శ్లోకం నుండి ఉత్తర దినచర్యలోని 13వ శ్లోకం వరకు వరవరముని దినచర్య వర్ణించబడింది .’ దివ్యం ‘ అన్న పదానికి దివ్య మైన పాంచరాత్రాగమం మొదలైన శాస్త్ర సిద్ధమైన అనుష్టానములను తెలియజేసే గ్రంధములని అర్థము. అంతే కాక  ఈలోకములో అనుసంధానములోలేని, పరమపదములో మాత్రమే  నిర్వహింపబడే పాంచకాలిక అనుష్టానములను తెలియజేసే గ్రంధమని కూడా గ్రహించవచ్చు .  ఈ అనుష్టానములు చాల దుర్లభమైనందున పరమైకాంతులు మాత్ర మే అనుష్టించతగినవిగా వుండటం వలన కృతయుగంలో  పరిపూర్ణంగా అనుష్టించినవి. త్రేతా ద్వాపరాలలో కొద్దిగా తగ్గుతూ వచ్చినవి. కలియుగంలో ఉన్నవో! లేవో! కూడా తెలియదు అని భరద్వాజ పరిశిష్టంలో చెప్పబడింది. అందు వలన ఈ అనుష్టానము ఎంత ఉన్నతమైనదో అర్థమవుతున్నది . పైగా ఎన్నో కోరికలతో పరుగులు తేసే మానవులు ,వాటిని పొందడం కోసం ఎందరెందరో దేవతలను ఆశ్రయిస్తూ శ్రీమన్నారాయణుడొక్కడే పరమ దైవ మన్న మాటను కూడా మరచిపోయినవారు ఈ అనుష్టానములను చేపడతారా! అన్నది ప్రశ్నార్థకమే . జ్ఞాన సం పన్నులై కూడా కాల  ప్రభావముచేత మోహవశ్యులై ,పురాకృత పాపవాసన నుండి బయటపడలేరు . కలియు గంలో కూడా కొందరు పరమాత్మ ఒక్కడే అని విశ్వసించేవారు ఉంటారు కానీ కాల ప్రభావం వలన వారు కూడా అన్యమతస్తుల మాయలోపడి కొట్టుకుపోతారని ఇదే గ్రంధంలో తెలుపబడింది.

              ఐదు కాలలలో చేయదగిన భగావరాధనారూపమైన ఈ కర్మలను, క్రమము తప్పక అనుష్టించువారు, నూరుసంవత్సరాలు నిండగానే మోక్షపదమును పొందుతారని లక్ష్మీతంత్రంలో చెప్పబడింది.  మోక్షాన్ని పొందడానికి అన్యఉపాయాలన్నింటిని పూర్తిగావదిలివేసి ఈ పాంచకాలిక అనుష్టానములను నిష్టతోఆచరించేవారు పరమపదాన్ని పొందుతారు. వారికి కర్మజ్ఞానభక్తి అనేఉపాయాలతో పనిలేదు అని శాండిల్యస్మృతిలో చెప్పబడింది. కానీ భరద్వాజా దులు పరమాత్మను సిద్దోపాయమని నమ్మినవారు. వారు భగవద్కైంకర్యం రూపంగానే అనుష్టానములను ఆచరిం చాలనిపేర్కొన్నారు. ఇదియే ప్రపన్నులు అనుసరించదగిన మార్గమని చెప్పారు. ముందుగా అభిగమము చేసి ,  భగవదారాధనకు  కావాల్సిన వస్తువులను సిద్దము చేసుకోవాలి . తరువాత భగవదారాధనరూపమైన ఇజ్జను అను ష్టించాలి . తదుపరి స్వాధ్యాయనంచేసి, చివరగా ధ్యానమనే యోగాభ్యాసం చేయాలి . ఇక్కడ ఈ ఐదుకాలలో ఆచ రించే అను ష్టించే ఐదింటిని ఉపాయరూపంగా కాకుండా ఫలరూపంగా ఆనందగా అనుష్టించాలి. కర్మజ్ఞానభక్తిప్రపత్తి అనే నాలుగు ఉపాయాలు మోక్షోపాయంగా  అనుష్టించక ,ఫలమునుఆశించక, పరమాత్మఆనందమే పరమ ప్రయో జనంగా భావించి ,కైంకర్యరూపంగా చేయాలి అని పరాశరముని అనుగ్రహించారు.

                       శ్రీదేవరాజ గురువనబడే ఎరుమ్బియప్పా అనుగ్రహించిన శ్రీవరవరముని దినచర్య ,దానికి వా దూల వీరరాఘవగురువనే తిరుమళిశై అణ్ణావప్పంగర్ స్వామి  అనుగ్రహించిన సంసృత వ్యాఖ్యానమునకు తమిళంలో  శ్రీకృష్ణమాచార్యస్వామి రాసిన వ్యాఖ్యానం సంపూర్ణం  

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-14/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 13 – అథ భృత్యా

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 12

శ్లోకము

అథ భృత్యా ననుజ్ఞాప్య కృత్వా చేత శ్శుభాశ్రయే !

శయనీయం పరిష్కృత్య శయానం సంస్మరామి తమ్ !!

ప్రతిపదార్థము:

అథ = శిష్యులకు తత్వోపదేసములు చేయటంలో పగలు రెండు ఝాములు గడచిన తరువాత

భృత్యాన్  = మునుపు పేర్కొన్న ప్రియ శిష్యులకు 

అనుజ్ఞాప్య = సందేహ నివృత్తి చేసిన తరువాత

శ్శుభాశ్రయే = కన్నులకు,మనసుకు ఆనందాన్ని,కలిగించే పరమాత్మ శుభకరమైన దివ్యమంగళ విగ్రహం మీద

చేతః కృత్వా = మనుసును నిలిపి

శయనీయం = శయనించటానికి

పరిష్కృత్య = ఉపక్రమించి

శయానం = విశ్రాంతి తీసుకుంటారు

తమ్ = అలాంటి మామునులను

సంస్మరామి = స్మరించుకుంటాను

భావము:

‘ కృత్వా చేత శ్శుభాశ్రయే ’….అనటం వలన రాత్రి చేయవలసిన భగవధ్యానమనే యోగము అని చెప్పబడింది. ‘తతః కనక పర్యంజ్ఞ్కే ‘(4) అని 4 వ శ్లోకంలో చెప్పినట్లు మామునులు భగవధ్యానానికి అనువైన ఆసనము నుండి లేచి స్తోత్రము చేయడానికి శిష్యులను కటాక్షించి వారికి  సెలవుఇచ్చి పంపించిన తరువాత శయనించటానికుపక్రమించే వారు, భగవధ్యానము చేస్తూ అలాగే నిద్రకుపక్రమించేవారు. అటువంటి మామునులను ఎఱుమ్బియప్పా ధ్యానిస్తు న్నారు. (మామమునులు సాక్షత్ అనంతుడి అవతారము కావున అప్రాకృతమైన వారి తిరుమేని సౌందర్యము, వారు నిద్రించే సమయంలో ధ్యానము చేసే విధానము ఇక్కడ వర్ణిస్తున్నారు. పరమాత్మ తిరుమేని మామునులకు  శుభాశ్రయము . మామునుల తిరుమేని ఎఱుమ్బియప్పాకు శుభాశ్రయము. యతీంద్రప్రణవులైన మామునులు పరమాత్మ హృదోయోల్లాసాని కోసం ఆయనను ధ్యానించినట్లు, తమను మణవాళమామునుల కైంకర్యమునకే అంకితము చేసుకున్న ఎ ఱు మ్బియప్పా వారిని ధ్యానము చేశారు . శ్రీరాముడి ప్రసక్తి యతీంద్రప్రణవప్రభావంలోను, వరవరముని శతకంలోనూ కనపడుతుందికావున , యతీంద్రులైన సౌమ్యజామా త్రుయోగీంద్రులను ధ్యానము చేయటం , వీరు తమ తిరువారాధనాదైవమైన  శ్రీరాముడి హృదోయోల్లాసానికని కూడా భావించవచ్చు. )

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-13/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 12 – ఇతి స్తుతి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 11

శ్లోకము 

ఇతి స్తుతి నిబన్దేన సూచిత స్వమనిషితాన్ !

భృత్యాన్ ప్రేమర్ధయా దృష్ట్యా సిఞిన్తం చిన్తయామి తమ్  !!

ప్రతిపదార్థము:

ఇతి = పైన చెప్పిన ఆరు శ్లోకాల ప్రకారం   

స్తుతి నిబన్దేన = స్తోత్రముగా కూర్చబడిన ప్రబందము  

సూచిత స్వమనిషితాన్ = తాము కోరుకున్నపురుషార్థాలను కలిగియుండి

భృత్యాన్ = అమ్మను కొనను అర్హతగల వస్తువులాగా ఉన్న కోయిలణ్ణన్ వంటి శిష్యులను  

ప్రేమర్ధయా =  ప్రీతి చేత చల్లబడిన

దృష్ట్యా = కృపా కటాక్షములతో  

సిఞిన్తం = స్తిమితపరచే  

తమ్  = మామునులను

చిన్తయామి = నిరంతరం ధ్యానిస్తూ వుంటాను.

భావము:

   ‘ ఉత్తర దినచర్య ‘ అన్న గ్రంథంలో  మొదటి ఆరు శ్లోకాలలో ఎఱుమ్బియప్పా అనే వారు తమ ఆచార్యులైన మణవాళ మామునులను  గురించి స్మరించారు. ఇప్పుడు ఆ స్తోత్రము మీది ప్రీతిచేత మణ వాళ మామునులను అనుభవించబోతున్నారు. ‘ఇతి’  అంటే ఈ ప్రకారంగా ముందు చెప్పిన ఆరు శ్లోకాలలో ఉన్న భావమును బట్టి అన్న అర్థం వస్తుంది. వాటిలో ‘ త్వం మే బంధు ‘(7), యా యావృత్తి’ (10 ) వరకు వున్న నాలుగు శ్లోకాలు వీరు రాసిన వరవరముని శతకంలో కూడా కనపడుతుంది. ‘ ఉన్మీల పద్మ ‘ (6) అన్న శ్లోకము , దాని ముందర ఉన్న ’ అపగతమానై ‘  అన్న శ్లోకము వీటితోనే అనుసంధానము చేస్తూ ఉన్నందున మరొకరు అనుగ్రహించారని ఎవరు ఆరోపించనందు వలన వాటిని కూడా కలిపే అనుసం దానం చేయటం ఆచారంగా వస్తున్నందు వలన ఈ నాలుగు శ్లోకాలను కూడా ఎఱుమ్బియప్పా అనుగ్రహించినట్లుగా గ్రహించబడింది .  ఈ అరు శ్లోకాలలో ‘ దివ్యం తత్ పాదయుగ్మం దిశతు ‘ (6), తవపదయుగ్మం దేహి ‘(9) , అంగ్రిద్వయం పశ్యన్  పశ్యన్’ (8) అని మూడు శ్లోకాలలో మామునులు శ్రీపాదాలను తమ శిరస్సు మీద ఉంచి అనుగ్రహించాలని , వాటిని ఎప్పుడూ  సేవించాలని కోరుకున్నారు. దీనిని బట్టి ఈ ఆరు శ్లోకాలలో అష్టదిగ్గజాలనబడే కోయిలణ్ణన్ ,వానమామలై జీయర్ తప్ప ఎఱుమ్బియప్పా , తిరువేంకట జీయర్ ,పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ , ప్రతివాది భయంకరం అణ్ణా,అప్పిళై, అప్పుళ్ళార్లు  తలా ఒకటి అనుసంధానము చేసారని గ్రహించవచ్చు. కోయిలణ్ణన్ అనే ఆచార్యులు నిరంతరం మామునులను భరించు పాదుకలుగాను, వానమామలై జీయర్ పాదాలనే అంటి వుండే పాదరేఖలుగాను ప్రసిద్ధులు వీరివురు. మామునులను ఎప్పుడు వీడక వారి శ్రీపాదాలను తమ శిర స్సు పై ధరించాలని ,వాటిని ఎప్పుడు సేవిస్తూ వుండాలని కోరుకున్నారని అణ్ణావప్పంగార్ స్వామి అభిప్రాయముగా చెపుతారు . ఎఱుమ్బియప్పా అనుగ్రహించిన ఈ ఆరు శ్లోకాలు ఒకటి వీరు అనుగ్రహించినట్లు మిగిలిన ఐదు శ్లోకాలు ఐదుగురు తలా ఒకటి అనుగ్రహించారని పెద్దల అభిప్రాయము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-12/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 11 – అపగత

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 10

శ్లోకము

అపగత మదమానైః, అన్తిమోపయనిష్ఠై:

అధిగత పరమార్థైః , అర్థ కామానపేక్షైః !

నిఖిల జన సుహృద్భిః నిర్జిత క్రోధలోభైః

వరవరముని భృత్యైః , అస్తు మే నిత్యయోగః  !!

ప్రతిపదార్థము:

మే = ఇప్పటి దాకా చెడ్డవారితో చేరి కానిపనులు చేసిన దాసుడు

అపగత మదమానైః = నేనే పెద్దవాడిని అన్న గర్వము లేని వారు లేక అహంకారంతో పెద్దలను అగౌరవించడం చేయని వారు

అన్తిమోపయనిష్ఠై: = మోక్షపదం పోమ్దటానికి సాధనకు హేతువైన ఆచార్యాభిమానమనే అంతిమ ఉపాయం స్వీకరించిన వారు

అధిగత పరమార్థైః = ఆచార్యకైంకర్యమనే పరిపూర్ణ పరమార్థాన్ని పొందినవారు  

అర్థ కామానపేక్షైః = ఇతరోపాయాలను ,ఇతరఫలితాలను కోరని వారు

నిఖిల జన సుహృద్భిః = ఆభిముఖ్యులు ,విముఖులు, ఉదాసీనులు అనే మూడువర్గాలవారి మంచినికోరే సుహ్రుద్భావము గలవారు

నిర్జిత క్రోధలోభైః = క్రోధలోభములను జయించిన వారు

వరవరముని భృత్యైః = వరవరమునుల అంతరంగిక శిష్యులైన కోయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైనవారితో

నిత్యయోగః  = నిత్య సంబంధం ( మామునుల శ్రీపాదములను ఉంచే మెత్తని దిండు ,పాదరేఖలుగా )

అస్తు = లభించుగాక అని ప్రార్థిస్తున్నాము.

భావము:

             మదము ,అహంకారము, సంపద మీద కోరిక , స్త్రీవ్యామోహం , కోపము, లోభము, మొదలైన దుర్గు ణాలు గలనీచులతో సంబంధము కలిగిఉన్న దాసుడికి ,ఇప్పటి నుండి అటువంటి చెడుగుణాల వాసనా కూడాలేని   వరవరమునుల అంతరంగిక శిష్యులైన కోయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైన వారితో నిత్య సంబంధము లభించుగాక అని ప్రార్థిస్తున్నాము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-11/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 10 – యా యా

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 9

శ్లోకము 

యా యా వృత్తిః మనసి మమ సా జాయతాం సంస్మృతి స్తే 

యో యో జల్ప స్స  భవతు విభో నామ సంఙీర్తనం తే  !

 యా యా చేష్టా వపుషి భగవన్ ! సా భవేత్ వందనం తే 

సర్వం భూయాత్ వరవరమునే ! నైన సంయగారాధనం తే !!

ప్రతిపదార్థము:

హే వరవరమునే = స్వామి వరవరముని !

మమ = పురాకృతకర్మాధీనమైన దాసుడి బుద్ది

జాయతాం = దురాలోచనలకు స్థానంగా ఉండవచ్చునా  ! 

సా వృత్తిః = ఆయా బుద్దులన్నీ  

తే = తలచినంతనే సంతోషాన్ని కలిగించే తమరి 

సంస్మృతిః = మంచి స్మృతికి హేతువైన  

జాయతాం = ఉండాలి

హే విభో = స్వామీ! 

మే = దాసుడికి 

యో యో జల్పః = ఏ ఏ విషయాలలో 

జాయతాం = ఎటువంటి జ్ఞానం కలగవలసి వుందో 

సః = ఆయా విషయాలలో

తే = కీర్తిమంతులైన తమరి గురించిన  

జల్పః = మంచి విషయాలు రూపోదిద్దుకోవటానికి 

జాయతాం = అనుకూలించాలి 

హే భగవన్ = ఓ స్వామి! 

మమ = దాసుడి (దేహం) దాసుడు  

వపుషి = నిరంతరం నిరర్థకమైన  ఏదో ఒక కార్యంలో నిమగ్నమై వుండే దాసుడి దేహం 

యా యా చేష్టా = ఆయా చేష్టలను 

తే = కీర్తిమతులైన తమరికి  

వందనం = కైంకర్యముచేసి  నమస్కరించేవిగా  

జాయతాం = రూపొందుగాక 

సర్వం = ఇప్పటిదాకా చేసిన విన్నపాలన్నీ  

తే = తమరి 

సంయగారాధనం = ప్రీతికి పాత్రమైన ఆరాధనగా 

భూయాత్ = రూపుదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను.

భావము:

             దాసుడికి పురాకృత కర్మవశమున మనసులో కలిగే దురాలోచనలను తమరి కృపాకటాక్షము వలన పోగొట్టి ఆస్థానంలో తమరి గురించే నిరంతరం చింతన చేసేవిధంగా అనుగ్రహించాలి. నోటి నుండి వెలువడే దుర్భా షలు కూడా తొలగిపోయి దానికి బదులుగా తమరి నామసంకీర్తనము చేసేభాగ్యమును కలుగచేయాలి. దేహము చేసే దుశ్చర్యల స్థానంలో తమరికి దాసోహములు సమర్పించగలగాలి అని ప్రార్థి స్తున్నాను.

           ‘ జాయతాం ‘ అన్న ప్రయోగము ప్రతి వాక్యానికి అన్వయిం చటం జరిగింది . ‘ జాయతాం ‘ అన్నశబ్డం లోట్ ప్రత్యయంతమైనది. దానికి అనేక అర్థాలు ఉన్నాయి .ఇక్కడ మొదట అర్హత అన్న అర్థంలోను, తరువాత ప్రార్థన అన్నఅర్థంలోను ప్రయోగించారు. ఇంకా దాసుడి మనసులోని జ్ఞానమంతా తమరి గురించిన చింతనగా ,నోటి నుండి వెలువడే తమరి నామ సంకీర్తనముగా , దేహము చేసేదుశ్చర్యలు తమరి కైంక ర్యముగా అమరాలి అన్న అర్థాన్నిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-10/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


ఉత్తర దినచర్య శ్లోకం 9 – కర్మాధీనే

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 8

శ్లోకము 

కర్మాధీనే వపుషి కుమతిః కల్పయన్నాత్మభావం 

దుఃఖే మగ్నః కిమతి సుచిరం దూయతే జంతు రేషః  !

సర్వం త్యక్త్వా వరవరమునే ! సంప్రతి త్వత్ప్రసాదాత్ 

దివ్యం ప్రాప్తుం తవ పదయుగం దేహి మే సుప్రభాతమ్ !!

ప్రతిపదార్థము:

హే వరవరమునే = వరవరముని స్వామి 

ఏషః జంతుః = మీ  దాసుడైన ఈజీవాత్మ 

కర్మాధీనే = కర్మవశమున 

వపుషి = తన దేహములో 

ఆత్మభావం = ఆత్మభావాన్ని 

కల్పయన్ = తలంచి 

కుమతిః = దుర్బుద్ధిగలవాడై 

దుఃఖే మగ్నః = సంసారసాగరమనే దుఃఖసముద్రంలో మునిగినవాడై 

కిం దూయతే = ఎందుకువచ్చాడు 

ఇతి (మద్వా )= అని తమరుతలంచి 

సర్వం(దాసుడు ) = సంసారదుఃఖం మొదలైన వాటిని 

త్యక్త్వా = వదలి 

సంప్రతి = ఇప్పుడే 

తవ దివ్య పదయుగం ప్రాప్తుం = తమరి దివ్య పాదయుగళములను చేరటానికి అనువుగా 

త్వత్ప్రసాదాత్ = తమరి అనుగ్రహము వలన 

మే = దాసుడికి 

సుప్రభాతమ్ = పొద్దు పొడుపుగా 

దేహి = అనుగ్రహించాలి 

భావము:

‘ కర్మాధీనే ’ అని ప్రారంభించి , ‘ దూయతే జంతు రేషః ‘ అన్న వరకు ఉన్న మొదటి రెండు పాదాలు మామునులు  తమ శిష్యులను గురించి విచారించవలసిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. 

ఇక్కడ ఇతి ,మత్వా కలసి ‘ త్యక్త్వా’ గా చెప్పబడింది. ఇప్పటిదాకా తమరిశ్రీపాదాలను  అనుభవించలేని కాలము ప్రళయరాత్రి . ఇక ఇప్పుడు తమరిశ్రీపాదాలను  అనుభవించబోవు కాలము దాసుడికి శుభోదయము అవుతుంది. తమరికి ఉన్న సహజ సిద్దమైన కారుణ్యగుణముతో ఈ కాలమును అజ్ఞాన తిమిరము నుండి బయటపడి  జ్ఞానోద యమును పొందే  శుభోదయముగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-9/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 8 – అగ్రే పశ్చాదుపరి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 7

శ్లోకము

అగ్రే పశ్చా దుపరి పరితో భూతలం పార్శ్వతో మే 

మౌళౌ వక్త్రే వపుషి సకలే మానసామ్భోరుహే చ !

పశ్యన్ పశ్యన్ వరవరమునే ! దివ్యమంఘ్రిద్వయం తే 

నిత్యం మజ్జన్నమృత జలధౌ నిస్తరేయం భవాబ్ధిమ్ !!

ప్రతిపదార్థము:

హే వరవరమునే ! = స్వామి వరవరముని 

తే = తమరి 

దివ్యం = దివ్యమైన 

అంఘ్రి ద్వయం = శ్రీపాద జంట 

అగ్రే = ముందర 

పశ్చాత్  = వెనుక 

భూతలం పరితః = భూమి నలువైపులా 

మే పార్శ్వతః = దాసుడి ఇరుపక్కల 

మౌళౌ = తలలోపైన  

వక్త్రే = ముఖముపైన 

సకలే వపుషి = సమస్త శరీరభాగాలలోను  

మానసామ్భోరుహే చ = హృదయ కమలములోను 

పశ్యన్ పశ్యన్ = ఎడతెగని స్పష్టమైన చూపులు

అమృత జలధౌ = అమృతమయమైన కడలిలో 

మజ్జన్ = మునిగి 

భవాబ్దిమ్ నిస్తరేయం = జనన మరణ చక్రాన్ని దాటాలని కోరుకుంటున్నాను.

భావము:

“ గురుపాదాంభుజం ధ్యాయేత్ గురోరన్యం నభావయేత్ “ (ప్రపంచ సారం ) (ఆచార్యుల శ్రీపాదాలను ధ్యానించాలి ఆచార్యులను తప్ప ఇతరములను ధ్యానించరాదు.)అన్న ప్రమాణమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక కడలిలో మునిగిపోతున్నవాడు మరొక కడలిని దాటడానికి ప్రయత్నించటం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఆచార్యుల  దివ్యమైన శ్రీపాదాలను ధ్యానం చేస్తున్న భావనాప్రకర్ష యొక్కమహిమవలన సకలము సాధ్యమే అవుతుంది. ఇందులో అ సాధ్యమేది లేదు అంటున్నారు ఆచార్యభక్తాగ్రేసులైన ఈ వ్యాఖ్యాత అయిన తిరుమళిశై అణ్ణావప్పంగార్ స్వామి .

‘భగవతా ఆత్మీయం శ్రీమత్ పాదారవిందయుగళం శిరసి కృతం ధ్యాత్వా అమృత సాకారంతర్నిమగ్న సర్వావయవ సుఖమాసీత ‘ (భగవంతుడి శ్రీపాదారవిందయుగళం తన శిరశ్శు మీద ఉంచినట్లుగా భావన చేసి ఆనందమయమైన అమృతసాగరంలో సమస్త అవయవములు మునిగిఉండటం వలన అంతులేని సుఖమును అనుభవించవచ్చు ) అని శ్రీవైకుంఠగద్యంలో భగవద్రామానుజాచార్యులు భగవంతుడి పరంగా చెప్పగా ఇక్కడ వీరు ఆచార్య పరంగా చెప్పారు. 

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-8/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


ఉత్తర దినచర్య శ్లోకం 7 – త్వం మే

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 6

శ్లోకము 

త్వం మే బన్దు: త్వమసి జనకః త్వం సఖా ,దేశికస్త్వం

విద్యా వృత్తం సుకృత మతులం విత్తమ ప్యుత్తమం త్వమ్ !

ఆత్మా శేషీ భవసి భగవన్నాన్తర శ్శాసితా త్వం

యద్వా సర్వం వరవరమునే ! యద్య దాత్మానురూపమ్ !! 

ప్రతి పదార్థము:

హే వరవరమునే = స్వామి వరవరముని 

త్వం = తమరు దాసుడికి 

బన్దు అసి = ఆప్త బంధువు

త్వం జనక అసి = జ్ఞాన భిక్ష పెట్టినందువలన మీరే దాసుడికి తండ్రి 

త్వం సఖా అసి = 1. ఆపదలో ఆదుకునే మిత్రులు 2. భగవదనుభవ కాలంలో తోడూ కూడా మీరే 

త్వం దేశిక అసి = తెలియని విషయాలను తెలియజెప్పే ఆచార్యులు తమరే 

త్వం విద్యా అసి = ఆచార్యులు ప్రేమతో బోధించే విద్య కూడా తమరే

త్వం వృత్తం అసి = ఆచార్యులు బోధించిన విద్య వలన వచ్చిన నడత,నమత్ర  దాని వలన వచ్చే వృత్తం కూడా తమరే

త్వం అతులం సుకృతం అసి = ( స్నేహితులు బంధువుల వలన ధనము ,లాభము మాత్రమే లభిస్తుంది ) అసమానమైన పుణ్యము రావటానికి కారణం తమరే

త్వం వుత్తమం సిద్దం అసి = ఎన్నటికి తొలగి పోనీ ఉన్నతమైన సంపద మీరు .( లోకలోని సంపదలన్నీ కొంత కాలం ఉండి తరవాత పోతాయి. వాటి వలన దుఃఖం మాత్రమే ఏర్పడుతుంది.)

త్వం ఆత్మా అసి = పైన ఉదాహరించిన వాటినన్నిం టిని భరించే ఆత్మ మీరే

త్వం శేషీ భవసి = ఆత్మకు స్వామి కూడా మిరే 

హే భగవన్ = జ్ఞానం ప్రేమ కరుణ అన్నీ అపారంగా కలిగిఉన్న మామునులైన మీరు నాపాలిట భగవంతుడే  

త్వం అన్తర శ్శాసితా అసి = 1. నాలోకి ప్రవేశించి శాసించేది మీరే 2. అంతర అనబడే పరమాత్మను నియమించే అనంతరుడైన జ్ఞానీ కూడా మీరే  

యద్వా = ఇలా ఎన్నని చెప్పగలను?

ఆత్మానురూపమ్ = విరోధిని తొలగించి భగవత్ భాగవత ఆచార్య కైంకర్యములు చేసే భాగ్యమైన ఆత్మానురూపాన్ని  ఇచ్చేది మీరే 

యద్యత్ భవతి = జీవాత్మస్వరూపానికి కావలసినవి ఎమేమున్నాయో 

అసి = అవన్నీ తమరే

భావము; 

బద్నాతి ఇతి బన్దు…..మనల్ని ఎప్పుడూ వదలక మనతో పాటే మన సుఖ దుఖాలన్నీ అనుభవించే బంధువు, సఖుడు , స్నేహితుడు. మనకు కష్టం కలిగినప్పుడు దానిని పోగొట్టేవాడు, మనం భగవదనుభవంలో  ఉన్నప్పుడు ‘ బోధయంతం పరస్పరం’( భగవద్గీత-10-9 ) అన్నట్లు మంచిని బోధించేవాడు. ఇంకా “ తన్జమాగియ తన్దై తాయోడు  తానుమాయ్ “ (3-6-9)అని తిరువాయిమోళిలో అన్నట్లు కాపాడే తండ్రి, తల్లి మరియు స్వయంగా వారు తానే అయ్యారు. ఆళ్వార్లు ‘ నాన్ ‘ అని చెప్పాల్సిన చోట           ‘ తామ్ ‘ అని అంటున్నారు. త్వం ఆత్మా అసి ‘ ……అన్న ప్రయోగానికి ‘ తమరు ఆత్మాగా ఉన్నారు ‘ అని అర్థంగా చెప్పుకోవచ్చు . 

శేషి భవసి,  అన్తర శ్శాసితా భవసి…అన్న మాటలకు నన్ను దాసుడిగా చేసుకున్న వారు,పరమాత్మలా నాలో ప్రవేశించి నియమించే వారు అన్నీ మీరే  అవుతున్నారు అని అంటున్నారు .

అన్తర శ్శాసితా…అన్న ప్రయోగానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు 1. అన్తరః అంటే అన్తరే భవః మనసులో ఉన్న పరమాత్మ .2. ఆత్మానః అన్తరః…. బృ.ఉప . 5-7-22 లో అన్తరః.అన్న పదానికి ఆత్మకు లోపల ఉండే పరమాత్మ అని అర్థంచెప్పటం వలన . అన్తరస్య అయం …లోపల ఉన్న పరమాత్మ లోపల కూడా ఉండి ఆ  పరమాత్మను నియమించే జ్ఞాని  అని అర్థం. ‘ జ్ఞానీతు ఆత్మైవ మే మతం ‘ ( గీత-7-18) జ్ఞాని తనలో ఉండి తనను నియమించే వాడిగా పరమాత్మ గీతలో తనే చెపుతున్నారు. దీనికి ప్రమాణంగా ‘ యద్వా ..’  ఆత్మకు సమానమైనది మరొకటి ఏది ఉంది? ఏది లేదు. 

త్వం ఆత్మా అసి … తమరే దాసుడిగా మారుతున్నారు, అని వీరు తమకు మామునులతో చెప్పుకున్న సామ్యము  జీవాత్మలన్నింటికీ సామ్యము చెప్పటం కాదు. శేష శేషి భావముతోను నియంతృత్వ భావనతోను ‘ శేషి భవసి అన్తరః శ్శాసితా భవసి….’అని చెప్పటం వలన స్పష్ట మవుతుంది. ఈ ప్రేమ తమకు పరమాత్మతోఉన్న శాస్త్ర సిద్ద మైనది ‘ పీదకవాడై పిరానార్ పిరమ గురువాగి వందు ‘ (పెరియాల్వార్ల తిరుమొళి 5-2-8 )అన్నట్లు మాము నులు పరమాత్మయోక్క అవతారమైనందు వలన వీరు తమకు ఆ మామునులతో సామ్యమును చెప్పుకున్నారని భావించవచ్చు. 

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-7/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తర దినచర్య శ్లోకం 6 – ఉన్మీల

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 4 & 5

శ్లోకం 6

శ్లోకము

“ ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతితల ముపరి క్షీరసంగాత గౌరం

రాగ చంద్ర ప్రకాశ ప్రచురనఖమణి ద్యోత విద్యోత మానమ్ !

అజ్ఞుల్యగ్రేషు కిఞ్చిత్ నతమతి మృదులం రమ్యజామాతృయోగీ

దివ్యం తత్పాదయుగ్మం దిశతు శిరసి మే దేశికేంద్రో దయాళుః !!

ప్రతిపదార్థము :

దయాళుః = కరుణ పొంగు గుణము కలవారైన

దేశికేంద్రః = ఆచార్యులలో ఉన్నతులైన

రమ్యజామాతృయోగీ = రమ్యమైన దేహసౌందర్యముకలిగివున్న అళగీయ మణవాళ మామునులు

ఉన్మీల గర్భ ద్యుతితలం = అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మములోపల ఉండే లేత ఎరుపురంగు వంటి కాంతితో నిండిన అరిపాదాలు

ముపరి = పాద పైభాగంలో

క్షీర సంగాత గౌరం = చిక్కటి పాల వంటి కాంతితో కూడిన రంగులో

రాగ చంద్రప్రకాశ ప్రచుర నఖమణి ద్యోత విద్యోత మానం = పున్నమి నాటి చంద్రకాంతిని పోలిప్రకాశిస్తున్న నఖములు

అజ్ఞుల్యగ్రేషు = నఖములు అంచులు

కిఞ్చిత్ నతం = కొద్దిగా వంగి వుండి

అతి మృదులం = చాలా మృదువుగా

దివ్యం = అప్రాకృతమైన

తత్ = ఉన్నతమైన

పాదయుగ్మం = పదముల జంట

మే శిరసి = దాసుడి తలపై

దిశతు = ఉంచి అనుగ్రహించాలి

భావము:

ప్రస్తుత శ్లోకము నుండి వరుసగా ఆరుశ్లోకములు శిష్యులు స్తోత్రం చేస్తున్నట్లుగా అమరి ఉన్నవి. ఈ శ్లోకములో ఒక శిష్యుడు తన తలకు ఆభరణంగా మామునుల శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించాలని కోరుతున్నాడు.

దయాళుః…….దయను చూపడం అనేది వారికి సహజ సిద్దమైన గుణము.  శిష్యులు సేవచేస్తే వారిమీద దయ చూపించే సామాన్య గురువులలా కాక ఎటువంటి సేవలను ఆశించకుండా నిర్హేతుకంగా కృపను చూపేవారని చెపుతున్నారు.

దిశతి ఉపతి శతి ఇతి దేశికః…… శాస్త్రార్థములను ఉపదేసించువారు, దేశికులని పిలువబడుతున్నారు.  “ దేశికానాం ఇమ్తరః దేశికేంద్రః “ ఆచార్యులైన దేశికులకు నాయకులు. ఆచార్యులైన దేశికులకు నాయకులు అంటే ఆచార్యులకు ఉండవలసిన జ్ఞానము, అనుష్టానము, దయ మొదలైన గుణ పరిపూర్ణులు, ఆచార్యులకే తల మాని కము వంటి వారు. మామునుల అరిపాదాలు తామర వంటి ఎరుపు రంగులో ఉంటాయి. నఖములు అంచులలో కొద్దిగా వంగి పౌర్ణమి వెన్నెల వెలుగును పోలిన రంగులో ఉంటాయి. వారి శ్రీపాదాలు మొత్తం మెత్తగా, పాలవంటి తెలుపు రంగును కలిగి ఉంటాయి.  మామునులు ఆదిశేష అవతారము కావున అప్రాకృతములు (పరమపదములో మాత్రమే ఉండే ఉన్నత పదార్థము.) అంటారు. ఈ లోకంలో ఉండే సంసారుల పాదాలలాగా సామాన్యమైనవికావు.  అందుకే వారి పాదాలను “ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతి “ తో పోల్చారు. ఇతర పోలికలు కూడా ఉత్తమ పురుషుడికి ఉండవలసిన వాటినే చెప్పారు. భగవద్భక్తులైన ఆళ్వార్లు ‘నిన్ శేమ్మా పాదపర్బుదం తలై సేర్తు‘ అని పరమాత్మను ప్రార్థించారు. అలాగే ఆచార్యులపై అపారమైన భక్తి గల శిష్యులు ఒకరు ‘పాదయుగ్మం దిశతు శిరసి మే’ అంతటి ఉన్నతమైన పాదాలను తన శిరస్సు మీద ఉంచి అనుగ్రహించ వలసిందిగా ఆచార్యులైన మామునులను ప్రార్థిస్తున్నారు. ‘తమరి శ్రీపాదాలను నా శిరసు మీద పెట్టండి‘ అని అనకుండా ’దాసుడి శిరసు మీద తమరి శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించండి’ అని ప్రార్థన చేస్తున్నారు.

ఈ విషయాన్నీ ముందు ముందు వచ్చే శ్లోకాలలో వివరంగా చూడవచ్చు.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-tamil-6/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ఉత్తరదినచర్య – స్లోకం – 4 మరియు 5

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 3

శ్లోకం 4 & 5

తతః కనక పర్యంకే తరుణధ్యుమణిధ్యుతౌ |
విశాలవిమల స్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే || (4)

సమగ్రసౌరభోద్గార నిరంతర దిగంతరే |
సోపదానే సుఖాసీనం సుకుమారే వరాసనే || (5)

$3B72773B15A9C344

ప్రతి పదార్థం:

తతః = తరువాత

తరుణధ్యుమణిధ్యుతౌ = బాల సూర్యునిలాంటి కాంతితో

విశాల విమల శ్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే = విశాలమైన , శుధ్ధమైన , దృడముగా , నున్నగా , సున్నితముగా ఉన్న

సమగ్ర సౌరభ ఉద్గార నిరంతర దిగంతరే = పెరుమాళ్ళ శేష మాలల సౌరభవముతో నాలుగు దిక్కులు వ్యాపించగా

సోపదానే = ఆనుకోవటానికి వీలుగా దిండ్లు అమర్చబడిన

కనక పర్యంకే = బంగారు మంచములో

సుకుమారే = సుకుమారముగా

వరాసనే = ధ్యానము చేయుటకు అనువైఅన జింక చర్మముతో చేయబడ్డ ఆసనములో

సుఖాసీనం =   సుఖాసీనులైన

తం = ఆ మణవాళ మామునులను

చింతయామి = సదా ధ్యానిస్తాను

భావము:

సకలశాస్త్రార్థములకు లక్ష్యమైన పంచమోపాయము( రామానుజులే మొక్షోపాయము అని) మనసార విశ్వసించిన మామునులు తమ తీయని , సులభమైన మాటలతోశిష్యులను ఉల్లాస పరచి, ఆ   రామానుజులను ధ్యానించుటకు ఉపక్రమించారు. అందుకోసము స్వర్ణమయమైన మంచముమీది  ఆసనములో కూర్చున్న అందమును సదా ధ్యానము చేస్తున్నానని ఈ శ్లోకములో చెపుతున్నారు.    తామే కోరి మంచము మీద అందునా స్వర్ణమయమైన మంచము మీద కూర్చోనుట శాస్త్ర విరుధ్ధము. అయినప్పటికీ శిష్యుల కోరిక మేరకు అలా కూర్చున్నారు అని గ్రహించ వలసి వుంది.   బంగారమువెండి, కంచుఇత్తడి, రాయి మొదలైన పాత్రలలో వండిన ఆహారము స్వీకరించుట వలన సన్యాసికి పాపము చేకూరదు. ఆ పాత్రలను ఇతరుల నుండి అడిగి తీసుకుంటే పాపము కలుగుతుంది, అని మేధాతి చెప్పిన విషయమునుపరిసీలిస్తే, ఆహారమునకే కాక మంచమునకు ఉపలక్షణముగా వర్తిస్తుందని తెలుస్తున్నది. శిష్యులు బంగారు మంచమును ఇచ్చి  దాని మీద కూర్చొని తమను వీక్షించమని ప్రార్థించినపుడు వారి కోరికను నెరవేర్చుట దోషము కాదు. బంగారము మీదనో, మంచము మీదనో కోరికతో కూర్చున లేదు. శిష్యుల కోరిక తీర్చ వలచిన నిర్భందము ఆచార్యులకున్నది అది సన్యాసి అయినా తప్పు లేదు అని భావము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-4-and-5/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org