Author Archives: shashidhar nalla

తిరువెళుకూట్ఱిరుక్కై- అవతారిక

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< తనియన్లు

              తిరుమంగై ఆళ్వార్లు ఈ సంసారములోని సుఖ: దుఖ:ములను చూసి విరక్తి చెందారు. పెరియ తిరుమొళిలో, అనేక దివ్య దేశములను వర్ణించారు. అది చూసి ఈయన శ్రీవైకుంఠమునే మరచిపోయారని భగవంతుడే ఆశ్చర్య పోయి ఈ సంసారము యొక్క స్వరూపమును చూపారు.

పెరియ తిరుమొళిలో ఆఖరి దశకము  “మాఱ్ఱముళ”లో  ఆళ్వార్లు ఈ సంసారములో ఉండటము నిప్పులలో ఉన్నట్లు అని పాడారు.  ఆ దుఖ:మును తొలగించుకోవటానికి  తిరుక్కుఱుంతాణ్డగమును  పాడారు.          

 అందులోని “వాక్కినాల్ కరుమం తన్నాల్(4)” లో ఈ సంసారము మీద వైరాగ్యముతో,  త్రికరణ శుద్దిగా భగవంతుడిని శరణాగతి చేశారు.

 భగవంతుడు   ఆళ్వార్లను ఈ సంసారములోని దుఖ:మును తొలగడానికి తన నుండి ఏమి ఆశిస్తున్నారని అడిగారు.  ఈ సంసారము యొక్క రుచి వాసనలున్నా అవి తనను భగవదనుభవమునకు దూరము చేస్తున్నాయి. అందువలన రుచి వాసనలతో  సహా తొలగించి దీని నుండి తనను బయట పడేయాలని అడిగారు ఆళ్వార్లు.  సమస్త పదార్థములు నీచే సృష్టించబడి, రక్షింప బడుతున్నాయి.  అందువలన నీవు తప్ప మాకు రక్షకులు ఇంకెవరూ లేరు.   నన్ను నేను రక్షించుకోగలిగితే నేను శ్రీవైకుంఠమునకు ఎప్పుడో చేరుకునేవాడిని కదా! నీవు మాస్వామివి అన్నారు.  ఆళ్వార్లందరూ ఈ విషయాన్నే చెప్పారు,  తమను ఆయన సొత్తుగా అంగీకరించారు.  తిరువాయిమొళి 5-8-3 లో  “ఉన్నాలల్లాల్ యావరాలుం ఒన్ఱుం కుఱై వేణ్డేన్ ” (నీ వలన కాక పోతే ఇంకెవరి వల్ల అవుతుంది) అన్నారు నమ్మాళ్వార్లు. అలాగే ఇక్కడ తిరుమంగై ఆళ్వార్లు తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు. ఈ  ప్రబంధములో ఈ విషయమునే పాడారు. నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమొళి 5వ దశకములో తిరుక్కుడందై ఆరావముద పెరుమాళ్ళను శరణాగతి చేశారు.

aarAvamuthanకోమళవల్లి సమేత ఆరావముదన్ , తిరుక్కుడందై.

kaliyan-and-his-nachiyar-2        కుమదవల్లి నాచ్చియార్ సమేత తిరుమంగై ఆళ్వార్, ఆళ్వార్ తిరువారాధన పెరుమాళ్- శిన్దనైక్కినియ పెరుమాళ్(నీల వర్ణ వస్త్రం ఉన్న వారు)

రెండవ అవతారిక  వ్యాఖ్యానము:

           పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధమునకు  కాలక్షేపము పూర్తి చేసిన తరువాత  శ్రీవైష్ణవులు కొందరు అక్కడికి వచ్చారు. వారి ప్రార్థన మేరకు  కృపతో ఆచార్యులు మళ్ళీ కాలక్షేపము చేసారు. పెరియవాచ్చాన్ పిళ్ళై ఆచార్యులైన నంపిళ్ళై గారికి కూడా తిరువాయిమొళికి,  ఈడు36000 పడికి కాలక్షేపము  చేసిన సమయములో,  ఇలాగే మూడు సార్లు జరిగింది.  అందువలననే ఈడు 36000లో  శ్రీయ:పతి పడిమూడు సార్లు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.

తమస్సుచే ఆవరింపబడి, నామ రూపములు లేకుండా, ఙ్ఞాన శూన్యులుగా, అచిత్తులా పడి వున్న జీవులకు నువ్వు కృపతో  నామ రూపములనిచ్చి, ఙ్ఞానము నిచ్చి,  మాకు , నీకు వున్న సంబంధమును నిరూపించావు అని తిరువెళుకూఱ్ఱిరుక్కై రెండవ అవతారికలో పెరియవాచ్చాన్ పిళ్ళై చెపుతున్నారు.

 ఆళవందార్ తమ స్తోత్ర రత్నము(10)లో, ‘అమూని భువనాని భవిధుం నాలం’ (ఈ సమస్త భువనములు నీవు లేనిదే సృజింపబడేవి కావు. సమస్తము నీ ఆధీనములోనిదే కాని వేరు కాదు) అన్నారు.

 అదే అర్థములో నమ్మాళ్వార్లు  (తిరువాయిమొళి 1.1.6) లో, “నిన్ఱనర్ ఇరుందనర్ నిన్ఱిలర్ ఇరుందిలర్” అన్నారు.

 పొయిగై  ఆళ్వార్లు   ముదల్ తిరువందాది (60)లో,  “చరణామఱై పయంద” (చతుర్ముఖ బ్రహ్మతో సహా చిత్, అచిత్ పదార్థములన్నీ తమ రక్షణ కోసము చక్రధారివైన నిన్నే ఆశ్రయిస్తారు. ఈ   సంసారము నుండి తమను తాము  రక్షించుకోలేరు) అన్నారు.

  అలాగే నమ్మాళ్వార్లు  https://guruparamparaitelugu.wordpress.com/2013/09/11/nammazhwar/(తిరువాయిమొళి 10.10.6)లో, “ఉణ్దిత్తాయి ఇని ఉణ్డొళియాయ్ “(నీలో నుంచి సృజించావు. మరి మళ్ళి నిలో చేర్చుకో) అన్నారు.

వశిష్ట,  విశ్వామిత్రుల వంటి ఙ్ఞాన సంపన్నులుండగా రక్షించేవారు లేరని ఎలా చెపుతునారని  భగవంతుడు అడిగాడు.

 దానికిఆళ్వార్లు “నైవ కించిత్ పరోక్షం తే ప్రత్యక్షోసి న కస్యచిత్ | నైవ కించిద సిధ్ధం తే న చ సిధ్ధోసి కస్యచిత్” (జితంతే 1-6),  నీకు తెలియనిదేది లేదు. నిన్ను తెలిసిన వారు లేరు.  నువ్వు నీ కృపచే తప్ప ఎవరి స్వయం కృషితోను పొందగలిగిన వాడవు కాదు.) అన్నారు. గుడ్డి వాడు చూపు వున్న వడి సహాయము లేనిదే నడవలేడు.  అలాగే ఎంతటి ఙ్ఞాన, బల, శక్తి వంతులైనా నీ కృప లేనిదే నిన్ను పొందలేరు.  

తమరిచ్చిన  ఙ్ఞాన, బల, శక్తులున్నా,నీ కృప లేనిదే నేను   శ్రీవైకుంఠము చేరగలనా?  అనడిగారు ఆళ్వార్లు.  (భగవంతుడు ఆలస్యము చేస్తున్నాడని కాదు ,  పసి బిడ్డ తల్లి కనపడక పోతే ఏడ్చి సాధించినట్లు  ఆళ్వార్లు కూడా ఈ సంసారము నుండి బయట పడవేయమని విన్నవించుకుంటున్నారు). 

                                                           అవతారిక సంపూర్ణము

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/thiruvezhukurrirukkai-introduction/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై – తనియన్లు

Published by:

మొదటి తనియన్ 

పిళ్ళైలోకం జీయర్   మణిప్రవాళ భాష(సంస్కృత తమిళ భాషల  మిశ్రమం)లో అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానము ఇక్కడ వర్ణింపబడింది.

దేవాలయాన్ని ఎలాగైతే  ప్రాకారములు రక్షించునో  ఆ మాదిరిగా ఆ భగవానుని ప్రాకారములను (వైభవమును)  రక్షించు  షట్ప్రబంధములను అనుగ్రహించిన తిరుమంగైఆళ్వార్ కు పల్లాండు (మంగళాశాసనం) ను చేయు తనియన్.

ఆచార్యులు నేరుగా వీరిని స్తుతిస్తున్నారు. అన్నీ దివ్యదేశముల యందు ఆళ్వార్ ప్రస్తుతం అర్చారూపిగా వేంచేసి ఉన్నారు. ఈ తనియన్ ఆళ్వార్ కు మంగళాశాసనం చేయుచున్నది.

                                        thUyOn sudar mAna vEl

తూయోన్ శుడర్ మానవేల్

ramanuj

ఎంపెరుమానార్( శ్రీపెరుంబుదూర్)

ఎంపెరుమానార్ అనుగ్రహించిన తనియన్ 

వాళి పరకాలన్ వాళి కలికన్ఱి/
వాళి కురైయలూర్ వాళి వేన్దన్/
వాళి యరో మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్                                                                           తూయోన్ శుడర్ మానవేల్//

ప్రతిపదార్థం 

వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
పరకాలన్- ఇతర మతస్తులకు(తత్త్వాలకు) యముడి వంటి వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
కలికన్ఱి – కలి నశింపచేయు వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి – శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
వేన్దన్ – తిరుమంగై కు రాజు
కురైయలూర్ – తిరుక్కురయలూర్ నివాసి(రాజు)
వాళ్-  సుఖముగా నివసించు ఆ స్థానం (వీరి వైభవం వలన)
వాళి- శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
శుడర్ – ప్రకాశించు/కాంతిగల
మానమ్- గొప్పవైభవం గల
వేల్ – ఈటె/బల్లెము
మఙ్గైయర్ కోన్    – మంగై(ప్రదేశం) కు రాజైన
తూయోన్ – బాహ్యాంతరములుగా పవిత్రులగు/శుద్ధులగు
వాళ్ వలియాల్ – తమ ఆయుధమగు వేళ్(కత్తి) బలముతో
మాయోనై  – ఎంపెరుమాన్  నుండి                                                                                                                   మన్దిరఙ్గొళ్ – భగవానుని నుండి తిరుమంత్రమును  పొందిన
వాళి-శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక                                                                                  యరో – ‘అసై’ అను తమిళ వ్యాకరణ పదం(పూరకం)

వ్యాఖ్యానం

వాళి పరకాలన్ – పరకాలులు అను నామాంతరం గల ఆళ్వార్ కు మంగళం . ‘పరులు’ (ఇతర మతస్తులు)- ఎంపెరుమాన్ ను తిరస్కరించువారు. అలాంటి వార్లకు ఆళ్వార్ కాలుల (యముడు) వంటి వారు. కావున వీరు పరకాలులు అయ్యిరి.

వాళి కలికన్ఱి – ఆళ్వార్ కు కలికన్ఱి అని మంగళాశాసనం(కలి యొక్క దోషములను తొలగించువారు‌)

కురైయలూర్ వాళి వేన్దన్ వాళి తిరుక్కురయలూర్ లో అవతరించి దానికి రాజై , రక్షించే వారికి మంగళం

పిమ్మట ఎంపెరుమానార్ తాము ఆళ్వార్  కు మరియు వారు ధరించిన బల్లెము/ఈటె కు మంగళాశాసనం చేస్తున్నారు.

 మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్  తూయోన్ శుడర్ మానవేల్//

మాయోనై – ఆళ్వార్,  తిరువరంగమున  ఆదిశేషుని పై పవళించిన ‘మాయోన్ ‘ ను తమ కత్తితో బెదిరించి అతని నుండి ‘తిరుమంత్రమును’  పొందిరి.

మాయోనై – వివరణ – “కడి అరంగత్తు అరవణైయిల్ పల్లి కొళ్ళుమ్ మాయోనై ” (పెరుమాళ్ తిరుమొళి 1-2) మరియు ” వాళి శుళి పొరితత్త నిర్ పొన్నిత్తెన్ అరంగన్ తన్నై వాళి పరితత్త వాళన్ వలి“, దీనర్థం- ఆళ్వార్  తమ కత్తి యొక్క బలముతో రంగనాథుని నుండి తిరుమంత్రాన్ని పొందిరి.

తనను ప్రేమించే వారి సమస్తములను అపహరించు మాయోన్  దగ్గర నుండి ఆళ్వార్ ‘తిరుమంత్రాన్ని’ దొంగలించారు. ( కై పొరుళ్ గళ్ మున్నమే కైక్కొణ్డార్ కావిరి నిర్ పురళా ఓడుమ్  తిరువరంగ చ్చెల్వనార్– నాచ్చియార్ తిరుమొళి-11-6)

మంత్ర ప్రతిపాద్యుడగు  ఎంపెరుమాన్ నుండి ఆళ్వార్ తిరుమంత్రమును పొందిరి. దీనినే  తిరునెడుదాణ్డగమ్ లో ఇలా అన్నారు – ‘ అన్దణార్ మత్తు అంది వైతత్త మందిరమ్

మఙ్గైయర్ కోన్   తిరుమంగై కు రాజైన ఆళ్వార్

తూయోన్ – ఆళ్వార్ బాహ్యాంతర పవిత్రతను/శుద్ధత్వం   కలిగి ఉన్నారు.

అనన్యార్హ   శేషత్వం (మరెవరికిని చెందకుండా ఉండుట) అనన్య శరణత్వం (ఎంపెరుమాన్ ను పొందుటకు   అతనిని తప్ప మరెవరిని ఆశ్రయించ కుండుట)  అనన్య భోగ్యత్వమ్ (ఎంపెరుమాన్ తప్ప మరేతరము కూడ అనుభవ (ఆశ్రయించుటకు) యోగ్యము కాకుండుట)- అంతరశుద్ధిగా ఈ విశేష గుణములను  ఆళ్వార్ కలిగి ఉన్నారు

పంచసంస్కారాదులను పొందుట మొదలైనవి బాహ్యశుద్ధిగా చెప్పబడింది.

ఆళ్వార్ తమ నామధేయములను ఒక పాశురమున తెలిపారు. ఈ నామధేయములు తన  బాహ్యాంతర శుద్ధత్వమును తెలుపుచున్నవి. అవి – అంగమలత్తడ వయల్ శూళ్ ఆళినాడన్, అరుళ్ మారి, అరట్టముఖి, అడైయార్ శీయమ్ కొఙ్గు మలర్  క్కురయలూర్ వేళ్ మంగైవేన్దన్, కూర్ వేళ్ పరకాలన్, కళియన్ (పెరియ తిరుమొళి 3-4-10)

శుడర్ మానవేల్ –  ప్రకాశవంతమైన పెద్దనైన బల్లెము కలిగిన వారు,  మంచి నిర్వాహణాధికారి,  విశేష ప్రతిభాపాటవం కలవారు  తిరుమంగై మన్నన్ .

తూయోన్  వేళ్  వాళి యరో- ఈ తనియన్  లో ఆళ్వార్ తో పాటు ప్రభావం కల వారి  కత్తి కూడ మంగళాశాసనం కావింపబడినది. ఆండాళ్ కూడ తమ తిరుప్పావై-24 పాశురమున- ” నిన్ కైయిళ్  వేళ్ పోత్తి? ” అని కృష్ణునకు మంగళం పాడేటప్పుడు అతని ఆయుధమైన బల్లెమునకు కూడా మంగళం  గావించెను కదా.  ఆళ్వార్  తమ ఆయుధమైన బల్లెము గురించి ఇలా   అంటున్నారు ‘ కొత్తవేళ్’ (పెరియ తిరుమొళి 3-2-10) అని- ఏ లోపాలు లేని ఎల్లప్పుడు విజయ సారథ్యం వహించునది ఆళ్వార్ బల్లెము. ఈ తనియన్ అనుగ్రహించిన వారికి( ఎంపెరుమానార్) ఆళ్వార్ తో పాటు వారి ఆయుధం పైన కూడ అధిక వ్యామోహం ఉన్నదని తెలుస్తున్నది,  కావుననే ఆయుధానికి కూడ మంగళం గావించారు.

రెండవ పాశురం కూడ ఎంపెరుమానార్ చే అనుగ్రహింప బడినది.

(ఈ పాశురానికి పిళ్ళైలోకం జీయర్ వారి వ్యాఖ్యానము  లేదు  కావున కేవలం ప్రతి పదార్థం మాత్రమే ఇవ్వబడింది.)

శీరార్ తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్ శెంతమిళాళ్                                                                                                   ఆరావముదన్ కుడన్దై పిరాన్ తన్ అడియిణైక్కుళళ్|                                                                                             ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు ఇవ్వులగుయ్యవే                                                                                   శోరామల్ శొన్న అరుళ్ మారి పాదమ్ తుణై నమక్కే||

ప్రతిపదార్థం 

ఆర్- పూరింప బడినది                                                                                                                                           శీర్ – గొప్ప శబ్దార్థములతో
తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్- తిరువెజుక్కూట్ఱిరుక్కై అను ప్రబంధము
శెంతమిళాళ్-  అందమైన తమిళ భాషలో ఉన్న ప్రబంధం
అడియిణైక్కుళళ్- ఎంపెరుమాన్ పాదపద్మముల పై  ఆలాపించబడిన
ఆరావముదన్ – ఆరావముదన్ అను నామము కల
కుడన్దై పిరాన్ తన్ – తిరుకుడన్దై  పెరుమాళ్
ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు – అపౌరేషయముగా పేరుగాంచిన వేదం యొక్క  సారమును స్పష్ఠముగా తెలుపునది.
ఇవ్వులగుయ్యవే- ఈ సంసారమును ఎరిగి జీవించుటకు
శోరామల్ శొన్న- వేదార్థములను వేటిని విడువక అన్నింటిని తెలిపిన
అరుళ్ మారి – కృపావర్షమును వర్షించు తిరుమంగై ఆళ్వార్
పాదమ్ – శ్రీ పాద పద్మములు
తుణై నమక్కే- మాకు రక్షకం

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai-thaniyans-invocation/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

e-book of the whole series: http://1drv.ms/1J8z9Go

Audio

పన్నిద్దరాళ్వార్లలో ఒకరైన తిరుమంగైఆళ్వార్ల కు మాత్రం అనేక ప్రత్యేకతలున్నాయి. లోకములో అందరూ ఆచార్యులను ప్రార్ధించి పంచసంస్కారము పొందుతారు. కాని వీరు మాత్రము మానవమాత్రులను ఆశ్రయించక తిరునరయూర్ నంబిని  ఆశ్రయించి  పంచసంస్కారములను పొందారు. తిరుక్కణ్ణపురం పెరుమాళ్ళ దగ్గర తిరుమంత్రార్థమును పొందారు. వీరిది శార్ఘ అంశమని పెద్దలు చెపుతారు. అందుచేతనేమో వీరి పనులు, పాటలు బాణములా వాడిగా వుంటాయి.  వీరి  అసలు పేరు నీలుడు, ధర్మపత్ని కుముదవల్లి చేత సంస్కరింపబడటం  వలన వీరికి  తిరుమంగై ఆళ్వార్ల న్న పేరు స్థిరపడిపొయింది.  అర్చా రూపంలో కూడా  కుముదవల్లి సమేతంగానే దర్శనమిస్తారు.  వీరు అతి వేగంగా పరిగెత్తే ఆడల్మా అనే గుర్రాన్ని ఎక్కి దివ్యక్షేత్రాలన్నీ తిరిగి సేవించి మంగళాశాసనము చేసారు.

” మారన్ పణిత్త తమిళ్ మరైక్కు ఆరంగం కూఱ”   అని మణవాళమామునులు అన్నట్లు నమ్మాళ్వార్ల ద్రావిడవేదమునకు  ఉపనిషత్ సారమైన ఆరు ప్రబంధాలు పాడారు . అవి1.పెరియతిరుమొళి 2.తిరుక్కుఱుందాండగమ్ 3 . తిరు నెడుందాండగమ్ 4. తిరువెళుకూఱ్ఱిరుక్కై 5.శిరియ తిరుమడల్ 6.పెరియ  తిరుమడల్.

   జీవాత్మ ముక్తపురుషుడై పరమపదమునకు బయలుదేరినపుడు నిత్యసూరులు ఎదురేగి బ్రహ్మరథము లో తీసుకొని వెళతారని శాస్త్రము చెపుతున్నది.  తిరుమంగై ఆళార్లు తిరుమంత్రమే కత్తితో బెదిరించి పొందినవారు. ఆ శ్రీమన్నారాయణుడు పరమపదమునకు చేర్చుకోవటానికి ఆలస్యము చేసాడేమో నని బ్రహ్మరథమును తానే అక్షర రూపములో చేసుకున్నారు. అదే తిరువెళుక్కూఱ్ఱిరుక్కై  ప్రబంధము.  ఇందులో ఏడు భాగాలున్నాయి, కాని చూడటానికి ఒకటే పాశురములా కనపడుతుంది. ఆ ఏడు భాగాలలో వచ్చే అంకెలను వరుసగా అమరిస్తే రధం రూపు కడుతుంది. చివర కంబర్ రాసిన శ్రీ రామాయణములో ఇదే అర్ధం వచ్చే పాశురాన్ని కలిపి సేవించడం ఆచారముగా పెద్దలు ఏర్పాటు చేసారు.

తిరుమంగై ఆళ్వార్  పెరియ తిరుమొళిని మొదట  పాడారు. అందులో భగవంతుడిని దేహాత్మ సంబంధమునుతొలగించమని ప్రార్థిస్తూ ముగించారు.

తిరువెళుకూట్ఱిరుక్కై (తిరువెళుకూత్తిరుక్కై అని కూడ వ్యవహరింపబడుతుంది) తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ఆరు ప్రబంధములలో మొదటిది.

తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ప్రబంధములలో  మొదటిదైన  పెరియతిరుమొళి లో ఈ దేహసంబంధమును తొలగించమని(ఆత్మకు దేహముతో ఉన్న సంబంధం) ప్రార్థించిరి. తమ రెండవ ప్రబంధమైన తిరుక్కురుదాణ్డగం లో, ఎంపెరుమాన్ తాను ఆళ్వార్ కి తమపై ఆర్తిలో  పరాకాష్ఠ వచ్చేంతవరకు  దర్శనమివ్వలేదు, ఈ ఆలస్యపు విరహాన్ని ఆళ్వార్  భరించలేకపోయిరి.  ఎలాగైతే బాగా దప్పికగొన్న వాడు నీటిలో దిగి ఆ నీటిని త్రాగి దానిలో  మునిగి తనపై కుమ్మరించుకుంటాడో ఆళ్వార్ కూడా ఆ మాదిరి తమ గానములో  ఎంపెరుమాన్ తో సంభాషించడం, సాష్టాంగ పడటం/విచారపడుతూ తమకై ఆలోచిస్తూ తామ ఉనికికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రబంధములో. ఎప్పుడైతే బాగా దప్పికఉన్న   వాడు కొంత నీరు త్రాగిన తర్వాత ఆ తృప్తి తీరక మళ్ళీ మళ్ళీ నీటిని త్రాగాలని అనుకుంటాడో,  ఆ రీతిగా ఆళ్వార్ కూడ ఎంపెరుమాన్ అనిభవించాలని ఆర్తితో ఉన్నారు. అలా తమ మూడవ ప్రబంధమైన తిరువెజుక్కూట్ఱిరుక్కై లో తాము తిరుకుడందై(కుంభకోణం) ఆరావముదన్ కు పరతంత్రులై వారిని అనుభవించాలని వాంఛతో ఉన్నారు. అందుకే ఇది శరణాగతి ప్రబంధమైనది. (నమ్మాళ్వార్ కూడ   తిరుకుడందై ఆరావముదన్ కు తమ తిరువాయ్ మొళి 5-8 లో  శరణాగతి చేశారు)

ప్రబంధ నామ నిర్ణయము:  తిరువెజుక్కూట్ఱిరుక్కై- ఎజు- ఏడు, కుఱు- విభాగములు, ఇరుక్కై – కలిగి ఉన్న. లేదా  ఇది ఏడుగా ఉన్నది –  కవిత్వం పై  దేశ, కాల, గణనలపై  ఆధారపడి  ” చిత్రకవిత్వం ” గా ప్రస్తావింపబడుచున్నది. తిరువెజుక్కూట్ఱిరుక్కై ని రథబంధ నిర్మాణంలో లిఖించవచ్చు. రథం ప్రారంభములో కొద్ది వెడల్పుతో ఆరంభమై క్రమంగా వెడల్పు అధికమయిన్నట్లుగా,  తిరువెజుక్కూట్ఱిరుక్కై కూడ పాశురం ప్రథమపంక్తిలో 123 సంఖ్యలను , తరువాతి పంక్తిలో12321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 123454321 సంఖ్యలను , ఆ పై  పంక్తిలో 12345654321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 1234567654321  సంఖ్యలను ప్రయోగించడం జరిగినది.

thiruvezhukURRirukkai

పద్యపు ఈ నిర్మాణాన్ని రథబంధం గా వ్యవహరిస్తారు. ని నిర్మాణ ప్రబంధ రూపం నయనాందకరం చేస్తుంది ఔత్సాహికులకు – thiruvezhukURRirukkai_telugu_drawing

తిరువెజుక్కూట్ఱిరుక్కై తెలుగు చిత్ర పటం

చాలా దివ్యదేశములలో తిరువెజుక్కూట్ఱిరుక్కై ప్రబంధ పారాయణ  రథోత్సవమునాడు చేయబడుతుంది.

ఈ అనువాదం ప్రతిపదార్థ నిర్మాణమునకై ఉద్దేశించినది కాదు. వ్యాఖ్యానములలోని విశేషాంశాలను అందించడానికై ప్రయత్నం చేయబడింది. ఏదైని మార్పులు చేర్పులు అవసరమైతే మమ్మల్ని సంప్రదిందగలరు. మీ విలువైన  అభిప్రాయాలను మేము సదా ఆహ్వానిస్తాము.

వ్యాఖ్యాన చక్రవర్తి అగు పెరియవాచ్చాన్ పిళ్ళై గారి వ్యాఖ్యానముతో అందించదడింది.

వ్యాఖ్యానపు వివరణాత్మక వర్ణనలకు  పుత్తూర్ స్వామి యొక్క భాష్యం చాలా వరకు ఉపయోగపడింది.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

9వ పాశురం

periyaperumal-thondaradippodiazhwar

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – తొండరడిపొడి ఆళ్వార్ ఇలా వివరిస్తున్నారు ” మొదటిపాశురంనుండి 9వ పాశురం వరకు ఋషులు , దేవతలు తమ నిగూడమైన ఉద్ధేశ్యాలను/ఆశయాలు నెరవేర్చబడగానే వారిని వదలివేసారు. ఈ పాశురమున ఆళ్వార్ఎంపెరుమాన్ ను  మీరు దయచేసి మేల్కొని మమ్ములను అనుగ్రహింపుము, అలానే మీరు మేల్కొంటున్నపుడు ఆ నిద్రాకాలిక ముఖ సౌందర్యమును సేవించాలని కోరుకుంటున్నాము’ అని విన్నవిస్తున్నారు.
  •  పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు
    • ఉపక్రమం(ఆరంభం) మరియు ఉపసంహారం(ముగింపు) ఈ రెండు కచ్చితంగా సమకాలీనత్వం / అణుగుణంగా పాటింపబడ్డాయి ఈ ప్రబంధములో. మిగితా ప్రబంధములను పరిశీలించినచో- నమ్మాళ్వార్  తమ తిరువిరుత్తం లో “అడియేన్ శెయ్యిం విణ్ణప్పం” (మొదటి పాశురం)అని ,  చివరి పాశురాన “మారన్ విణ్ణప్పం శెయ్ద” అని ముగించారు, అలాగే ఆండాళ్  తన తిరుప్పావై లో “నమక్కే పరై తరువాన్” అని మొదటి పాశురాన, చివర పాశురమున “అంగప్పరై కొణ్డ” అని,  ఆళవందార్ తమ స్తోత్రరత్న ప్రారంభమున “నాథాయ మునయే” అని చివరి శ్లోకమున “పితామహం నాథమునిం విలోక్య” అని ముగించారు. అలాగే ఆళ్వార్ ఇక్కడ “కదిరవన్ కుణదిశై చ్చిగరమ్ వన్దు అణైన్దాన్“అని ప్రథమ పాశురమున ప్రారంభించి చివరి పాశురాన “కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో ” తో ఉపసంహారం చేశారు.
    • సూర్యుని రాకతో తామరలు వికసించుట వంటి  అందమైన ఉదాహరణ ఇక్కడ వర్ణింపబడింది. ఎలాగైతే దూరదేశము నుండి వచ్చిన తన కుమారుణ్ణి చూసిన తండ్రి ముఖం ఎంత ఆనందంగా వికసించునో  అలా. నిన్న అదృశ్యమైన  సూర్యుడు మరలా తిరిగి అగుపించేసరికి   ఆ తామరలు వికసించచాయి.

కడిమలర్ కమలంగళ్ మలర్ న్దనయివయో                                                                                                                 కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో                                                                                                                   తుడియిడై యార్ శురి కుళల్ పిళిందు ఉదఱి                                                                                                               తుగిల్ ఉడుత్తు ఏఱినర్ శూళ్ పునల్ అరంగా                                                                                                             తొడైఒత్త తుళపముం కూడైయుమ్ పొలిన్దు                                                                                                               తోన్ఱియ తోళ్ తొండరడిప్పొడి యెన్నుం                                                                                                                   అడియనై| అడియనెన్ఱు అరుళి ఉన్నడియార్కు                                                                                                           ఆళ్ పడుత్తాయ్ పళ్ళియెళుందు !అరుళాయే

ప్రతిపదార్థం:

పునల్ శూళ్=పవిత్రమైన కావేరి జలంతో చుట్టబడిన
అరంగా !=శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథా!
కడి  = పరిమళ
కమలం మలర్ గళ్= తామర పుష్పములు
మలర్  న్దనయివయో= పూర్తిగా వికసించిన
కదిరవన్=సూర్యుడు(తామరలను వికసింపచేయు వాడు)
కనైకడల్= సముద్రపు ఘోష
ముళైత్తనన్=ఉదయగిరినందు ఉదయించెను  (తూర్పున)                                                                                             ఇవనో= ఇదిగో
తుడియిడై యార్ = డమరుకం  వంటి నడుము గల స్త్రీలు(డమరుకమునకు మధ్యన ఉండు సన్నన్నిభాగము వంటి)           శురి కుళల్= వారి కొప్పులు
పిళిందు ఉదఱి= బాగా విదిల్చి పిండి(నీళ్ళు లేకుండ)
తుగిల్ ఉడుత్తు = వస్త్రములను ధరించి
ఏఱినర్ = గట్టు ను ఎక్కిరి(నది నుండి ఒడ్డుకు వచ్చిరి)
తొడైఒత్త = చక్కగా కూర్చిన
తుళపముం = తులసి మాల
కూడైయుమ్ = పూల బుట్ట                                                                                                                                        పొలిన్దు  తోన్ఱియ = ధరించి వచ్చిన
తోళ్ = భుజములు                                                                                                                                     “తొండరడిప్పొడి” యెన్నుం = తొండరడి పొడి అను పవిత్ర నామమును ధరించిన
అడియనై= దాసుడను
అడియనెన్ఱు అరుళి =మీ కృపకు పాత్రుడను/అర్హుడను
ఉన్నడియార్కు = మీ దాసులకు
ఆళ్ పడుత్తాయ్=వారి సేవ యందు నియమన పరుచుము/ శేష పరుచుము
పళ్ళియెళుందు !అరుళాయే=(ఆ ప్రయోజనమునకు) కృపతో లేచి మమ్ములను అనుగ్రహింపుము.

సంక్షిప్త అనువాదం :

పవిత్రమైన కావేరీ జలంతో ఆవరింపబడిన శ్రీరంగమున పవళించిన శ్రీరంగనాథా! ప్రకృతి పరమైన శబ్దం ప్రసరించుచున్నది    సముద్రములో,   పరిమళ భరిత తామరలు   సూర్యుడు ఉదయించగానే వికసించాయి. డమరుకం(సన్నని మధ్య భాగం గల ఒక వాయిద్యం)వంటి సన్నని నడుము భాగం గల స్త్రీలు తమ కేశములను తడి లేకుండ విదిల్చి(స్నానాంతరం)వస్త్రములు ధరించి నది ఒడ్డునకు చేరారు. తొండరడిపొడి(భక్తుల పాద ధూళి) అను నామధేయం గల  ఈ దాసుడు పరమళించు తులసీ మాలలు ఉన్న బుట్టను ఈ    ప్రకాశిస్తున్న ఈ భుజములయందు ధరించి ఉన్నాడు. (కనుక) మీ కృపకు పాత్రుడను/అర్హుడను అయిన నన్ను అంగీకరించి   భాగవతుల ( మీ దాసుల)  సేవ యందు నియమన పరచుము/ శేష పరుచుము.

 నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశములు:

  • ఆళ్వార్ ఇక్కడ ఆ సన్నని నడుము మరియు గిరిజాల(ఉంగరాల) జుట్టు ఉన్న  స్త్రీలను ఎందుకు ఉట్టంకించారు/ఉదాహరించారంటే, పెరియ పెరుమాళ్,  కు బృందావనంలో యమునా నది రేవుల/ ఘాట్ లలో   స్నానమాడి తనను తొందరగా నిద్రలేపు  గోపికలను  గుర్తుచేస్తున్నారు. పరాశర భట్టర్ వారు పెరియపెరుమాళ్ ను శ్రీకృష్ణుడిలా, ఉత్సవర్లైన నంపెరుమాళ్ ను శ్రీరాముడిలా భావించేవారు.
  • మొదట పెరియపెరుమాళ్  యొక్క గుర్తింపు  “శూళ్ పునల్ అరంగా!” అని అనడం వలన వెల్లడవుతుంది- కావేరీ జలముతో ద్వీపముగా చుట్టబడి  మరియు తనకు ఇష్ఠమైన నివాసము అగు శ్రీరంగముతో ఇతనిని గుర్తించడం జరిగినది. ఆహ్లాదకరమైన ఈ కావేరీనది పెరియపెరుమాళ్ కు విరజా నదిని(నిత్యవిభూతిని మరియు  లీలా విభూతిని వేరుపరుచునది) , సరయూ నదిని(అయోధ్య) మరియు యమునానదిని(మథుర, బృందావనం) మరిపిస్తుంది.
  • ఆళ్వార్ , ఎంపెరుమాన్ వైభవమున తగ్గట్టుగా అలకరించు అందమైన మాలలతో నిండి ఉన్న బుట్టను ధరించి ఉన్న తమ స్వరూపమును వెల్లడిచేస్తున్నారు. శ్రీరామాయణంలో లక్ష్మణుడు చేతిలో గునపమును మరియు బుట్ట(మట్టి మోయుటకు) , తన బాణం/విల్లుతో ధరించి శ్రీరామునకు మార్గదర్శిగా నిలుస్తారో అలా ఆళ్వార్ కూడ పుష్పములతో నిండిన బుట్టను ధరించిన స్వరూపముతో గుర్తించబడుతున్నారు. ఇదే జీవాత్మ యొక్క నిజమైన స్వరూపం.
  • తొండరడిపొడి ఆళ్వార్(భక్తుల పాద ధూళి) ఈ నామము ఆళ్వార్   ,   భగవంతుని దాసుల పాదాల వద్ద ఉన్న విశేష స్థానమును సూచించును.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:

  • కడిమలర్- పరిమళ భరిత పుష్పములు- శ్రీరంగములో ఉన్న పుష్పములన్నీ సువాసన యుక్తంగ ఉంటాయి, కారణం అది శ్రీమహాలక్ష్మి నివాస స్థలం. కావుననే నమ్మాళ్వార్ తమ తిరువాయ్ మొళి 10.10.2 లో “వాసమ్ శెయ్ పూంగుశలాళ్ తిరు” (పరిమళ భరిత కేశములు కలగిన మహాలక్ష్మి వాసస్థానం)అని కీర్తించారు.
  • తిరుప్పాణి ఆళ్వార్ తమ అమలనాదిపిరాన్ పదవ పాశురమున “కోవలనాయ్ వెణ్ణెయ్ ఉండ వాయన్ ……అణి అరంగన్”(శ్రీరంగనాథుడు వెన్నను ఆరగించిన శ్రీ కృష్ణుడే)   అని పేర్కొన్నాడు.
  • ప్రభావమైన సుదర్శనచక్రం మరియు పాంచజన్యములు భగవానుని స్వరూపమును తెలుపును ఈ విషయమును తిరుమంగై ఆళ్వార్ తమ పెరియతిరుమొళి 11.2.6 లో “ఆళియుమ్ శంగుముడైయ నంగళడిగళ్“అని అన్నారు , ఆ మాదిరిగానే  భాగవతులకు పుష్పములతో నిండిన బుట్టను ధరించుట  స్వరూప లక్షణము. భగవానునకు సమర్పించు అన్ని  కైంకర్యముల యందు  మాలాకైంకర్యం ఉత్తమ కైంకర్యముగా చెప్పబడింది,  కావుననే పెరియాళ్వార్, తొండరడిపొడిఆళ్వార్, అనంతాళ్వాన్ మొదలైన వారు ఈ కైంకర్యము ద్వారా నే భగవంతున్ని సేవించారు.
  • ఆత్మ యొక్క అస్వాభావిక అంశాలు తొలగించబడతాయో, అంతిమంగా ఆ ఆత్మకు ఎంపెరుమాన్ మరియు అతని  భక్తుల యందు శేషత్వభావన ఏర్పడుతుంది.
  • సంసారము యందు/వైపు  శేషత్వం  నిరర్థకమైనది, భగవానుని యందు/వైపు   శేషత్వం  విశేషమైనది,  అదే శేషత్వం భాగవతుల యందు/వైపు  అత్యంత విశేష పూర్ణమైనది.
  • ‘అంతిమ స్థితియగు శేషత్వమును(భాగవతుల యందు) అంగీకరించి మీ పాద భక్తునిగా మారినా కూడ మీరు ఇంకా పవళించి ఉన్నారే? ఇకనైనను లేచి మమ్ములను అనుగ్రహింపుము’అని తొండరడిపొడిఆళ్వార్ అభ్యర్థిస్తున్నారు.

నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళైల వ్యాఖ్యాన ఆధారిత  తిరుప్పళ్ళి యెళుచ్చి తెలుగు అనువాదం సంపూర్ణం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

ఆధారం: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-10-kadimalar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి – 9 – ఏదమిళ్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

8వ పాశురం

 

periyaperumal-art-3

పాశుర అవతారిక:

ఏదమిళ్ తణ్ణుమై ఎక్కం మత్తళి                                                                                                                                 యాళ్ కుళల్ ముళువమోడు ఇశై దిశై కెళుమి                                                                                                     కీదంగళ్ పాడినర్ కిన్నరర్ గరుడర్ గళ్                                                                                                                       కన్దరువర్ అవర్ కంగులుళ్ ఎల్లాం                                                                                                                       మాతవర్ వానవర్ శారణర్ ఇయక్కర్                                                                                                                       శిత్తరుం మయంగినర్ తిరువడిత్తొళువాన్                                                                                                               ఆదలిల్ అవర్కు నాళ్ ఓలక్కమరుళ                                                                                                             అరంగత్తమ్మా పళ్ళియెళుందరులాయే

ప్రతిపదార్థం:

ఏదమిళ్= నిర్థోష(దోష రహిత)
తణ్ణుమై= మృదంగం
ఎక్కం= ఒక తీగ వాద్యం
మత్తళి= మద్దెల
యాళ్= వీణ
కుళల్= వేణువు
దిశై= దిక్కుల యందు
ముళువమోడు= వీటి ధ్వనులతో
ఇశై కెళుమి   కీదంగళ్ పాడినర్= అన్ని దిక్కుల యందు కీర్తనలు గానం చేయు వారు
కిన్నరర్- కిన్నరులు
గరుడర్ గళ్= గరుడులు
కన్దరువర్ అవర్= గంధర్వులు
కంగులుళ్ ఎల్లాం= రాత్రంతయు
మాతవర్= శ్రేష్ఠమైన ఋషులు
వానవర్= దేవతలు
శారణర్= చారణులు
ఇయక్కర్= యక్షులు
శిత్తరుం= సిద్ధులు
తిరువడిత్తొళువాన్= మీ శ్రీపాద సేవ త్వరలో
మయంగినర్= మైమరచిపోతున్నారు
ఆదలిల్= కావున
అవర్కు= వాళ్ళకు
నాళ్ ఓలక్కమరుళ= విశ్వరూప సందర్శనము(ప్రాతః  కాలమున అనుహ్రహించు సేవ) కలిగించుము
అరంగత్తమ్మా!శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా!
పళ్ళియెళుందరులాయే= పడక నుండి మేల్కొని మమ్ము  అనుగ్రహింపుము.

సంక్షిప్త అనువాదం:

కిన్నరులు,గరుడులు మరియు గంధర్వులు మొదలైనవారు దోషరహిత/ మళినరహిత మైన మృదంగం, మద్దెల, ఒక రకైమైన తీగ వాద్యం, వీణ మరియు వేణువు మొదలైన వాయిద్యాలను అన్ని వైపులా వినబడేలా వాయిస్తున్నారు. కొందరు రాత్రి అంతయు వచ్చిఉన్నారు మరికొందరు ప్రాతః కాలమున చేరుకొన్నారు. మాహా ఋషులు, దేవతలు, చారణులు, యక్షులు మరియు సిద్ధులు మొదలైనవారందరు మీ శ్రీపాద ఆరాధనకై వచ్చిఉన్నారు. (కావున) శ్రీరంగమున శయనించిన నా నాథ!తమరు మేల్కొని పెద్దసంఖ్యలో మీ విశ్వరూప సందర్శనమునకై వచ్చినవారినందరిని అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:

  • తొండరడిపొడి ఆళ్వార్,  ఎంపెరుమాన్ తో ఇలా అంటున్నారు- వివిధ రకముల భక్తాగ్రేసరులందరు మీ  విశ్వరూపసందర్శనకై  త్వర/ఆత్రుత తో వేచి ఉన్నారు. సర్వులకు  రక్షకులగు మీరు మేల్కొని అనుగ్రహించి,  వారిని మీ కైంకర్యమునందు నిమగ్నులుగా చేయుము.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:

  • చిన్న,పెద్ద అను తారతమ్యం లేకుండ ఎంపెరుమాన్ సర్వులకు రక్షకుడు అని నిర్థారిస్తున్నారు. తిరుమళిశై ఆళ్వార్ తమ నాన్ముగన్ తిరువన్దాది 47వ పాశురమున ఇలా వివరిస్తున్నారు.

నన్మణి వణ్ణనూర్ ఆళియుమ్ కోళ్ అరియుమ్                                                                                                     పొన్మణియుమ్ ముత్తముమ్ పూమరముమ్                                                                                                           పన్మణి నీర్ ఓడు పొరుతు ఉరుళుమ్  కానముమ్ వానరముమ్                                                                                     వేడుం ఉడై వేఙ్గడమ్

ఈ పాశురమున  తిరువేంగడం(తిరుమల) నివాసముగా కలిగిన తిరువేంగడముడయాన్ (శ్రీనివాసుడు) నలుపు మరియు నీల వర్ణపు మిశ్రముడు(మంచి ముత్యము వలె ప్రకాశించు దేహం కలవాడు) అలాగే యాళి(సింహ శరీరం ఏనుగు తొండం కలిగిన జంతువు)బంగారం, ప్రశస్తమైన వర్ణపు రాళ్ళు, ముత్యములు, పుష్పములతో నిండిన వృక్షములు, సమృద్ధిగా ప్రవహించు జలాశయములు,  వజ్రాలతో కూడిన జలపాతాలు, వానరులు మరియు వేటగాళ్లతో నిండిన ఆ తిరువేంగడమును శ్రీనివాసునితో సహా కీర్తింపబడ్డాయి. కావున ఎంపెరుమాన్ తిరువేంగడమను  ఆ కొండలో  అగుపించు అన్నీరకముల జంతు జాలమును అనుగ్రహించుటకు అవతరించాడు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-9-ethamil/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి – 8 – వంబవిళ్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

7వ పాశురం

vishnu-and-naradha

పాశుర అవతారిక:


వంబవిళ్ వానవర్ వాయుఱై వళఙ్గ                                                                                                                             మా నిదికపిలై ఒణ్ కణ్ణాడిముదలా                                                                                                           ఎంపెరుమాన్ పడిమైక్కలం కాణ్డర్కు                                                                                                                 ఏఱ్పనవాయిన కొణ్డు నల్ మునివర్                                                                                                                         తుంబురు నారదర్ పుగున్దనర్ ఇవరో                                                                                                                   తోన్ఱినన్ ఇరవియుం తులంగు ఒళి పరప్పి                                                                                                   అంబరతలత్తు నిన్ఱు అగల్ కిన్ఱదు యిరుళ్ పోయ్                                                                                                       అరంగత్తమ్మా పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం

వళఙ్గ= మీ ఔనత్యమునకు సమర్పింపబడిన
వాయుఱై= గరిక(గడ్డి)
మా= శ్లాఘ్యమైన/పొగడ తగిన
నిది= నిధులు- శంఖ పద్మ నిధులు(వారి హస్తముల యందు ధరించిన)
వంబవిళ్= పరిమళించు
వానవర్= దేవతలు
కపిలై= కామధేనువు
ఒణ్= ప్రకాశించు
కణ్ణాడిముదలా= అద్దము మొదలైనవి
ఎంపెరుమాన్= సర్వస్వామి /రక్షకుడు
కాణ్డర్కు= వారిని అనుగ్రహించుము
ఏఱ్పనవాయిన= తగినవి(మీ ఔనత్యమునకు)
పడిమైక్కలం కొణ్డు= ఉపకరణములు
నల్ మునివర్= విలక్షణమైన ఋషులు                                                                                                   తుంబురు నారదర్ = తుంబురుడు, నారదుడు (భగవానునికి నిరంతరం గాన కైంకర్యం చేయువారు)
పుగున్దనర్ ఇవరో= వచ్చి నిలబడ్డారు
ఇరవియుం= సూర్యుడు కూడా
తులంగు ఒళి= అధిక ప్రకాశం
పరప్పి= వ్యాపింపచేయు
తోన్ఱినన్= అగుపించెను
యిరుళ్= అంధకారం
అంబరతలత్తు నిన్ఱు=ఆకాశము నుండి
పోయ్   అగల్ కిన్ఱదు= కనిపించకుండా పోయినది
అరంగత్తమ్మా!= శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా!
పళ్ళియెళుందరుళాయే= లేచి మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

ఓ దేవాది దేవా! విలక్షణ ఋషులైన తుంబురుడు, నారదుడు, స్వర్గమున నివసించు స్వతాహాగా పరమళించు దేవతలు, కానధేనువు మొదలైనవారు గరిక, అద్దం మరియు విలువైన సంపదలతో  తిరువారాధన సామాగ్రితో మీ తిరువారాధనకై వచ్చిఉన్నారు. సూర్యుడు ఉదయించి తన కిరణ ప్రాసారం చే అంధకారమును పోగొట్టాడు. శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా! లేచి మమ్ములను అనుగ్రహించుము.

నంఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశములు :

  • నల్ మునివర్= విలక్షణమైన ఋషులు- అనన్య ప్రయోజనులు- ఎంపెరుమాన్ కైంకర్యము తప్ప ఇతర ప్రయోజనములను వేటిని అభిలషించని వారు.
  • సూర్యుడు  బాహ్యాంధకారమును నశింపచేస్తాడు. కాని సర్వ రక్షకుడగు ఎంపెరుమాన్ అంతర అంధకారం(అఙ్ఞానం) పోగొడతాడు.
  • సూచన –  పిళ్ళైలోకాచార్యులు  తమ ముముక్షుపడి 36వ సూత్రమున ఇలా వ్యాఖ్యానించారు- “రక్షకత్వం” అనగా  కష్ఠ నివారణ ఇష్ఠ ప్రాప్తి ని కలిగించేది. తర్వాతి సూత్రములలో వివిధ వ్యక్తులకు  గల కష్ఠములను/ఇష్ఠములను పేర్కొన్నాడు. 38 సూత్రమున- ప్రపన్నులకు/ముముక్షువులకు,  సంసారులకు  (ప్రాపంచిక విషయాసక్తి గల వారు)  సంసార సంబంధము కష్ఠము మరియు పరమపదం చేరి ఎంపెరుమాన్ కి కైంకర్యం చేయుట ఇష్ఠప్రాప్తి. రక్షకత్వం భగవానునకే సాధ్యం.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశములు:

  • నల్ మునివర్= విలక్షణమైన ఋషులు-భగవానుని ముఖవిల్లాసమునకై ధ్యానము చేయువారు.” అత్తలైక్కు ప్పాంగానవఱైయే మననం పణ్ణుమ్ అవర్గళ్”
  • పెరుమాళ్ శయనించునప్పుడు లాలి /జోల పాటలు ఆలకిస్తారు , ప్రాతః కాలము లేచునప్పుడు సుప్రభాతమును ఆలకిస్తారు. కనుకనే తుంబుర నారదులు వచ్చారని భావన.
  • నంఙ్ఞీయర్  మరియు   పెరియవాచ్చాన్ పిళ్ళై  ప్రధానముగా ఎంపెరుమాన్ మాత్రమే అంతర్గత చీకటిని(అఙ్ఞానం)వదిలించువాడని సిధ్ధాంతీకరించారు. 

అడియేన నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-8-vambavizh/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి- 7 – అన్దరత్త

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

6వ పాశురం

dhevas - worshipping-periyaperumal

పాశుర అవతారిక: 

  • నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు క్రిందటి పాశురములో(6వ)సంక్షిప్తంగా అనుగ్రహించిన వివరణను ఈ పాశురం మరియు రాబోవు రెండు పాశురములలో సవివరంగా వ్యాఖ్యానిస్తున్నారు. నఙ్ఙీయర్ ప్రధానంగా,  ఇంద్రుడు మరియు సప్తఋషులు మొదలైన వారందరు ఆకాశమంతా నిండిపోయి ఎంపెరుమాన్ శ్రీపాదములను విశేష శ్లోకములతో కీర్తిస్తు ఆరాధిస్తున్నారు.  పెరియవాచ్చాన్ పిళ్ళై  ముఖ్యంగా ఇలా వివరిస్తారు-  త్తైత్తరీయ ఉపనిషద్ లో పేర్కొన్న “బైశాస్మాత్” (దేవతలు ఎంపెరుమాన్ కు భయపడి అతని ఆఙ్ఞకు లోబడి నడుచుకుంటారు). ఇంద్రుడు తన దాస్యమును నెరవేర్చుకొనుటకు ఇక్కడికి విచ్చేసాడు.

అన్దరత్తమరర్ గళ్ కూట్టంగళ్ ఇవైయో                                                                                                                       అరుం తవ మునివరుం  మరుదరుమివరో                                                                                                                   ఇన్దిరన్ ఆనైయుమ్ తానుమ్ వన్దివనో                                                                                                                   ఎంపెరుమాన్ ఉన్ కోయిలిన్ వాశల్                                                                                                                           శున్దరర్ నెరుక్క విచ్చాదరర్ నూక్క                                                                                                                 ఇయక్కరుమ్  మయంగినర్ తిరువడిత్తొళువాన్                                                                                                           అన్దరం పార్ యిడమిల్లై మత్తిదువో                                                                                                                   అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే.

ప్రతిపదార్థం: 

ఎంపెరుమాన్ = మా స్వామి / మా రక్షకుడా!
ఉన్ కోయిలిన్ వాశల్ = నీ కోవిల వాకిలి దగ్గర
ఇన్దిరన్  తానుమ్ = ఇంద్రుడు కూడ
ఆనైయుమ్= ఐరావతం
వన్దివనో = అందరును వచ్చిరి
అన్దరత్తమరర్ గళ్  ఇవైయో = స్వర్గలోక దేవతలు వీరు
కూట్టంగళ్= పరివారం(వాహన,కుటుంబ, పరిచారక సమేత)
అరుం తవ మునివరుం  = దుర్లభమగు తపమాచిరించిన మునులు –  సనక సనందాది ఋషులు
మరుదరుముం = మరుత్తులు వారి సేవకులతో(మరుద్గణములతో)
ఇయక్కరుమ్= యక్షులు
శున్దరర్ నెరుక్క  = గంధర్వులు క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు
విచ్చాదరర్ నూక్క = విద్యాధరులు ఒకరినొకరు  త్రోసుకుంటున్నారు
తిరువడిత్తొళువాన్    మయంగినర్ = మీ పాదములను సేవించుటకు మోహించి ఉన్నారు
అన్దరం  = ఆకాశం
పార్ = భూమి
యిడమిల్లై= చోటులేదు/స్థలాభావం
అరంగత్తమ్మా!శ్రీ రంగమున పవళించిన నా దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= దయతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

ఓ దేవాది దేవా! దేవతలకధిపతైన ఇంద్రుడు తన పరివారంతో(వాహన,కుటుంబ, పరిచారక సమేత) మీ కోవిల వాకిలి వద్ద నిల్చొను ఉన్నాడు. వీరేకాక స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విధ్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు వచ్చిఆకాశమున మరియు భూమి యందున చేరుట వల్ల స్థలాభావంతో క్రిక్కిరిసి ఒకరినొకరు తోసుకుంటు నిల్చున్నారు. వారందరు తమ శ్రీపాదములను అర్చించడానికి వ్యామోహముతో వచ్చి ఉన్నారు. కాన ఓ దేవాది దేవా! శ్రీరంగమున పవళించిన నా స్వామి ! పడక నుండి లేచి మమ్ములను అనుగ్రహింపుము.

  నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు

  • ఇద్రాంది దేవతలు స్వర్గలోక దేవతలు, వారి పరిచారకులు, సనక సనందాది ఋషులు, మరుద్గణములు, విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన వారందరు ఎంపెరుమాన్ శ్రీపాదములను అర్చించడానికి విచ్చేయడం శ్రీమన్నారాయణుని ” సర్వస్వామిత్వం”(అందరికి రక్షకుడు/అధిపతి) ను తెలుపుతుంది.
  • అరుం తవ మునివరుం అను పదము-  దుర్లభమగు తపమాచిరించిన బ్రహ్మమానస పుత్రులగు (మనస్సు నుండి జన్మించినవారు)  సనక, సనాతన, సనందన మరియు, సనత్కుమారులను ఋషులను తెలుపును.
  • చాలా సమూహములు రావడం వల్ల ద్వారపాలకులు కూడ నిలబడుటకు స్థలాభావం ఏర్పడినది.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు

  • ఈ పాశుర భావములో దేవతలు, ఋషులు మొదలైనవారి క్రమంలో 3వ వారిగ తెలుపబడ్డాడు ఇంద్రుడు. ఇంద్రుడు వీరికి మాత్రమే అధికారి కావున అతని  ఆగమనం చెప్పబడింది మొదట. దీనికి సామ్యమైన ఉదాహరణ – ప్రణవం. దీనిలో పదాల వరుసక్రమం-(అ,ఉ,మ)  జీవాత్మ యొక్క స్వభావమును తెలుపుతు -‘అ’ కార వాచ్యుడగు పరమాత్మకు ‘మ’ కార వాచ్యుడగు  జీవాత్మ సదా దాసుడు. సారమేమనగా భగవానుడు సర్వులకు అధికారి
  • అరుం తవ మునివరుం అను పదము- గొప్ప తపమాచరించిన సప్తర్షులను తెలుపుతుంది.
  • విద్యాధరులు, యక్షులు మరియు గంధర్వులు మొదలైన సమూహములు గానములో నృత్యములలో వివిధ సామర్థ్యం కలిగిన వారు.

అడియేన్ నల్లా శశిధర్ రమానుజదాస

Source:  http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-7-antharaththu/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి- 6 – ఇరవియర్

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

5వ పాశురం

periyaperumal-art-2

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి – సమస్తదేవతలు కలసి ఈ భౌతిక విశ్వమునకు(భగవంతుని చే సృష్ఠి కావింపబడ్డ)  కార్యకలాపాలు నిర్వహించుటకు దేవసేనా నాయకుడి స్థానాన్ని సుబ్రమణ్యునకు  ఇచ్చి పట్టం కట్టిరి. దేవతలందరు తమ తమ భార్యలతో, సేవకులతో  మరియు వాహనాలతో ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై వచ్చి తమతమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. (కనుక‌) తొండరడిపొడిఆళ్వార్ ఎంపెరుమాన్ ను మేల్కొని వారి కృపాదృష్ఠిని తమపై  ప్రసరింపచేయుమని ప్రార్థిస్తున్నారు.

ఇరవియర్ మణి నెడుం తేరొడుమివరో                                                                                                           ఇఱైయవర్ పదినొరు విడైయరుమివరో                                                                                                                   మరువియ మయలినన్ అరుముగనివనో                                                                                                             మరుదరుమ్ వశుక్కళుమ్ వన్దువన్దు ఈణ్డి                                                                                                           పురవియోడు ఆడలుమ్ పాడలుమ్ తేరుమ్                                                                                                               కుమర తణ్డమ్ పుగున్దు ఈణ్డియ వెళ్ళమ్                                                                                                         అరువరై అణైయ నిన్ కోయిల్ మున్నివరో                                                                                                       అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం:
మణి= ఉత్తమ
నెడు= పెద్దనైన
తేరొడుమ్ = రథములతో
ఇరవియర్= ద్వాదశాదిత్యులు
ఇఱైయవర్  = నిర్వాహకులు(సంసారుల)
పదినొరు విడైయరు= ఏకాదశ రుద్రులు
మరువియ= అమరిన/అనుకూలమైన
మయలినన్= నెమలి వాహనంగా కలవాడు
అరుముగనిన్ = షణ్ముఖుడు(ఆరుతలలవాడు)
మరుదరుమ్ = మరుత్తులు(49 మంది)/వాయుదేవతలు
వశుక్కళుమ్= (అష్ఠ) వసువులు
వన్దువన్దు= గుంపు గుంపుగా ఒకరినొకరు తోసుకుంటు
ఈణ్డి= సన్నిహితంగా వచ్చి(చేరి)రి
పురవియోడు  తేరుమ్= గుర్రములు,   రథములతో(ఆయా దేవతలు)
ఆడలుమ్ పాడలుమ్= ఆటలతో పాటలతో
కుమర తణ్డమ్ పుగున్దు=గుంపులు గుంపులుగా వచ్చి చేరిన దేవతలు
ఈణ్డియ వెళ్ళమ్= దట్టంగా/అధికంగా  ఉన్న సమూహం(నీటి ప్రవాహం వలె)
అరువరై అణైయ= మేరు పర్వతం వలె
కోయిల్= దేవాలయంలో
నిన్  మున్ = మీ దృష్ఠి ముందు
ఇవరో ,ఇవనో= వారందరు ఉపస్థితులైనారు
అరంగత్తమ్మా! = శ్రీరంగమున పవళించిన స్వామి,దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= (కనుక)శయనము నుండి లేచి మమ్ములను కృపచూడుము.

సంక్షిప్త అనువాదం:

ద్వాదశాదిత్యులు తమ ఉత్తమ రథములపై వచ్చిరి. ఈ భౌతిక ప్రపంచమునకు నియంత్రికులైన /నిర్వాహకులైన   ఏకాదశరుద్రులు మరియు ప్రాపంచిక జనాలు వచ్చిచేరిరి. ఆరు తలలు కలిగి నెమలి వాహనాధిపతైన  షణ్ముఖుడు వచ్చిచేరిరి. నవచత్వారింశత్ (49) మరుత్తులు  మరియు అష్ఠవసువులు మొదలైన వీరందరు ఒకరినొకరు తోసుకుంటు వచ్చిచేరిరి. శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! లేచి మమ్ములను కృపచూడుము. పెద్దసంఖ్యలో దేవతలు తమతమ వాహనాలైన  రథాలు మరియు అశ్వములతో గుంపులు గుంపులుగా ఆటపాటలలో  నిమగ్నమై వచ్చిచేరిరి. పెద్దని మేరుపర్వతము వలె నుండు మీ దేవాలయం ముందర సుబ్రమణ్యునితో సహా దేవతా గోష్ఠులు  మీ అనుగ్రహమునకై  వచ్చి ఉన్నారు. శ్రీరంగమున పవళించిన నా దేవాది దేవా! మేల్కొని తమ కృపాదృష్ఠిని మాపై ప్రసరింపచేయుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • ప్రయోజనాంతపరులు (ప్రాపంచిక కోరికలు తీర్చుకొనేవారు)అగు దేవతలు మరియు అనన్య ప్రయోజనపరులు (ఎంపెరుమాన్ కైంకర్యమే పరమ ప్రయోజనముగా కలవారు – ఆళ్వారుల మాదిరి)  వచ్చి ఉన్నారు, పెరియపెరుమాళ్ మీరు దయతో లేచి కృపాదృష్ఠితో వారిని కరుణించుము అని తొండరడిపొడిఆళ్వార్, ప్రార్థిస్తున్నారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు::

  • ఏకాదశ రుద్రులు “ఇఱైయవర్” (నియంత్రికులు/నిర్వాహకులు)గా సంభోధించబడ్డారు- యజుః సంహిత 6.2.8 లో రుద్రుడు తాను దేవతలతో ఇలా ప్రార్థింపబడుచున్నాడు- “సోబ్రవీత్ వరమ్ వృణా అహమేవ|పశునామధిపతిరసాణితి తస్మాత్ రుద్రః పశునామధిపతిః||” నాతో ప్రార్థన చేస్తున్న దేవతలారా! నేను పశువలె  (గోవు/పశువులు/జంతువులు ) ఉన్న సంసారులకు అధిపతిని.   కావుననే ఆళ్వార్ చే వీరు ఇఱైయవర్ గా సంభోధించబడ్డారు. కావున వీరు కేవలం ఈ భౌతిక ప్రపంచ ప్రజలకు మాత్రమే నియంత్రికులు/నిర్వాహకులు.
  • ఈణ్డియ వెళ్ళమ్(వరద)అనగా-  వరద మాదిరి  దేవతలు గుంపులు గుంపులు గా ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై శ్రీరంగమునకు వచ్చి ఉన్నారు.
  • కుమర దణ్డమ్– కు రెండు అర్థవివరణలు ఇవ్వబడ్డాయి.
    • మొదటిది- కుమరడు అనగా సుబ్రమణ్యుడని, + దణ్డమ్ అనగా దండం/కాండం/బెత్తం( సమర్థవంతమైన మందపాటిది అను సందర్భములోనిది) అని అర్థం. అనగా సేవకులు/సైన్యము లు పటిష్ఠమైన ధరించిన దండము( దేవతలు స్థలాభావం, భారీసమూహం చే  అతి దగ్గరగా నిలబడ్డారు)  .
    • రెండవది, దేవతలు సదా యవ్వన దశ(పదహారేండ్ల వయస్సు) లో కనబడతారు- ఎప్పుడు తమ యవ్వన స్థితిని కోల్పోరు. దణ్డమ్ – అనగా సేకరణ.  కనుక “కుమర దణ్డమ్” అన్నారు- అనగా దేవతల పెద్ద సమూహం.  దణ్డమ్ అనగా వారందరు ధరించిన ఆయుధములు అని కూడా అర్థం  వచ్చును.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source:  http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-6-iraviyar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళుచ్చి – 5 – పులంబిన

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

4వ పాశురం

srirangam golden vimana historyశ్రీరాముడు శ్రీరంగవిమానమును  మరియు శ్రీరంగనాథుణ్ణి , శ్రీవిభీషణాళ్వాన్ కు అనుగ్రహించుట

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ వ్యాఖ్యానమున- తొండరడిపొడి ఆళ్వార్ ,  ఎంపెరుమాన్ ను ఇలా ప్రాధేయపడుతున్నారు ‘భక్తులయందు తారతమ్యం చూపని  ఎంపెరుమాన్ సన్నిధికి  దేవతలందరు పూమాలికలతో ఆరాధించుటకు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు,  కనుక మీరు మేల్కొని వారందరి కైంకర్యమును స్వీకరించుము’.
  • పెరియవాచ్చాన్ పిళ్ళై – క్రిందటి పాశుర వ్యాఖ్యానమున , పచ్చిక బయళ్లయందు పడుకున్న తుమ్మెదల గురించి ప్రస్తావించారు, ఈ పాశురమున ఆళ్వార్ తోటలలో పడుకున్న పక్షులగురించి వివరించారు. పచ్చిక బయళ్ళలో పడుకున్న ఈ తుమ్మెదలు సూర్యోదయం మునుపే సులువుగా మేల్కొంటాయి- ఈ స్థితి ఇంద్రియనిగ్రహము ఉన్న భక్తులను సూచిస్తుంది. కాని తోటలలో పడుకున్న  పక్షులు పూర్తిగా సూర్యోదయం అయిన తర్వాత మేల్కొంటాయి- ఈ స్థితి ప్రాపంచిక సుఖములయందు తమ ఇంద్రియాలను  వినియోగించే బద్ధజీవులను సూచిస్తుందని వివరణ.

పులంబిన పుట్కళుం పూమ్  పొళిళ్ కళిన్ వాయ్                                                                                            పోయిత్తు క్కంగుళ్ పుగుందదు పులరి                                                                                                                కలన్దదు కుణదిశై కనై కడలరవం                                                                                                                            కళి వణ్డు మిళత్తియ కలమ్బగన్ పునైన్ద                                                                                                          అలంగళ్ అమ్ తొడై యళ్ కొణ్డు అడియిణై పణివాన్                                                                                                అమరర్ గళ్ పుగున్దనర్ ఆదలిల్ అమ్మా                                                                                                            ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్                                                                                                          ఎంబెరుమాన్ పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం

పూమ్=వికసించిన                                                                                                                                             పొళిళ్ కళిన్ వాయ్=తోటలయందు
పుట్కళుం= పక్షులు
పులంబిన=(మేల్కొని)=కూస్తున్న
క్కంగుళ్=రాత్రి
పోయిత్తు=పోయినది
పులరి=ఉషఃకాలము
పుగుందదు=ప్రవేశించెను
కుణదిశై= తూర్పుదిక్కున
కనై= శబ్దించు
కడల్= సముద్ర
అరవం=ఘోష
కలన్దదు=వ్యాపించెను
కళి=మదించిన(మధువును సేవంచిన)
వణ్డు= తుమ్మెదలు
మిళత్తియ= పాడుచున్నవి(ఝుంకారం చేస్తున్నవి)
కలమ్బగన్ పునైన్ద= అనేక/వివిధ పూలతో కూర్చిన
అమ్= అందమైన
అలంగళ్ తొడై యళ్ కొణ్డు=కదిలే పూమాలికలను తీసుకొని
అమరర్ గళ్= దేవతలు
అడియిణై పణివాన్=పాదద్వయమును సమర్పింప
పుగున్దనర్= ప్రవేశించిరి                                                                                                                                    – ఆదలిల్ = కనుక                                                                                                                                     అమ్మా=సర్వ స్వామీ!
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిళ్=లంకాధిపతి అయిన విభీషణాళ్వాన్ శ్రీరంగమున దాస్యముచేయు
ఎంపెరుమాన్ = ఓ నన్నుఏలిన స్వామి!
పళ్ళియెళుందరుళాయే= పవళించిన స్వామి మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

బాగా విరబూసిన పుష్పములతో ఉన్న ఆ తోటలలో పక్షులు హృదయ ఉల్లాసమైన కిలకిలరావాలు చేస్తున్నాయి.రాత్రి ముగిసినది తెల్లవారుజాము ఆరంభమైనది. తూర్పు  సముద్రపు ఘోష అన్నివైపులా వినబడుతుంది .  మధువును త్రావిన తుమ్మెదలు మత్తుగా,  ఆనందంగా  ఝుంకారములు చేస్తున్న పరిమళభరిత పుష్పములతో కూడిన మాలలను దేవతలందరు చేబూని తమ దివ్యపాదారవిందములను ఆరాధించుటకై వచ్చి ఉన్నారు. లంకాధిపతియైన విభీషణాళ్వాన్ చేత ఆరాధింపడు , శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! ఇక లెమ్ము కృపతో మమ్ములను అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • ప్రతివారిని ఆవహించి నిద్రకు ఉపక్రమించేలా  చేయు   తమోగుణము  రాత్రితో సూచించబడుతున్నది. ప్రతివారియందు ప్రాతః కాలమున  సత్త్వగుణం ఉద్భవించు ను కావున ఆ ప్రాతః కాలము ఎంపెరుమాన్ ను ఆరాధించుటకు అనుకూలమైన/అనువైన సమయం .
  • విభీషణాళ్వాన్,  తనతో అత్యంత శత్రుత్వము ఉన్న రావణుడి సోదరుడైనప్పటికి లంకాధిపతిగా పట్టాభిషేకమును ఎంపెరుమాన్  చేశారు. తాను  కేవలం విభీషణాళ్వాన్ లోని  భక్తిని మాత్రమే చూసి తన సోదరునిగా  అంగీకరించాడు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

  • తొండరడిపొడిఆళ్వార్  తమ తిరుమాలై ప్రబంధము 14వ పాశురమున ” వణ్డినం ఉరులుంశోలై మయిల్ ఇనమ్ ఆలుం శోలై కొణ్డల్ మీదు అణవుం శోలై”– దీనర్థం :    “తుమ్మెదలు  ఆనందంగా ఝుంకరిస్తున్న , నెమళ్ళు గుంపులుగా గుంపులుగా  నాట్యమాడుచున్నఅందమైన తోటలతో , కారు(మబ్బులు)మేఘము కమ్ముకొని ఉండటం  వలన చల్లగా ఉండును శ్రీరంగము” అని వివరించిరి. ఆ శబ్దములన్నీ  పెరియ పెరుమాళ్ ఇంకను  పవళించి ఉన్నారే?” అని   ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నవి.
  • పెరియవాచ్చాన్ పిళ్ళై – ప్రయోజనాంతపరులగు( తమ  స్వార్థ కోరికలు నెరవేర్చుకొను) దేవతలు పెరియపెరుమాళ్ ను సేవించుకొనుటకు వేచి ఉన్నారు. కాని పెరియపెరుమాళ్ ఇంకను మేల్కొనలేదు. – పెరియ పెరుమాళ్ శ్రీరంగమున దక్షిణ ముఖంగా    శయనించి రావణుని కనిష్ఠ సోదరుడై, లంకానగరానికి   పట్టాభిషేకం చేసిన విభీషణాళ్వాన్   కోసం ఎదురుచూస్తూ  పరున్నావా?వారు వస్తే కాని మేల్కొనవా?  అని    పెరియవచ్చాన్ పిళ్ళై ప్రస్తావిస్తున్నారు.
  • ఆళ్వార్, విభీషణాళ్వాన్ ను ప్రస్తావిస్తూ  ఇలా అంటున్నారు ” మీరు  విభీషణాళ్వాన్ చే ఇక్కడ కొనితేబడ్డారు/తీసుకరాబడ్డారు. దానికై వారు వచ్చి మేల్కొలిపితే గాని లేవరా?”
  • మరలా ఇలా అంటున్నారు- ‘వళిపాడు సేయ్ గై'(ఆరాధన)- ఎంపెరుమాన్ సంకల్ప ప్రకారం నడుచుకుంటాము. ఎంపెరుమాన్  ఆశ్రిత పరాధీనుడు(భక్తుల పరాధీనుడు). వాస్తవానికి పెరియపెరుమాళ్ తాను విభీషణాళ్వాన్ చేత లంకానగరమునకు తీసుకొనిపోబడుతున్నారు, ఆ క్రమంలో తాను లంకకు వెళ్ళక అందరిని ఉద్దరించుటకు  శ్రీరంగముననే  స్థిరబడిపోయారు. మరి ఆ కోరిక నెరవేర్చుకొనుటకు మీరు లేచి మమ్ములను అనుగ్రహింపుము స్వామి అని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు.

సాధారణంగా పదవ పాశురం తప్ప మిగిలి పాశురాలలో అరంగత్తమ్మా అని (మకుటం) ప్రయోగించబడినది, కాని ఈ పాశురమున ఎంపెరుమాన్ అని ప్రస్తావించబడినది. పెరియపెరుమాళే ” ఎంపెరుమాన్” అనగా  నా (ఆళ్వార్ యొక్క) ఇష్ఠమైన దైవం అని అర్థం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-5-pulambina/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరుప్పళ్ళి యెళిచ్చి – 4 – మేట్టిళ

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళిచ్చి

3వ పాశురం

100_0659

పాశుర అవతారిక:

  • తొండరడిపొడి ఆళ్వార్ ,   ఎలాగైతే శ్రీరాముడు తన భక్తులను కాపాడుటకై శత్రువులను  నిర్మూలించాడో ఆ మాదిరి  మీరు కూడ మిమ్ములను అనుభవించే/ఆనందించుటకు గల అడ్డంకులన్నీ తొలగించుటకు మేల్కొనవలెను అని ఎంపెరుమాన్  ను ప్రార్ధన చేస్తున్నారని నఙ్ఞీయర్ తమ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు .
  • గోపాలురు తమ పశువులను మేతకు( ఇష్ఠానుసారంగా తిరుగుటకు మరియు గడ్డిని మేయుటకు)తీసుకపోతారు. తెల్లవారున వారు పశువుల మెడలలోని చిరుగంటల శబ్దమును మరియు తుమ్మెదల  ఝంకారమును విపిస్తుంది. కాన ఆళ్వార్,  శత్రుహంతకుడు మరియు సర్వరక్షకుడగు   ఎంపెరుమాన్ ను మేలుకొని తమని అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం.

మేట్టిళ మేదిగళ్ తళైవిడుం ఆయర్ గళ్

వేయ్ ఙ్గుళలోశైయుమ్ విడై మణి క్కురలుమ్

ఈట్టియ ఇశై దిశై పరన్దన వయలుళ్

ఇరిందన శురుమ్బినమ్  ఇలంగైయర్ కులత్తై

వాట్టియ వరిశిలై వానవర్ ఏఱే

మాముని వేళ్వియై కాత్తు అవపిరదమ్

ఆట్టియ అడుతిఱళ్ అయోత్తి ఎమ్మరశే

అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం 

మేట్టిళ మేదిగళ్=పొడవైన లేత వయస్సులో ఉన్న గేదెలు
తళైవిడుం= మేపుటకు వదలబడిన
ఆయర్ గళ్= గోపకులు
వేయ్ ఙ్గుళలోశైయుమ్ = వెదురు వేణువు శబ్దం
విడై మణి = ఎద్దుల మెడలలోని గంటలు
క్కురలుమ్ = (గంటల)ధ్వని
ఈట్టియ ఇశై= రెండు రకముల శబ్దములు(వేణుశబ్దం మరియు గేదెల మెడలలోని గంటల శబ్దం)
దిశై పరన్దన= అన్నిదిక్కుల వ్యాపించిన
వయలుళ్ = పచ్చిక మడుల/బయళ్ళ యందు
శురుమ్బినమ్ = తుమ్మెదల గుంపు
ఇరిందన = ఆహ్లాదకరమైన శబ్దం (ఝుంకారం)మొదలైయినది
ఇలంగైయర్ కులత్తై = రాక్షస(లంకానగర)వంశము
వాట్టియ= నాశనంచేసిన /సంహరించిన
వరిశిలై = శారఙ్గమనెడి ధనుస్సును (ధరించిన)
వానవర్ ఏఱే = దేవాది దేవ!
మాముని= గొప్పముని(విశ్వామిత్రముని)
వేళ్వియై = యాగమును
కాత్తు= కాపాడి
అవపిరదమ్ ఆట్టియ = అవబృధస్నానం చేయించిన (యాగం పరిపూర్ణం అయిన తర్వాత చేయు పవిత్ర స్నానం)‌
అడుతిఱళ్ = శత్రువులను తుదముట్టించు గొప్ప/మిక్కిలి  పరాక్రమం/బలం  కలిగిన
అయోత్తి ఎమ్మరశే = అయోధ్యను ఏలు/పరిపాలించు  మా రక్షకుడా!
అరంగత్తమ్మా!= శ్రీరంగమున శయనించిన దేవాది దేవా!                                                                                                 పళ్ళియెళున్దరుళాయే.= (కావున) కృపతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం :
వేణువు నుండి వచ్చిన శబ్దం మరియు గోపాలకులచే మేతకు వదలబడిన లేత వయస్సులో ఉన్న గేదెల మెడలలోని గంటల శబ్దం అంతటా వ్యాపించినవి. పచ్చిక బయళ్ళలోని తుమ్మెదలు  దినారంభమున      ఆహ్లాదమైన తమ ఝుంకారములతో ప్రారంభించినవి. రాక్షసులను సంహరించి  విశ్వామిత్రుని యాగమును  పరిపూర్ణము గావించి అవబృధస్నానమును చేయించిన ఓ శ్రీరామా! శత్రువులను అతి సులువుగా సంహరించు గొప్ప/మిక్కిలి పరాక్రమము కలిగిన,  అయోధ్యను ఏలు మా రక్షకుడవు. శ్రీరంగమున శయనించిన దేవాది దేవా! మేల్కొని మమ్ములను కృపచూడుము.

నఙ్జీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • రావణునిచే తిప్పలు/కష్ఠాలు  పడ్డ ఆ దేవతల కోరికపై(బ్రహ్మను మొదలుకొని) ఎప్పుడైతే రావణుని తన శారఙ్గమను బాణంచే సంహరించాడో అప్పుడు   రాముడు ఎంతో సంతృప్తి చెందాడు. అలాగే  ఎంపెరుమాన్ కు  తన భక్తులు రక్షించబడ్డప్పుడే తనకు ఆనందం  అని విశేషంగా తెలుపబడుచున్నది.
  • ఇక్కడ అర్చావతార ఎంపెరుమాన్ వైభవం కీర్తించబడుతున్నది. శ్రీరాముడు తాను అయోధ్యలో వేంచేసి/జీవించి ఉన్నకాలంలో సేవించుటకు సాధ్యం , కాని శ్రీరంగనాథుణ్ణి (అర్చావతారం ) తరతరాల (శ్రీరామ విభవాతారం కన్నాతర్వాత నుండి) నుండి ఇప్పటివరకు సేవించవచ్చును. అర్చావతారములో ఉన్న  సౌలభ్యం గుణం ఇదే. అందరు అనుభవించుటకు సులభుడు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

  • పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క చమత్కార/ అందమైన భావన- ఆళ్వార్ భావన- ఆవులు మరియు లేగదూడలు మేల్కొనుటను ఎంపెరుమాన్ కు సూచిస్తున్నారు “అల్ఫఙ్ఞానము కలిగినవే మేల్కొన్నాయి, మరి తమరు సర్వశక్తిమంతుడవైన మహాఙ్ఞాని కదా మరి ఇంకా మేల్కొనలేదే?”
  • నరసింహ పురాణ శ్లోకంలో16.13- ఆహార నిద్రా భయ మైథునం తుల్యాని కల్వత్ర సమస్తజన్తోః| ఙ్ఞానాత్ విశిష్ఠో హి నరః పరేభ్యో ఙ్ఞానేన హీనః పశుభిః సమానః||దీనర్థం- ఆహారం, నిద్రా, భయం ,మైథునములు అన్నీ జీవులకు సాధారణమే. కాని మనిషి అన్నీ జీవులకన్న తెలివైనవాడు. ఒకవేళ మానవుడు ఙ్ఞానమును మంచికై వినియోగించకున్నచో వాడు పశు సమానుడు.
  • ఇక్కడ మాముని (గొప్పముని) అని విశ్వామిత్రుణ్ణి సంభోధించుటకు కారణం అందంగా వర్ణించబడింది. ముని అనగా – స్థిరమైన ఙ్ఞానాన్ని కలిగిన వాడు. విశ్వామిత్రుడు  తన తీవ్రమైన తపఃశక్తి వలన తాను ఏదైన సాధించగల సామర్థ్యం కలవాడు, కాని తన శక్తిని అల్ఫమైన కోరికలకు వినియోగించలేదు. తన స్వాతంత్ర్యమును వదలి ఆ యాగ రక్షణను శ్రీరాముని యందు ఉంచి  ఆ కార్యమును నేరవేర్చుకున్నాడు. ఎంపెరుమాన్ యందు ఉన్న ఈ పారతంత్ర్యము వలన తాను ‘మాముని’  అని ఆళ్వార్ చే సంభోధించ బడ్డాడు.
  • శ్రీరామాయణం బాలకాండ1.97లో “దశవర్ష  సహస్రాణి దశవర్ష శతాని చ| రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి||శ్రీరాముడు తన రాజ్యాన్ని 11000వేల ఏండ్లు పరిపాలించి తన నివాసానికి తిరిగి వెళ్ళి పోయాడు.శ్రీరాముడు కేవలం 11000 మాత్రమే జీవించాడు. కాని శ్రీరంగనాథుడు ఎన్నో ఎన్నోవేల సంవత్సరముల నుండి వేంచేసి ఉన్న భక్తసులభుడు, కావున శ్రీరంగమున పవళించిన దేవాదిదేవ! లేచి మమ్ములను అనుగ్రహించుము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-4-mettila/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org