Author Archives: ragu vamshi

జ్ఞానసారము 40

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 39

అవతారిక 

                    ఆచార్య భక్తి భాగవత దాసత్వము చాలా వివర్ముగా చెప్పబడింది . అంత చెప్పినప్పటికి లోకుల దృష్టిలో వీరు వింతగానే కనపడతారు.  వడుగ నంబిగారి వృత్తాంతమును ఉదహరిస్తున్నారు . ఒక సారి శ్రీరంగములో  శ్రీరంగనాధుల ఉస్తవము జరుగుతున్నది . శ్రీరంగనాధుల శోభా యాత్ర  స్వామి రామానుజుల మఠము దగ్గరకు వచ్చింది . స్వామి రామానుజులు శిష్యులతో వీధిలోకి వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటానికి బయలు దేరుతూ చూడగా ఆ గొష్టిలో వడుగ నంబి కనపడలేదు. స్వామి , ‘వడుగా !శ్రీరంగనాధులను సేవించుకోవటానికి రండి ‘ అనీ పిలిచారు. దానికి ‘ మీ పెరుమాళ్ళను సేవించుకోవటానికి వస్తే ఇక్కడ మా పెరుమాళ్ళ పాలు పొంగి పోతాయి ‘ అనారు వడుగ నంబి .

       సమాన్యులకు ఈ కథ వింతగా తోచవచ్చు . శ్రీరంగనాధులను సేవించుకోవటము కంటే పాలు కాచడము అంత గొప్ప విష్యమా అనిపించవచ్చు ,అమ్ర్యాదగా మాట్లాదవచ్చు . భగవద్భక్తులు కూడా భగవంతుడిని కాక మానవమాత్రుడైన ఆచార్యులకు కైకర్యము చెస్తూ కాలము గడుపుతున్నారే ,ఆఖరికి మొక్షమునిచ్చే భగవతుదిని కూడా నిరాదరిస్తున్నారే అని అనుకోవచ్చు . ప్రతూత పాశురములో పై ప్రస్నలన్నిటికి సరీయిన జవాబులు ఇవ్వబడ్డయి  .స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ భాగవత దాసుల గొప్పతన్నన్ని కూడా వివరించారు .

Arjuna_meets_Krishna_at_Prabhasakshetra

 

పాశురము

అల్లి మలర్ పావైకు అన్ బర్ అడిక్కు అన్ బర్

సొల్లుం అవిడు సురుదియాం

నల్ల పడియాం మను నూర్కవర్ సరిదై పార్వై

సెడియార్ వినై తొగైకుత్ తీ

ప్రతి పదార్థము

అల్లి మలర్ పావైక్కు  = తామర పై వేంచేసి వున్న ,తామర వంటి శ్రీమహాలక్ష్మి అమ్మవారికి

అన్ బర్ = ప్రియమైన శ్రీమన్నారాయణుడి

అడిక్కు అన్ బర్ = శ్రీపాదమునకు దాసులు

అవిడు సొల్లుం = సరదాగా చెప్పే మాటలు

సురుదియాల్ = వేదమునకు సమానమవుతుంది

అవర్ సరిదై = వారి చరిత్రలు

మను నూర్కు = మను శాస్త్రమునకు 

నల్ల పడియాం = మంచి ఉదాహరణగా ఉంటుంది

పార్వై = వారి చూపులు

సెడియార్ = బుధ్ధికి బాగా తుప్పు పట్టి వున్న

వినై తొగైకు = పాపాత్ములను తొలగదోయటానీకి

తీ = నిప్పు వంటిది అవుతుంది

వ్యాఖ్యానము

                   అల్లి మలర్ పావైక్కు..అన్ బర్ ..అడిక్కు అన్ బర్…. తామర పై వేంచేసి వున్న ,తామర వంటి శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణుడు. భగవంతుడి శ్రీపాదములను చేరాలంటే అమ్మవారి పురుషకారము ఉండాలి . అందుకే శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణా అనే ప్రార్థించాలి అని తెలియచేయటానికే ఇలా సంబోధించారు . శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రియమైన శ్రీమన్నారాయణుడి శ్రీపాదములపై ప్రేమ గలవారు …అనగా భగవద్భక్తులు ,భాగవతులు అని అర్థము .

సొల్లుం అవిడు సురుదియాం…….అలాంటి వారు సరదాగా మాట్లాడే మాటలలో వేద సారము ఉండటము వలన అవి శృతికి సమానము . గురుపరంపరా ప్రభావములో దీనికి సంబంధించిన ఉదాహారణలను చూడవచ్చు . ఉడయవర్ల వార్తలుభట్టర్ వార్తలు కూరత్తాళ్వాన్ వార్తలునంబిళ్ళై వార్తలుతిరుక్కోళూర్ అమ్మాళ్ వార్తలు మొదలైనవాటిలో వేద వేదాంగములలోని అతి సూష్మమైన విషయాలు ప్రస్తావింపబడతాయి .వాయ్ తందన కూరుదియో మఱై తంద వాయాల్” (నోటికి వచ్చింది చెపుతున్నావా శాస్త్రము ఇచ్చిన నోటితో !)అని కంబ రామాయణములో రాముడు లక్ష్మణుడితో అంటాడు . పేడయయై పిడిత్తు తన్నై పిడిక్క వందడైంద పేదై వేడవనుక్కు  ఉదవి సెయ్దువిఱగిడై వెందీ మూట్టి పాడుఱు పసియై నోక్కి తన్ ఉడల్ కొడుత్త పైంపుళ్ వీడు పెఱ్ఱు ఉయరంద వార్తై వేదతిన్ విళుమిదు అన్ఱో?”( పెంటిని పట్టి తనను కూడా పట్టాలనుకున్న వేటగాడి ఆకలి బాధ తీర్చడముకోసము తానే మంటను చేసి అందులోకి దూకిన పక్షి చేసిన పని వేదసారము కదా! ).  కంబ రామా యణములో శరణాగతి శాస్త్రమును వివరిస్తూ చెప్పిన విషయము ఇది . ఒక పక్షి నోటి నుండి వెలువడిన మాట వేద సారమైనది  అని ఈకథను ఇక్క డ ఉదహరించారు .

నల్ల పడియాం మను నూర్కవర్ సరిదై…….. భగవద్భక్తుల నడత వారి చరిత్రలుగా స్థిరపడతాయి. అనగా మను శాస్త్రములో చెప్పిన విధముగా ఉంటాయి . ధర్మ శాస్త్రములువర్ణాశ్రమ  ధర్మములు వారి నడతకు ఉదాహరణగా నిలుస్తాయి . వారిని అనుసరించే వారు కూడా అదే విధముగా ప్రవర్తిస్తారు . సామాన్యులకు ఈ విధానము నేర్చుకున్నా రాదు . అయినప్పటికి ధర్మశాస్త్రమును నేర్చుకోవటానికి ,అనుసరించటానికి ప్రయత్నము చేస్తారు . కావున పెద్దల నడవడి ఇతరులకు ఆచరణయోగ్యముగానుశాస్త్రప్రమాణముగాను నిలుస్తుంది . దీనికి ఉదాహరణగా కంబరామాయణములో నుండి ఈ క్రింది పాశురమును ఉదహరించారు .

” ఎనైతు ఉళమఱై అవై ఇయంబఱ పాలన

పనైత్తిరన్ కరక్కరి భరదన్ సెయ్ గయే

అనైత్తడిఱం అల్లన అల్లఅన్నదు

నినైత్తిలైయెన్వయిన్ నేయ నెంజినాల్

  (కంబ రామాయణంఅయొధ్య కాండము తిరువడి సూట్టు పడలం – 44)

ఈ మాటలు శ్రీరాముడు లక్ష్మణుని ఉధ్ధేశించి చెప్పినవి .

లోకమునకు విధి విధానములను నిర్ణయించినది వేదము .భరతుని ఆచరణ అన్యులకు ప్రమాణముగా నిలిచింది.   భరతుడు ఆచరించనివి వేదములో చెప్పినప్పటికీ స్వీకరింప దగినవి కావు అన్న విషయాన్ని శ్రీరాముడు లక్షమణుని వివరిస్తున్నాడు అని కంబ రామాయణములో చెప్పారు .               

పార్వై సెడియార్ వినై తొగైకుత్ తీ ……….భాగవతోత్తములైన వారి దృష్టి అనాదిగా తుప్పు పట్టి పోయిన అజ్ఞానాన్ని తుత్తునియలు చేసి జ్ఞానాన్ని ఇవ్వగలదిగా చెపుతున్నారు.

భావము

                  శ్రీమహాలక్ష్మి నాయకుడైన శ్రీమన్నారాయణుని శ్రీపాదములపై భక్తి చేయు వారు ,మామూలుగా మాట్లాడు మాటలు ,వేదప్రమాణములుగా గ్రహించతగినవి . వారి ఆచరణ మనుశాస్త్రమును పోలి ఉంటుంది . వీరి ఆచరణ అసలుగాను శాస్త్రము పోలికగాను భాసిల్లుతుంది .వీరి చూపులు అనాది పాపములను దూదిపై పడ్డ నిప్పులాగా కాల్చివేస్తుంది . వీరి చూపు పడ్డ వారు పునీతులై జ్ఞానాందమును పొందుతారు అని చెప్పి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ ప్రబంధమును పరిపూర్తి చేశారు . 

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/gyana-saram-40-alli-malar-pavaikku/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

జ్ఞానసారము 39

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 38

అవతారిక

పై పాశురముల సారము  ఆచార్యల ఔన్నత్యమును తెలియజేయుట , అది తెలిసుకున్నవారు , ఆచార్యుని శ్రీపాదముల యందు భక్తి కలిగి వున్న వారు గొప్ప జ్ఞానులు. ఆ గురు భక్తిని తెలుసుకోలేని లోకులు వీరిని మీద ‘ భగవంతుడి కన్నా గురువునే గొప్పగా భావించి వారి వెనక తిరుగుతున్నారన్న ‘ నిందను మోపు వారికి ఈ పాశురములో జవాబు కనపడుతుంది . భగవంతుడి విషయములో ఆయన స్వరూప , రూపవిభవములను తెలుపు కథల యందు ప్రేమ కలిగియున్న భగవద్భక్తులు ఆచార్యుల  గొప్పదనమును గ్రహించక , ‘ భగవంతుడి యందు కాక మానవ మాత్రుడైన ఆచార్యుల యందు ప్రేమను కలిగి వున్నారు అని  మాట్లాడే వారికి ఇక్కడ సమాధానము దొరుకుతుంది . ఆచార్యుల యందు భక్తి చేయువారిని నిందిస్తే ఆ నింద వారికి స్తుతియే అవుతుంది కాని నింద కాదు . ఇది నిందాస్తుతి  అలంకారములాగా అమరుతుంది .

ఇక్కడ ఒక చిన్న కథను చూద్దాము .భగవద్రామానుజుల వారి కాలములో  శ్రీరంగములో ఒక సారి శ్రీరంగనాధుల శోభాయాత్ర జరుగుతున్నది . రామానుజులతో పాటు ఎందరెందరో భక్తులు ఆ శోభాయాత్రనుకన్నుల పండుగగా తిలాకిస్తున్నారు . అందులో కొందరు పెరుమాళ్ళ ముందర భగవద్రామానుజుల శ్రీపాదములకు దాసోహాలు సమరపించి ముందుకు సాగుతున్నారు .ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళమహారాజు సభలోఆస్తాన పండితులు సుభ్రమణ్యభట్టర్ ఆ దృశ్యాన్ని చూసి ‘ జీయరు స్వామి ఒక సందేహము తమరిని అడిగితెలుసు కోవాలను కుంటున్నాను ‘ అన్నారు. అడగండి  మన్నారు రామానుజులవారు . శ్రీరంగనాధుల శోభాయాత్రజరుగుతుండగా కొందరు స్వామి ముందు తమరికి దాసోహములు సమర్పించి వెళుతున్నారు కదా!  స్వామి ముందర నన్ను సేవిచ వద్దని తమరు  చెప్పవలసి ఉండగా చెప్పనే లేదు .  కారణమేమిటి? ‘ అని అడిగారు . అడగవలసిన ప్రశ్ననే అడిగారు . కాని మీరు అడగడమే ఆశ్చర్యముగా వుంది ‘ అన్నారు రామానుజులు . దానికి సుభ్రమణ్యభట్టర్ ‘ నాకున్న గొప్పతన మే మున్నది ‘ అన్నారు .  దానికి ఆచార్యులు , ‘ మీరు రాజసభలో సేవ చేస్తునారు కదా! రాజానుగ్రహము కోరి వచ్చే వాడు ముందుగా రాజుగారి పాదుకలను తల మీద పెట్టుకొని తన రాజ భక్తిని చాటుకుంటాడు. అది చూసి మెచ్చిన రాజుగారు అతడి కోరికలను నెరవేరుస్తాడు  . వాడి కోరికను నెరవేర్చింది పాదుకలు  కావు . రాజు గారు మాత్రమే అలాగే ఇక్కడ భగవంతుడు మహారాజు దాసుడు ఆయన పాదుకలు. భగవంతుడి కృపనుకోరేవారు పాదుకలైన దాసుడికి దాసోహములుసమర్పిస్తున్నారు . దాసుడి మీద ప్రేమ కలవారిపై భగవంతుడు  ప్రేమను చూపిస్తాడు. ‘ అని రామానుజువారు సమాధానము చెప్పారు . ఇది విన్న  ఆస్తాన పండితులు సుభ్రమణ్యభట్టర్ చాలా సంతోషించారు . ‘ తిరువిరుత్తం ‘ వ్యాఖ్యానములో ఈ విషయమును చూడవచ్చు 

            కావున భగద్భక్తి గలవారు అచార్య భక్తి గలవారిని తక్కువ చేసి మాట్లాడనవసరము లేదు.  ఒక వేళ వారు దూషించినా అది వీరి విషయములో పొగడ్తయే కాని దూషణము కాదు అని ఈ పాశురములో నొక్కిచెపురున్నారు .

putna1

పాశురము

అలగై ములై సువైతార్కు అన్ బర్ అడికన్ బర్

తిలద మెన తిరివార్ తమ్మై – ఉలగర్ పళి

తూఱ్ఱిల్ తుదియాగుం తూఱ్ఱాదు అవర్ ఇవరై

పోఱ్ఱిల్ అదు పున్మయేయాం

ప్రతిపదార్థము

అలగై ములై = పూతన అనే రాక్షసి పాలను

సువైతార్కు = తాగిన కృష్ణునికి

అన్ బర్ అడిక్కు = భక్తులైన దాసుల శ్రీపాదములందు

తిలద మెన = నుదుటి బొట్టులాగా

తిరివర్ తమ్మై = ప్రవర్తించే పెద్దలను

ఉలగర్ = లోకులు

పళి తూఱ్ఱిల్ = భగవంతుడి యందు కాక మనుష్యులపై ఆసక్తి పెంచుకున్నారని నిందలు వేస్తే  

తుదియాగుం = అది ఆ దాసుల భక్తిని తెలియపరిచేది కాబట్టి అది వీరికి పొగడ్తే అవుతుంది

అవర్ = ఆ లోకులు

తూఱ్ఱాదు = అలా నిందించని

ఇవరై =దాసుల భక్తులైన  వీరిని

పోఱ్ఱిల్ = మంచి వారని పొగిడితే

అదు = ఆ పొగడ్త

పున్మయేయాం = నిందయే అవుతుంది

వ్యాఖ్యానము

అలగై ములై సువైతార్కు …...‘ అలగై అంటే అబద్దము అని ఒక అర్థము . వయ్యతుల్ అలగయ్యా వైక్కపడుం” అని తిరువళ్ళువర్ అన్నారు . రాక్షసి అని మరొక అర్థము .ఇక్కడ పూతనను ‘ అలగై ‘ అన్నారు .రేపల్లెలో కృష్ణుడు ఉండగా కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి యశోద లాగా వచ్చి పసిబిడ్డను వడిలోకి తీసుకొని పాలను ఇచ్చే నెపముతో విషమును ఇచ్చిన విషయమును ఇక్కడ చెపుతున్నారు . కృష్ణుడు ఆమె దగ్గర పాలతో పాటు అమె ప్రాణాలనను కూడా ఒక్క సారే  తాగేసాడు . ఇది ‘ అగలై ములై సువైతార్కు ‘ అని చెప్పబడింది . ఈ విషయముగా   తిరుమంగై ఆళ్వార్లు , “పెఱ్ఱ తాయి పోల్ వంద పేయ్చి పెరు ములైయోడు  ఉయిరైవఱ్ఱ వాంగి ఉండ వాయాన్” అని ,

కణ్ణ్ సోర వెంగురుది వందిళియ వెందళల్ పోల్ కూందలాళై మణ్సోర ములైయుండ మామదలోయ్ ”. అని అన్నారు .

స్వామి నమ్మాళ్వార్లు , “విదపాల్ అముదాగ అముదు సెయిదిట్ట మాయన్” అన్నారు . 

అన్ బర్ అడిక్కన్ బర్……..  కృష్ణ చేష్టితాలతో మనసు కొల్లగొట్టబడిన భక్తుల శ్రీపాదముల యందు ప్రీతి కలిగియన్నవారు అని అర్థము . పూతన కృష్ణుడికి అవధ్యము కలిగించాలని వచ్చింది .  కృష్ణుడు ఆమెను సమ్హరించాడు. ఈ చరిత్రను తలచుకున్న వాళ్ళు ,” తనకు  అవధ్యము తలపెట్టిన పూతనను    కృష్ణుడు  సమ్హరించి మనకు మేలు చేసాడు కదా! ఆ రాక్షసిని ఆనాడు  సమ్హరించక పోతే   కృష్ణుడు మనకు దక్కేవాడా ! అని ఆయన కల్యాణగుణములకు దాసులై ఆయన మీద అపారమైన ప్రేమతో దాసాను దాసులవుతారు . అలాంటి వారి శ్రీపాదములను పట్టిన వారు ”  అన్ బర్ అడిక్కన్ బర్ “

తిలద మెన తిరివార్ తమ్మై…… దాసులకు దాసులకు దాసులైన వారు లోకమునకే తిలకము వంటి వారని పెద్దలచే కొని యాడబడతారు. తిలకము మంగళకరము.  అందు వలన దాసులకు దాసులకుదాసులైన వారి ఔన్నత్యము తిలకముతో పోల్చి కీర్తించ బడినది. దీనిని స్వామి నమ్మాళ్వార్లు పయిలుం సుడరొళి” , “నెడుమార్కు అడిమై”  తిరువాయిమొళిలో అనుభవించారు . స్వామి తిరుమంగై అళ్వార్లు పెరియతిరుమొళి కణ్ణ్ సోర వెంకురుది” , “నణ్ణాద వాళవుణర్ ఇడైపుక్కు” పదిగములలో అనుభవించారు . స్వామి కులశేఖరఆళ్వార్లు పెరుమాళ్ తిరుమొళిలో తేట్టరుం తిరల్ తేనిలుం” పదిగములో స్వామి తొండరడిపొడి ఆళ్వార్లుమేం పొరుళ్ పోగ విట్టు”  అనే పాశురములో ఈ భావమునే వ్యక్తీకరించారు .ఇది కాక ఇతిహాస పురానములలోను దీనికి సంభందించిన ఉదాహరణములు అనేకములు కనబడతాయి . శ్రీవచనభూషణములోని  226చూర్ణికలోను ఈ విషయమును చూడవచ్చు.

ఉలగర్ పళి తూఱ్ఱిల్ తుదియాగుం……..ఇంతటి ఆచార్య నిష్ట గల భక్తులను కుల ,ఆశ్రమ భేధములను చూడక భాగవతులన్న ఒక్క విషయాన్నే పరిగణలోకి తీసుకొని , భగవంతుడి కన్నా ఎక్కువగాభాగవతులను సమ్మానించి వారి వెవంట తిరుగుతున్నారని లోకులు నిందించినా ,ఆ నింద వారికి స్తుతిగానే అమరుతుంది.

తూఱ్ఱాదు అవర్ ఇవరై పోఱ్ఱిల్ అదు పున్మయేయాం……పైన పేర్కొన్న భక్తులు నిరంతరము భాగవత సేవలో ఉండటము వలన లోకుల లాగా కొన్ని నిత్యానుష్టానములు చేయనవసరము లేకున్నను,వీరిని చూసి సామాన్యులు కూడా నిత్యానుష్టానములు చేయకుండా మాని వేస్తారని చేయవలసి వుంది. అలాంటి సమయములో వాటిని సూష్మ పద్దతిలో చేయటము చూసి లోకులు ‘ నిత్యానుష్టానము బాగా చేస్తున్నారే ‘ అనిస్తుతించినా అది నిందలాగా అమరుతుంది . 

అడియార్కు అడియార్…… భాగవతులకే కాక లోకమునకే తిలకము వంటి వారని పెద్దలచే కీర్తించబడినవారు వీరు . అలాంటి వారిని లోకులు భగవంతుడిని వదిలి ఆయన దాసులకు దాసోహములుచేప్పుకుంటూ తిరుగుతున్నారని నిందిస్తే అది పొగడ్తగాను ,వారు పొగిడితే నిందగాను వీరికి అమరుట వలన వీరు ‘ అడియార్కు అడియార్ ‘ (దాసులకు దాసులు )అన్న మాట స్థిరపడుతున్నది.

వివరణ:

             “శ్రీరామాయణములో   రామలక్ష్మణభరతశతృజ్ఞులు ధర్మము కోసము నిలబడిన వారు , ధర్మమునకు ఉదాహరణగా నిలిచిన వారు. నలుగురిలో శతృజ్ఞుడు మన పూర్వాచార్యులచే కీర్తించబడిన వాడు ఎందుకనగా  శతృజ్ఞుడు రామ భక్తుడైన   భరతునికి దాస్యము చేసినవాడు. ఆయనకు సకల కైంకర్యములను చేసి ‘ అడియా ర్కడియార్ ‘ అన్న మాటకు ఉదాహరణగా నిలిచాడు

      తొండర్ తొండర్ తొండర్ తొండన్ శఠకోపన్”, “అడియార్ అడియార్ అడియార్ ఎంకోకళ్ అన్న స్వామి నమ్మాళ్వార్ల మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి . ఈ  సందర్భములో స్వామి తిరుపాణాళ్వార్లు అడియార్కు  ఎన్నైఆట్పడుత్త విమలన్” అని స్వామి తొండరడిపొడి ఆళ్వార్లు  అడియార్కు ఎన్నై ఆట్పడుత్తాయ్” అని స్వామి పెరియాళ్వార్లు అడియార్గళ్  ఎం తమ్మై విర్కవుం  పెరువార్గళె” అని స్వామి కులశేఖరాళ్వార్లు తొండర్తొండర్గళానవర్” అని అన్నారు . పై ఉదాహరణలన్ని చూసినప్పుడు ఆళ్వార్లందరూ అడియార్కు అడియార్” (దాసులకు దాసులుగా ) ఉండాలని కోరుకున్నారు అని బొధపడుతుంది . స్వామి అరుళాళ పెరుమాళ్ఎంబెరుమానార్తమ  ఆచార్యులైన స్వామి రామానుజులనే సర్వస్వమని భావించి కైంకర్యము చేసారు . అన్ బర్ అడిక్కు అన్ బర్” , “తిలదం ఎన తిరివార్ ” అన్న ప్రయోగములు వారికి సరిగ్గా సరి పోతాయి .అందువలననే  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లుతెరుళారుం మదురకవి నిలై తెళింధోన్ వాళియే”.అని కీర్తించబడ్డారు .

             స్వామి తిరువరంగత్తముదనార్లు స్వామి రామానునుజులను  ఇలాగే భావించి తమ ఆచార్యుల మీద ప్రేమతో రామానుజ నూఱ్ఱందాది’ ని రాశారు . అలాగే  స్వామి పరాసర భట్టర్లు నంజీయర్లకు కైంకర్యము చేసిన విషయము చరిత్రలో కనపడుతుంది . 

                స్వామి మణవాళ మామునులు  స్వామి రామానుజులను గురించి  యతిరాజ వింశతి” , స్వామి ఎఱుంబియప్పా మణవాళ మామునులను గురించి పూర్వ దినచర్య”, “ఉత్తర దినచర్య”, “వరవరముని శత  కము ”,  “వరవర ముని కావ్యం”, ”వరవరముని చంపు ” మొదలైనవి రాశారు . సెరుకిల్లాదవర్గళుం ఆచార్య నిష్టైగళిల్ ఇరుప్పవరుంశాస్తిర సారార్థంగళై అఱిందవరుం పణత్తాసైపెణ్ణాసై ముదలియ ఆసైయఱ్ఱవర్గళుంపెరుమయఱ్ఱవర్గళుంఅనైత్తు ఉయిర్గళ్ ఇడత్తిల్ అన్బు ఉడయవర్గళుంకోబంఉలోబం ముదలియ కుఱ్ఱంగళై కదిందవగలుమాన మణవాళ మామునిగళిన్ అడియార్గళోడు అడియేనుక్కు ఎన్ఱుం ఉఱవు ఉండాగ వేణ్డుం”                    గర్వము లేని వారు ఆచార్య నిష్టలో ఉన్న వారు శాస్త్ర సారములను తెలుసుకున్న వారుసంపద మీద ఆశ లేని వారు ,స్ర్తీలోత్వము లేని వారు పెద్దల పట్ల, సకల జీవుల పట్ల ప్రేమ గల వారుకోపములోభము మొదలైనవి లేని వారు అయిన మామునుల శిష్యులతో ,దాసునికి నిరంతర సంబంధము ఉండాలని కోరుకుంటున్నాను. ) అన్నారు . అర్థాత్  ఆళ్వార్లుఆచార్యులు దాసులకు దాసులుగా వుండాలని కోరుకున్నారు.ఇదియే  తెలుసుకోవలసిన సారమైన విషయముఈ ప్రబంధము యొక్క సారము . 

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/gyana-saram-39-alagai-mulai-suvaitharkku/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 38

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 37

అవతారిక

                    ‘ తప్పిల్ గురువరుళాల్ ‘ అనే  26వ పాశురము నుండి  37 వ పాశురమైన పొరుళుం ఉయిరుం దాకా  ఆచార్య వైభవమును పలు కోణాలలో చెప్పారు . 26వ పాశురములో అచార్య అనుగ్రహము వలన చేతనుడు శ్రీవైకుంఠమును చేరుకోవచ్చనీ , 27  వ పాశురములో అచార్య శ్రీపాదములని ఆశ్రయించని వారు   శ్రీవైకుంఠము ను చేరలేక జననమరణ చక్రములో పడి కొట్టుకొని దుఃఖితులవుతారని చెప్పారు . 29వ పాశురములో ఆచార్య కృపను పొందిన వారు సులభముగా అవరోధాలను అధిగమించి  శ్రీవైకుంఠమును చేరుకోగలరని ,  ఆచార్యుని శ్రీపాదములను చేరనివారితో సంభందమును వదులుకోవాలని శాస్త్రము శాసిస్తున్నదని 30వ పాశురములో చెప్పి , 31వ పాశురములో  వేదము మొదలగు ప్రమాణ గ్రంధములు , ఆచార్య శ్రీపాదములే పెన్నిధి అని ,  32వ పాశురములో  ఆచార్యుని సామాన్య మానవునిగా భావించే వారు నరకమునకు చేరుకుంటారని   33,34   పాశురములలో  అందుబాటులో ఉన్న ఆచార్యుని  తృణీకరించి దూరస్తుడైన భగవంతుడిని ఆశ్రయించాలను కోవటము  అజ్ఞానమే అవుతుందని చెప్పారు. 35వ పాశురములో గురువు యొక్క అభిమానమునకు దూరమైనప్పుడు భగవంతుడు కూడా కోపగిస్తాడని , 36వ పాశురములో  భగవంతుని వెతుకుతూ 108 దివ్యదేశములు తిరగనవసరము లేదు , వారందరు  ఆచార్యుని శ్రీపాదములందే దొరుకుతారని చెప్పారు . 37వ పాశురములో  సచ్చిష్యుడు తన ధనము, ప్రాణము ,ఆత్మ మొదలగు  సమస్తము  ఆచార్యునువిగా భావించాలి , అప్పుడు ఆయన శిష్యునికి అవసరమగు సంపద, ఆయుష్షు , ఆరోగ్యము, నివాసము , సద్బుధ్ధి మొదలగు సమస్తములను అనుగ్రహిస్తాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చెప్పారు .

పెరియ తిరుమొళి 1-1-9 లో తిరుమంగై ఆళ్వార్లు ఇలా అన్నారు

“కులం తరుం సెల్వం తన్దిడుం

అడియార్ పడు తురాయిన ఎల్లాం

నిలం తరం సేయ్యుం నీళ్ విసుమ్బు అరుళుం

అరుళోడు పేరు నిలం అళిక్కుం

వలం తరుం మఱ్ఱుం తందిడుం

పెఱ్ఱ తాయినుమాయిన సెయ్యుం

నలం తరుం సొల్లై నాన్ కణ్దు కొణ్దేన్

నారాయణా ఎన్నుం నామం”   (పెరియ తిరుమొళి 1-1-9).

              ప్రస్తుత పాశురములో ‘ శ్రీమన్నారాయణ ‘ అని  ఎవరైతె అంటారో వారికి అవసరమైనవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు . అలాగే ఆచార్యులు తన శిష్యునికి అవసరమైనవన్నీ అనుగ్రహిస్తాడు . కావున  ఆచార్యులంటే భగవత్స్వరూపము , ఆయన మీద నిశ్చలమైన విశ్వాసమును కలిగి వుండటమే చేతనులకు ఉత్తారకము అని చెప్పి గ్రంధమును ముగిస్తున్నారు .

H

పాశురము

 “తెనార్ కమల తిరుమామగళ్ కొళునన్

తానే గురువాగి తన్ అరుళాళ్ – మానిడర్కా

ఇన్నిలతే తొన్రుదలాల్ యార్కుం అవన్ తాళిణయై

ఉణ్ణువదే సాల ఉరుం”

ప్రతిపదార్థము

తెనార్ = తేనెలూరు

కమలం ఉడైయ = కమలము నివాసముగా కలిగి వున్న

తిరుమామగళ్ = శ్రీమహాలక్ష్మి

కొళునన్ = విభుడు

తానే = తనే

గురువాగి వందు = ఆచార్యుడై వచ్చి

తన్ అరుళాళ్ –= తన కృపచే

ఇన్నిలతే = ఈ భువిలో

మానిడర్కా = మనుష్యులను తీర్చిదిద్దుటకు

తొన్రుదలాల్ = నరుడై అవతరించటము వలన

యార్క్కుం = ఎవ్వరికైనా

అవన్ తాళిణైయై = వాడి శ్రీపాదములే

ఉణ్ణువదే = ఎప్పుడూ మనసులో నిలుపుకొనుట

సాల ఉరుం = తగినది

వ్యాఖ్యానము

“తెనార్ కమల తిరుమామగళ్ కొళునన్……..పిరాట్టి తామరలో ఉండుట వలన ఆమె స్పర్శచే ఆ తామరకు అందము పెరిగింది . తెనెలూరుతూ వుండటము వలన అందము ఇనుమడించింది . అలాగ తామర యొక్క అంద మును పెంచు అమ్మవారికి విభుడు అని శ్రీమన్నారాయణుని అందరూ కీర్తిస్తారు . ‘ తిరు ‘ అని పెరియ పిరాట్టి (శ్రీమహాక్ష్మి)కి పెరు .తిరుప్పావైలో ఆండాళ్ ‘తిరువే తుయిలెళాయ్ ‘అన్నది . ఆయన  ‘ తిరు ‘ కి విభుడు .

తిరువుడయార్ తేవరెనిల్ తేవర్కుం తేవన్

” మరువు తిరుమంగై మగిళ్ నన్ కొళునన్ – ఒరువనే

అల్లోర్ తలైవరెనల్, అన్ బినాల్ మెయ్ మఱందు

పుల్లోరై నల్లరెణల్ పోం “

(మదురై తమిళ్ సంగములొని పండితులు తిరు న. అప్పన అయ్యంగార్ ) అని అన్నారు . దీని వలన అందరికంటేఅ ఉన్నతమైన వాడు శ్రీదేవి విభుడు అని తేటతెల్ల మవుతున్నది.

గురువాగి …….తన దైవ స్వరూపమును దాచి ఆచార్య స్వరూపములోనికి మార్చుకొని ఇక్కడికి రావటానికి కారణము ఏమిటంటే……

తన్ అరుళాళ్……తన అపారమైన కృప తప్ప మరే హేతువు కనపడదు

మానిడర్కా……చేతనులకు ఉపదేశించి దిద్దుబాటు చేయుటము కోసము మానవ రూపములో అవతరించి ,                      శాస్త్రమునకు కట్టుబడి ప్రవర్తించారని అర్థము .

ఇన్నిలతే తొన్రుదలాల్…….పిల్లవాడు బావిలో పడిపోతే వెంటనే తల్లి కూడా బావిలోకి దూకినట్టు ఆత్మలు జననమరణ చక్రములో పడిపోయిన ఈ భూమిపై తాను అవతరించుట  అని అర్థము.

యార్కుం……సమస్త జనులకు అనగా…కుల భేధము , స్త్రీపురుష భేధము , బ్రహ్మచారి -గృహస్తు అనే ఆశ్రమ భేధము మొదలగు వాటికి అతీతముగా…

అవన్ తాళిణయై  ఉణ్ణువదే….వాడి శ్రీపాదములను ఆశ్రయించుట … ఇక్కడ “అవన్” అనుటలో పరమాత్మ సకల కల్యాణ గుణములు ఇమిడి వున్నాయి .  ఆత్మలన్నింటికి నాయకుడుగా ,  ఆశ్రయింపదగిన వాడుగా , ఉపకరించు వాడిగా ఉండుట అని అర్థము. వాడే ఉపాయము, పురుషార్థము.’ ఉన్నువదే ‘ (ఆశ్రయించుటే)లోని ఏవకారముతో  వాడు తప్ప మరొకరు లేరు అని నొక్కి చెపుతున్నారు .

 సాల ఉరుం…….చాలా తగియున్నది…….పైన చెప్పినవన్నీ ఆత్మకు చాలా తగియున్నవి  . ” శ్రీదేవి విభుడైన శ్రీమన్నారాయణుడు సంసార సాగరములో మునకలు  వేయు జీవులను ఉపదేశము చేత వొడ్డుకు చేర్చుటకు ,అపారమైన కారుణ్యముతో తానే మానవ రూపములో ఆచార్యునిగా అవతరించారు . సమస్త జీవులకు నాయకుడై ఆశ్రయించదగిన వాడుగా ఉన్నాడు . వాడి శ్రీపాదములే సమస్త జీవులకు చేరవలసిన చోటు . అటువంటి వాడి శ్రీపాదములను చేరుటయే జీవాత్మల లక్ష్యముగా మనసులో తలచి ఆ మార్గముననే ప్రయాణించటము జీవాత్మలకు తగిన, తప్పనిసరి ధర్మమై వున్నది . ” కావున ఆచార్యులనగా భవద్స్వరూపమే తప్ప మరొకటి కాదు అన్న సత్యమును తెలిసి ఆయన శ్రీపాదములనే అందరూ ఆశ్రయించ వలసి వున్నదని   ఈ పాశురములో తెలియజేస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/gyana-saram-38-thenar-kamala-thirumamagal/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

జ్ఞానసారము 37

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 36

images

అవతారిక

                  తన ధనము , ప్రాణము , దేహము అన్నీ ఆచార్యుని సొత్తుగా భావించే శిష్యుని హృదయములో  శ్రీమన్నారాయణుడు కొలువై వుంటాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురములో చెపుతున్నారు .

“పొరుళుం ఉయిరుం ఉడంబుం పుగలుం

తెరుళుం గుణముం సెయలుం అరుళ్ పురింద

తన్నారియన్ పొరుట్టా చంగఱ్పం సెయ్బవర్ నెంజు

ఎన్నాళుం మాలుక్కు ఇడం”

ప్రతిపదార్థము

పొరుళుం = తన సంపద

ఉయిరుం = ప్రాణము

ఉడంబుం = దేహము

పుగలుం = నివాసము

తెరుళుం  = బుధ్ధి

గుణముం = మంచి గుణములు

సెయలుం = తాను నిర్వహించే క్రియలు అన్నీ

అరుళ్ పురింద = తనపై కృపను చూపి శిష్యునిగా స్వీకరించిన

తన్నారియన్ పొరుట్టా = తన ఆచార్యులదిగా

చంగఱ్పం సెయ్బవర్ = భావించే వారి

నెంజు = హృదయము

మాలుక్కు = పరమాత్మకు

ఎన్నాళుం = ఎప్పటికీ

ఇడం = నివాస స్థానమవుతుంది

వ్యాఖ్యానము

పొరుళుం …..తన సమస్త సంపదను

ఉయిరుం …తన ప్రాణమును

ఉడంబుం …దేహమును

పుగలుం….తన నివాసమును

తెరుళుం…..తన బుధ్ధి కుసలత, జ్ఞానము మొదలైనవాటిని

గుణముం …..తన మంచి గునమునులను

సెయలుం …..తాను చేయు సమస్త క్రియలను

అరుళ్ పురింద తన్నామురియన్ పొరుట్టా…ఎంతో కృపతో తనకొ మంత్రోపదేశము చేసిన ఆచార్యులదిగా

చంగఱ్పం సెయ్బవర్ నెంజు….ఎప్పటికీ భావించే వారి హృదయము

ఎన్నాళుం మాలుక్కు ఇడం…… సర్వకాల సర్వావస్తలలోను భగవంతునికి ప్రీతికరమైన స్థానము …..  ఏ శిష్యుడు తన సమస్త పరికరములను తన ఆచార్యునిదిగా భావిస్తాడో అతని హృదయము  భగవంతునికి సర్వకాల సర్వావస్తలలోను ప్రీతికరమైన స్థానము అవుతుంది అని ఈ పాశుర భావము . మధుర కవులు ” తేవు మత్తు అరియేన్” ,“అన్నైయాయ్ అత్తనాయ్  ఎన్నై ఆండిడుం  తన్మయాన్ శఠకోపన్ ఎన్ నంబియే”, అని ఆచార్యులైన శఠకోపులే సమస్తమని విస్వసించినవారు .  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు  “తెరుళారుం మధురకవి నిలై తెళిందోన్ వాళియె” కీర్తింపబడ్డారు.  ఆండాళ్ కూడా తమ ఆచార్యులైన విష్ణుచిత్తులే సమస్తమన్న విశ్వాసము కలిగి వుండింది.  ఆమె తన నాచ్చియార్ తిరుమొళిలో  “విల్లుపుదువై విట్టుతుచిత్తర్ తంగళ్ దేవరై  వల్ల పరిసు వరువిపరేల్ అదు కాండుమే ‘ (నాచ్చియార్ తిరుమొళి 10-10).అన్న మాట ఇక్కడ గ్రహించతగినది .

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/03/gyana-saram-37-porulum-uyirum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 36

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 35

అవతారిక

                  సచ్చిష్యునికి 108 దివ్యదేశములు , తన ఆచార్యుని శ్రీపాదములే  అని ఈ పాశురములో చెపుతున్నారు.

nammalwar-final

పాశురము

“విల్లార్ మణికొళిక్కుం వేంకడ పొఱ్ కున్ఱు ముదల్

సెల్లార్ పొళిల్ సూళ్ తిరుప్పదిగళ్ ఎల్లాం

మరుళాం ఇరుళోడ మతగతు తన్ తాళ్

అరుళాలే వైత్త అవర్”

ప్రతిపదార్థము

విల్లార్ = ప్రకాశవంతమైన

మణి = రత్నములను

కొళిక్కుం = అనంతముగా ఇచ్చే

వేంకడం పొఱ్ కున్ఱు ముదల్ = అందమైన బంగారు కొండ తిరుమల మొదలు

సెల్లార్ = మేఘములచే ఆవరించబడిన

పొళిల్ = తోటలతో

సూళ్ = నిండిన

తిరుప్పదిగళ్ = దివ్యదేశములు

ఎల్లాం = అన్నీ

మరుళాం ఇరుళ్ = అజ్ఞానముచే అవరింపబడిన చీకటి

ఓడ = త్వరగా తొలగిపోవుటకు

మతగతు = శిష్యిని తల మీద

తన్ తాళ్ = తన శ్రీపాదములను

అరుళాలే = మహా  కృపచేత

వైత్త = పెట్టిన

అవర్ = ఆచార్యులు వారే

వ్యాఖ్యానము

విల్లార్ మణికొళిక్కుం …… ” విల్ ” ప్రకాశము.’ ఆర్ ‘ అసమామైన . ” విల్లార్ ” అనగా అసమాన ప్రకాశావంతమైన మణులు .

నన్మణి వణ్ణనూర్ ఆవియుం కోళరియుం

పొన్ మణియుం ముత్తముం పూమరముం – పన్మణి

నీరోడు పొరుదుగళుం కానముం వానరముం

వేడుముడై వేంగడం      (నాన్ముగన్ తిరువందాది -48)

అన్న పాశురములో  యాళీ ( సింహము ఏనుగు కలిసిన రూపము ) సింహములను ,వెండి ,బంగారము , ముత్యములు ,మణులు మాణిక్యాలు , పూల చెట్లు ,గలగల పారే సెలయేరులు  , అడవులు , కోతులు , వేటగాళ్ళతో నిండిన తిరువేంగడము (తిరుమల) అన్నట్టుగా ….

సెల్లార్ పొళిల్ సూళ్ .……… బాగా ఎత్తుగా వుండి మేఘములు ఈ కొండల మధ్యగా పోతూ వుంటే , ‘పైకి వెళితే మేఘాలను అందుకోవచ్చు కదా! ‘అని అనిపిస్తూ అందముగా ఆహ్లాదముగా కనిపిస్తున్న ….

వేంకడ పొఱ్ కున్ఱు ముదల్.…….. ప్రకృతి వనరులతో , సహజ సుందరముగా , ఆహ్లాదముగా , బంగారు కొండగా విరాజిల్లుతున్న తిరువేంగడము (తిరుమల)మొదలు ….

తిరుప్పదిగళ్ ఎల్లాం.……….పెరుమాళ్ళకు ఇష్టమైన  108 దివ్య దేశముల వరకు అన్నీ ముఖ్యమని భావించే ( ఆచార్య అనుగ్రహము కన్నా మిన్నఅని భావించే)

మరుళాం ఇరుళోడ .…. అజ్ఞానమనే చీకటినితొలగదోయటానికి

మతగతు తన్ తాళ్ అరుళాలే వైత్త అవర్..…….శిష్యుని అనుగ్రహించటానికి  ఆచార్యులు తన శ్రీపాదాల శిష్యుని శిరస్సు మీద ఉంచడానికి కారణము , తన నిర్హేతుకమైన కృప తప్ప మరొక హేతువు కనపడదు . ఒక వేళ శిష్యుడు చేసే శుస్రూషలు కారణమా ? అంటే కాదు .కేవలము శిష్యుడి  మీద తనకున్న ప్రేమ వలననే  అనుగ్రహించారు .  పరమాత్మ వేంచేసి ఉండే శ్రీవైకుంఠము , పాలకడలి, రామకృష్ణాది విభవావతారాలు , సమస్త వస్తువులలోను అంతరముగా నిలిచి వున్న అంతర్యామి, కోవెలలో వేంచేసి వుండే అర్చామూర్తి  అనే ఐదు  రూపములు అమరి వున్న తిరుమలను ఉదహరించడము వలన అవి అన్నీ ఆచార్యుల శ్రీపాదములకు సమము అని చెపుతున్నారు  .అర్థాత్ ఇవన్నీ తనకు ఆచార్యులే అని శిష్యుడు గ్రహించాలి . శ్రీవచన భూషణములో ” పాట్టు కేట్కుం ఇడముం కూప్పిడు కేట్కుం ఇడముం కుదిత్త ఇడముం వళైత్త ఇడముం ఊట్టుం ఇడముం ఇవై ఎల్లాం వగుత్త  ఇడమే ఎన్ఱు ఇరుక్క కడవన్  ” అన్న చూర్ణికను ఇక్కడ అన్వయించుకోవాలి.

పాట్టు కేట్కుం ఇడముం = పరమపదము

కూప్పిడు కేట్కుం ఇడముం = పాలకడలి

కుదిత్త ఇడముం = రామ, కృష్ణాది విభవావతారములు

వళైత్త ఇడముం = అంతర్యామిత్వం

ఊట్టుం ఇడముం = దేవాలయలలో వేంచేసివున్న అర్చారూపము

ఇవై ఎల్లాం  = ఇవి అన్నీ

వగుత్త ఇడమే ఎన్ఱు ఇరుక్క కడవన్= అచార్యులే అని భావించాలి.

కావున శిష్యునికి ఆచార్య స్థానమే, పరమాత్మ వేంచేసి వున్న 108 దివ్యశములు అని చెపుతున్నారు .

ఇరామానుశ నూత్తందాది 106వ పాశురములో ఈ విషయాన్నే

ఇరుప్పిడం వైకుందం వేంగడం మాలిరుంచోలై ఎన్ఱుం

పొరుపుడం మాయనుక్కు ఎన్ బర్ నల్లోర్ అవై తన్నొడుం వందు

ఇరుప్పిడం మాయన్ ఇరామానుసన్ మనత్తు ఇన్ఱవన్ వందు

ఇరుప్పిడం ఎన్ఱన్ ఇదయతుళ్ళే తనకు ఇన్బుఱవే

అన్నారు తిరువరంగత్తముదనార్లు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/03/gyana-saram-36-villar-manikozhikkum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 35

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 34

అవతారిక

తనకు అందుబాటులో ఉన్న అచార్యునిపై విశ్వాసము లేక  , ఆశ్రయించుటకు  దూరస్తుడైన భగవంతుని ఇష్టపడు వారు బుధ్ధిహీనులని 33,34 పాశురాలలో చెప్పారు. ఈ పాశురములో గురువు మీద ప్రీతి లేని వారిని భగవంతుడు ఉపేక్షించక శిక్షిస్తాడని ఉదాహరణ సహితముగా చెపుతున్నారు.

lord-vishnu-wallpapers

పాశురము

ఎన్ఱుం అనైత్తుయిఱ్కుం ఈరం సెయ్ నారణనుం

అన్ఱుం తన్ ఆరియన్ పాల్ అంబు ఒళియిల్ నిన్ఱ

పునల్ పిరింద  పంగయతై పొంగు సుడర్  వెయ్యోన్

అనల్ ఉమిళందు తాన్ ఉలర్తియఱ్ఱు

ప్రతిపదార్థము

నిన్ఱ పునల్ = తంకు ఆధారమైన నీటిని

పిరింద  = వదలిన

పంగయతై = తామరపూవును

పొంగు సుడర్ = ప్రాకాశించే కాంతి వున్న

వెయ్యోన్ = వేడి కిరణములను ప్రసరించే సూర్యుడు

తాన్ = మునుపు ఆ పూవు వికసించుటకు కారణమైన వాడు

అనల్ ఉమిళందు = నిప్పులు కక్కి

ఉలర్తియఱ్ఱు = వాడిపోయేట్టు చేస్తాడు

ఎన్ఱుం = ఎప్పుటికీ

అనైత్తుయిఱ్కుం = సకల జీవరాశులకు

ఈరం సెయ్  = కరుణ చూపే

నారణనుం = నారాయణుడు

తాన్ ఆరియన్ పాల్ = తన ఆచార్యుని విషయములో

అంబు ఒళియిల్ = భక్తిలో లోపము ఏర్పడితే

అన్ఱుం = కోపముతో దహించి వేస్తాడు

వ్యాఖ్యానము

ఎన్ఱుం ………భూత,భవిష్యత్ , వర్తమాన కాలాలములనే త్రికాలాలలోను

అనైత్తుయిఱ్కుం………సకల ఆత్మలకు

ఈరం సెయి నారణనుం…….సదా కృపను చూపు నారాయణుడు…. ఇక్కడ నారాయణుడు అన్నప్రయోగము వలన జీవాత్మకు , పరమాత్మకు  విడదీయరాని సంబంధమును తెలియజేస్తున్నది .  నారములనగా సమస్త జీవరాశులు , అయనమనగా సమస్త జీవులకు అంతరమున, బాహ్యమున ఆధారమైన  వాడు అని అర్థము . ఈ భావనను ఆండాళ్ ‘ “ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియాదు” ( తిరుప్పావై 28) లో అన్నది . స్వామి తిరుమళిసై అళ్వార్ కూడా “నాన్ ఉన్నై అన్ఱి ఇలేన్ కండాయ్ నారణనే!!! నీ ఎన్నై అన్ఱీ ఇలై” అన్నారు .  దీని వలన జ్ఞానమున్న ఆత్మలకు, జ్ఞాన శూన్యమై జడ పదార్థములైన నారములకు ప్రాణాధారమై లోపల ఉండి చేతనత్వము కలిగించు వాడు “నారాయణుడు” అని అర్థమును  తెలుపుతున్నారు . సమస్త జీవులు చేయు దోషములను గుణములుగా స్వీకరించు వాడు , వశ్చలుడు , సమస్త జీవులపై కృపను చూపు వాడు“నారాయణుడు” అని  ఆయన గుణములను తెలియ జేస్తున్నారు.

అన్ఱుం …….దండించు వాడు,కోపగించు వాడు అని అర్థము .“అన్ఱియ వాణన్” పెరియ తిరుమొళిలో (1275) కోపించిన అన్న అర్థములోనే చెప్పారు . ఆయన కృపా సముద్రుడు కాదా! ఆయనకు కోపము ఎప్పుడు వస్తుంది? అంటే ……

తన్ఆరియన్ పాల్ అన్ బు ఒళియిల్ …..…తన గురువుపై భక్తి లేని వారిపై కోపిస్తాడు . మునుపు  “ఎట్ట ఇరుంద గురువై” , “పఱ్ఱు గురువై”, అన్న రెండు పాశురాలలో గురువుపై విశ్వాసము లేని వాడు, గురువును సామాన్యునిగా భావించి ,తన దైవముగా భావించని వాడిపై కోపిస్తాడు అని చెప్పారు. ఈ విషయముగా ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు .

నిన్ఱ పునల్ పిరింద  పంగయతై .……..లోకములోని జీవులన్నింటికీ ఆధారభూతుడైన  సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణాల ద్వారా వేడిని  వెలుగును ప్రసరింప చేస్తాడు .  కొలనులోని తామరలను సూర్యుడు తన  కిరణాలను ప్రసరించి   వికసింపచేస్తాడు.  అదే తామర నీటిని విడిచి బయట వుంటే ఆ సూర్యుడు  ఏమి చెస్తాడో వివరిస్తున్నారు .

పొంగు సుడర్  వెయ్యోన్……కులశేఖరాళ్వార్లు  “సెంగమలం అందరం సేర్ వెంగదిరోరుక్కల్లాల్ ” అన్నట్లుగా సూర్య కిరణాలు లేనిదే తామర వికసించదు.  కృత్రిమమైన  వెలుగును ప్రసరింపచేయటము  ద్వార వికసింప చేయాలని ప్రయత్నించినా ఫలితము ఉండదు . తామర నీటిలో ఉన్నంత వరకు నీరు ,  సూర్యుని వేడి  అది వికసించడానికి ఉపకరిస్తాడు . అదే  సూర్యుని వేడి  తామర నీటిని వదిలి బయటకు వస్తే ………..

అనల్ ఉమిళందు తాన్ ఉలర్తియఱ్ఱు ……… సూర్యుడి  ప్రతాపమునకు వాడి పోతుంది .  అలాగే ఆచార్య భక్తి వున్న వాడిపై  శ్రీమన్నారాయణుని  కృప ఉంటుంది .  ఆచార్య భక్తి లేని వాడిపై శ్రీమన్నారాయణుడు  తన కోపమును ప్రదర్శిస్తాడు . ఈ ఉదాహరణ ఆచార్య భక్తి కలిగివుండటము ఎంత అవసరమో తెలియజేస్తున్నది .   ఆచార్య భక్తి వున్న వాడికి  శ్రీమన్నారాయణుని  కృప వలన జ్ఞానము అభివృధ్ధి చెందుతుంది . ఆచార్య భక్తి లేని వాడికి శ్రీమన్నారాయణుని కృప లేక పోవటము చేత  వున్న జ్ఞానము కూడా తొలగి పొయి అజ్ఞానిగా మిగులు తాడు . కావున మంత్రోపదేశము చేసిన ఆచార్యుని మీద భక్తి లేని వాడిని కరుణాసముద్రుడైన  శ్రీమన్నారాయ ణుడు కూడ కరుణించక పోగా తన కోపమును చూపుతాడు .  నీటిలో వున్న తామర వికశించడానికి కారణమైన సూర్యుడే , నీటిని వదలిన తామర వాడిపోవడానికి కారణమవుతాడు . ఆచార్య భక్తి ఉన్న శిష్యుడి జ్ఞానము అభివృద్ధి చెందడానికి ఉపకరించిన  శ్రీమన్నారాయణుడే , ఆచార్య భక్తి లేని శిష్యుడిని జ్ఞాన శూన్యునిగా చేస్తాడు  . ఈ సందర్భములో తిరువళ్ళువర్  చెప్పిన “ఉళరెనినుం ఇల్లారోడొప్పర్” అన్న వార్త అనుసంధానము చేసుకోవాలి . శ్రీవచనభూషణము చూర్ణిక -439లో “తామరైయై అలర్థ కడవ ఆదిత్యన్ తానే, నీరైప్పిరిందాల్ అత్తైఉలర్తుమాపోలే, స్వరూప వికాసత్తై పణ్ణుం ఈశ్వరన్ తానే ఆచార్య సంబంధం కులైందాల్ అత్తై వాడ పణ్ణుం “చూర్ణికై-439 ) అని చెప్పారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-35-enrum-anaithuyirkum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 34

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 33

అవతారిక

              అతి సులభుడైన తన  ఆచార్యుని చూసి ,తన వంటి మానవుడే కదా! అని భావించి, అనేక  యోగములు , క్రియల ద్వారా మాత్రమే లభించే దుర్లభుడైన భగవంతుని కోసము పరుగులు తీయటము జ్ఞానశూన్యత అవుతుంది .

పాశురము

“పఱ్ఱు గురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు

మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱే తన్

కైపొరుళ్ విట్టారేనుం కాసినియిల్ తాం పుదైత్త

అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు”

ప్రతిపదార్థము

పఱ్ఱు గురువై = ఆశ్రయణ సౌకర్యము గల ఆచార్యులను

పరన్ అన్ఱు ఎన్ఱు = ఈయన భగవంతుడు కాదు అని

ఇగళందు = భావించి

మఱ్ఱోర్ పరనై = వేరు దైవమును

వళిప్పడుదల్ = ఆశ్రయించుట

తన్ కైపొరుళ్ = తన చేతిలో వున్న ధనమును

విట్టు = అల్పమైనదిగా ,విలువ లేనిదిగా భావించి ,వదిలి వేసి

ఆరేనుం = పరులెవరైనా

తాం కాసినియిల్ = తమ ప్రాంగణములో

పుదైత్త = పాతిపెట్టారేమోనని

అప్పొరుళ్ = ఆ ధనమును (పాతరను )

తేడి తిరివాన్  = వెతుకుతూ తిరుగువాడి చేష్టల వంటిది

ఎఱ్ఱే  = ఎంత పిచ్చితనమో కదా!

వ్యాఖ్యానము

పఱ్ఱు గురువై …..…తాను ఆశ్రయించిన ఆచార్యుడు తనకు అవసరమైనప్పుడు ఆదుకునే అవకాశము గలవారు, తన ఉన్నతిని కోరేవారు తనకు ఎల్లప్పుడు అందుబాటులో వారు.. .

పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు.…….అటువంటి ఆచార్యుని భగవద్స్వరూపముగా భావించవలసి వుండగా ,అలా భావించక ఆయన మన వంటి మనవమాత్రుడే కదా! అని చిన్న చూపు కలిగి వుండుట…

మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ .……..దుర్లభుడైన , పంచేద్రియముల అనుభవానికి అందని యోగముల వంటి కష్ట సాధ్యమైన క్రియల ద్వారా మాత్రమే లభించే మరొక దైవాన్ని తనకు రక్షకుడుగాను , తోడుగాను భావించి పూజించుట ….

ఎఱ్ఱే……..ఏవిటి? ….వీడు ఆశ్రయించ వలసిన, సులభుడైన ఆచార్యుని వదిలి , దుర్లభుడన వేరొక దైవాన్ని పట్టుకున్నడే అన్న బాధతో …..ఏవిటి? … అంటున్నారు .

తన్ కైపొరుళ్ విట్టు..…….తన చేతిలోని వస్తువును వదిలి వేసి , కొంగుబంగారాన్ని పారవేసి ,

ఆరేనుం కాసినియిల్ తాం పుదైత్త….….ఎవరైనా భూమిలో మన కోసము ధనమును పాతర వేసి వుంచారా! అని వెతుకుట వంటిది.

అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు..……ఎవరో పాతర వేసిన ధనమును తాననుభవించాలని భూమిని త్రవ్వి వెతుకుట ఎంత పిచ్చితనము? అటువంటిదే కదా ఇతడు చేస్తున్న పని అని ఇక్కడ వృత్తి ఉదాహరణ చెప్పారు. అయ్యో ఎంత పిచ్చివాడు కదా! అని బాధ పడుతూ ఈ పాశురమును చెప్పారు .

            శ్రీవచన భూషణములో  “కై పట్ట పొరుళై కై విట్టు పుదైత్త పొరుళై కణిసిక్క కడవనల్లన్ ” అని ఈ పాశురములోని భావమును చెప్పారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలముhttp://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-tamil-34/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 33

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 32

అవతారిక

                  అందుబాటులో వున్న ఆచార్యుని సామాన్య మనిషిగా భావించి వదిలి వేసి అందుకోవటానికి కష్టమైన భగవంతుడిని కోరికలు తీర్చు వాడని భావించి ఆయనను వెదికే మూర్ఖుడు అని ఉదాహరణ సహితముగా ఈపాశురములో చెప్తున్నారు.

“ఎట్ట ఇరుంద గురువై ఇఱైఅన్ఱు ఎన్ఱు

విట్టు ఓర్ పరనై విరుపుఱుదల్ – పొట్టనత్తన్

కణ్ సెంబళితిరుందు కైతురుత్తి నీర్ తూవి

అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు”

ప్రతిపదార్థము

ఎట్ట ఇరుంద = అందుబాటులో వున్న

గురువై = ఆచార్యుని

ఇఱైఅన్ఱు ఎన్ఱు =(తగిన వాడు ) నాయకుడు కాదని

విట్టు = ఉపేక్షించి

ఓర్ పరనై = చేరుకోవడానికి కష్టమైన భగవంతుని

విరుపుఱుదల్ = కోరుకోవటము

పొట్టన = గబుక్కున

త్తన్ కణ్ = తన కన్నులను

సెంబళితిరుందు =మూసుకొని

కైతురుత్తి నీర్ = దాహార్తిని తీర్చుకోవాటనికి ఉంచుకొన్న నీటిని

తూవి = పారబోసి

అంబుదత్తై = మేఘముల వైపు

పార్తిరుపాన్ అఱ్ఱు = నీటి  కోసము చూసేవాడిలా ఉంటుంది

వ్యాఖ్యానము

ఎట్ట ఇరుంద గురువై……అందుబాటులో వున్న అనగా ఈ లోకములోనే ఉన్న అచార్యులని అర్థము. ఎప్పుడై నా ఆశ్రయించటానికి శులభుడు , రక్షించు వాడు , మనసుకు దగ్గరైన వాడు , ఆత్మొజీవనమునకు ఉపకరించు వాడు ,ఎప్పుడు ఏ సందేహము వచ్చినా నివృత్తి చేసే వాడు ఆచార్యుడు అని అర్థము .

ఇఱైఅన్ఱు ఎన్ఱు విట్టు……..ఈయన తగిన వాడు కాదని భావించి 31వ పాశురములో “శరణాగతి తంద  తన్ ఇఱైవన్ తాళే ”( శరణాగతి శాస్త్రాన్ని ఇచ్చిన తన దైవము శ్రీపాదములే శరణము ) అన్న మాటకు విరుధ్ధముగా ఆచార్యుని తనకు దైవముగా  భావించక, మనలాగా సామాన్య మానవుడని  భావించుట .

ఓర్ పరనై విరుపుఱుదల్ …..ఎంతో ఉన్నతమై , పొందుటకు కష్టమైన  భగవంతుని కోరుకొనుట వంటిది . అర్థాత్ శాస్త్రములు క్రమ పధ్ధతిలో అధ్యయనము చేసి తెలుసుకోవలసిన వాడు , ఆశ్రయించుటకు దూరస్తుడు అయిన భగవంతుని ఆశ్రయించాలని భావించుట . ఇది ఎలాంటిదంటే….

పొట్టన.……..అనాలోచితముగా , వెనక వచ్చె విపరీత పరిణామాలాను యోచించకుండా….

త్తన్ కణ్ సెంబళితిరుందు .……కళ్ళు మూసుకొని ముందు వెనక చూసుకోక..

కైతురుత్తి నీర్ తూవి..…….దాహము వేసినపుడు దాహార్తిని తీర్చుకోవడము కోసము భద్రపరచిన నీటిని నేలపాలు చేసినట్లు …..

అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు….….ఆకాశములో మేఘాలను చూసి ,అవి వర్షిస్తే దాహార్తి తీర్చుకుందామని భావించుట .  దీనిని “తొలిల్ల్ ఉవమం”  అంటారు .అంటే చెసే పనిలో ఉపమానము చూపుట . ఆచార్యుని వదిలి భగవంతుని వైపు చూసేవాడు , చేతిలో నీటిని పారబోసుకొని ఆకాశములో మేఘాలవైపు చూసేవాడూ సమానమైన మూర్ఖులని నిరూపిస్తున్నారు . శ్రీవచభూషణము 449 లో “విడాయ్  పిఱందపోదు కరస్థమాన ఉధగత్తై  ఉపేక్షిత్తు జీమూత జలదయుం, సాగర సలిలత్తైయుం, సరీ సలిలత్తైయుం వాపీ కూప పయసుకలయుం వాంజిక్క కడవన్ అల్లన్” ( దాహము వేసినప్పుడు కరస్థమైన నీటీని ఉపేక్షించి మేఘములలోని నీటి కోశము , సముద్రపు నీటిని , నదులు నీటిని , సరస్సులలో నీటిని , భావిలో నీటిని కోరుకున కూడదు )అని ఈ విషయముగా ప్రస్తావించి వున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలముhttp://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-33-etta-irundha-guruvai/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 32

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 31

అవతారిక

                     ‘ మాడుం మనయుం ‘ అనే 30 వ పాశురములో ,   తిరుమంత్రమును ఉపదేశించిన  ఆచార్యుల శ్రీపాదములే సలక ప్రయోజనములను చేకూరుస్తుందని గ్రహించని బుధ్ధిహీనులతో సంబంధమును పూర్తిగా విడిచివేయాలని  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చెప్పారు. ‘ వేదం ఒరు నాంగిన్ ‘ అనే 31 వ పాశురములో , శరణాగతి శాస్త్రమును ఇముడ్చుకున్న  ద్వయ మహా మంత్రము ఉపదేశించిన  ఆచార్యుల శ్రీపాదములే శరణమని పరిపూర్ణ విశ్వాసమును కలిగి వుండాలని చెప్పారు . అంతటి ఉపకారము చేసిన ఆచార్యులు సాక్షాత్ రామ, కృష్ణావతరము లాగ భగవదవతారముగా గ్రహించాలి . అలా భావించని వారికి కలిగే కష్ట నష్టాలను , అలాగే దేవాలయాలలో విగ్రహ రూపములోనున్న అర్చామూర్తిని  ఏ పదార్థముతో చేశారని పరిశోదించే మూర్ఖుల కష్ట నష్టాలను ఈ పాశురములో చెపుతున్నారు.

పాశురము

“మానిడవన్ ఎన్నుం గురువై మలర్ మగళ్ కోన్

తానుగంద కోలం ఉలోగం ఎన్నుం ఈనమదా

ఎణ్ణుగిన్ఱ నీసర్ ఇరువరుమే ఎక్కాలుం

నణ్ణిడువర్ కీళాం నరగు”

ప్రతిపదార్థము

గురువై  =తనకు మంత్రమును ఉపదేశించిన గురువుని

“మానిడవన్ ఎన్నుం = సామాన్యమైన మానవునిగా భావించే వారు

మలర్ మగళ్ కోన్ = తామారలో నివసించే శ్రీమహాలక్ష్మికి నాయకుడైన నారాయణుడు

తానుగంద కోలం = తానుగా కోరి స్వీకరించిన రూపములను

ఉలోగం ఎన్నుం = పంచలోహములు మొదలగు పదార్థములుగా

ఈనమదా = హీనముగా

ఎణ్ణుగిన్ఱ = భావించే

నీసర్ = నీచులు

ఇరువరుం = ఇద్దరూ

ఎక్కాలుం = కాలతత్వమున్నంత వరకు

నరగు = నరకములో

నణ్ణిడువర్ = ఉంటారు

వ్యాఖ్యానము

మానిడవన్ ఎన్నుం గురువై…….జనన మరణ చక్రములో తిరుగుతున్న ఆత్మలను ఆ చక్రము నుండి బయట పడవేయుటానికి దేవుడే ఆచార్య రూపములో అవతరించారని విశ్వసించాలి . నారాయణుడే ఆచార్య రూపములో మానవ అవతారములో ఉన్నాడని శాస్త్రములు ఘోషిస్తున్నవి. దానికి విరుధ్ధముగా భావించేవాడు మూర్ఖుడు , వాడి విద్య విలువ లేనిది అని శాస్త్రములు చెపుతున్నవి .

మలర్ మగళ్ కోన్ తానుగంద కోలం ఉలోగం ఎన్నుం.……తామరలో నివసించే శ్రీమహాలక్ష్మికి నాయకుడైన నారాయణుడు  తానుగా కోరి స్వీకరించిన రూపములను  పంచలోహమా! , దారు శిల్పమా!,రాతి శిల్పమా! అని శోధించటము మహా పాపమవుతుంది . ఈ రూపాలను  “ఉమర్ ఉగంధ ఉరువం నిన్ ఉరువం” తిరువాయిమొళి (8-1-4) లో నమ్మళ్వార్లు పాడారు . అర్థాత్ తన భక్తులు తనను ఎలా చూడాలని కోరుకుంటారో అలాగే దర్శనమిస్తారు . అది ఏరూపమైనా దైవస్వరూపమే . అర్చా రూపమును భక్తులు నిర్మిచినప్పటికీ అందులోను తనదైన దైవీక శక్తి తోనే భగవంతుడు వేంచేసి వుంటాడు . ఆ విగ్రహానికి అలంకరించే ఆభరణాలు , వస్త్రాలు కూడా లౌకికమైనప్పట్టికి  దైవీక శక్తిని పొందుతాయి . దీనినే శాస్త్రములో అప్రాకృతము అంటారు . అలాంటి మూర్తిని ఏ పదార్థముతో చేసారని పరిశోధన చేయడము మహా పాపము . తనను కన్న తల్లిని తను పుట్టిన చోటును చూపమని అడిగినంత పాపమని శాస్త్రము చెపుతున్నది .

ఈనమదా..…..నీచముగా….గురువును సామాన్య మానవుడిగా , అర్చామూర్తిని పంచలోహాది పదార్థములుగా భావించే నీచులు . వీరు కర్మ చండాలురు అనే పాపులు .   “ఉళ్ళువదెల్లాం ఉయర్ వళ్ళల్” ( ఉన్నతముగా తలచ వలసిన హృదయములో నీచముగా తలచుత)అని తమిళమిలో ఒక సామెత ఉన్నది . వీరు అటువంటి వారు .

ఇరువరుమే…..… గురువును సామాన్య మానవుడిగా తలచే వారు, అర్చామూర్తిని పంచలోహాది పదార్థములుగా భావించే వారు, ఇరువురు నీచులే . ఈ ఇరువురికి పైన చెప్పిన పాపము తగులుతుంది .

ఎక్కాలుం నణ్ణిడువర్ కీళాం నరగు.…….ఎంత కాలమైనా నరకములో ఉంటారు. అంగా కాలతత్వమున్నంత వరకు వీరికి నరకమే గతి అని చెపుతున్నారు . కీళాం నరగు అంటే నరకములోను నీచముగా అని అర్థము . నరకమంటేనే సుఖము లేక కేవలము ధుఃఖము మాత్రమే ఉంటుంది . ఎక్కాలుం నణ్ణిడువర్ .. అలాంటి నరకమును ఎప్పటికి ఉంటాడు అని అంటున్నారు . గట్టు ఎక్కాడానికి , కనీసము దరి కూడా కనపడనంతగా జనన  మరణ కడలిలో పడి కొట్టుకుంటారు . అర్థార్ గురువును దైవముగా విశ్వచించని వాడు, అర్చా మూర్తిని దైవముగా భావించక మూర్తి యొక్క పదార్థ పరిశోధన చేసే వాడు నీచాతి నీచులు , ఇద్దరు నీచమైన  నరకములో కాలతత్వమున్నంత వరకు ఉంటారు . ఈ రెండూ సమానమైన పాపములే అని ఈ పాశురములో చెపుతున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-32-manidavan-ennum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

జ్ఞానసారము 31

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 30

అవతారిక

                    సకల వేదములు, వేదాంతములు, శాస్త్రముల సారము శరణాగతి. అలాంటి ఉన్నతమైన శరణాగతి శాస్త్రమును ఉపదేశించిన ఆచార్యుల శ్రీపాదములే శరణమని ఈ పాశురములో చెపుతున్నారు.

Ramanujar-Melkote

 

పాశురము

“వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయి పొరుళుం

కోదిల్ మను ముదల్ నూల్ కూరువదుం-తీదిల్

శరణాగతి తంద తన్ ఇరైవన్ తాళే

అరణాగుం ఎన్నుం అదు”

ప్రతిపదార్థము

తీదిల్ = దోషరహితమైన

శరణాగతి = శరణాగతి శాస్త్రమును

తంద = తనకు ఉపదేశించిన

తన్ ఇరైవన్ = తన దైవమైన ఆచార్యుల

తాళే = శ్రీపాదములే

అరణాగుం = ఆశ్రయించరగిన చోటు

ఎన్నుం అదు = అని చెప్పబడే శరణాగతి విధానమును

ఒరు నాంగు వేదం  =ఋగ్ ,యజుర్ , సామ , అధర్వణములనే  నాలుగు వేదములలోను

ఉట్పొదింద = నిధిలాగా లోపల దాగి వున్న

మెయి పొరుళుం = సత్యమును

కోదిల్ = దోషములేని

మను ముదల్ నూల్ = మను శాస్త్రము వంటి  శాస్త్రములలో

కూరువదుం = చెప్పబడిన ధర్మములు కూడా

అదువే = అవియే

వ్యాఖ్యానము

వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయి పొరుళుం……’ ఒరు ‘ అంగా ఒక …వేదము యొక్కఅసమానమైన వైభవమును తెలియజేస్తూ  ఈ పదమును ఇక్కడ ఉపయోగించారు. వేదము ఎవరో ఒకరిచే రాయబడినది కాదు, అపౌరుషేయాలు . అందు వలన ఇందులో అసంభద్దము , పక్షపాతము,అనుమానములకు తావు లేదు . వేదములో చెప్పినది సత్యము. సత్యము కానిది అందులో లేదు.

నాంగు…....ఋగ్ ,యజుర్ , సామ , అధర్వణములనే  నాలుగు వేదములు ఎనిమిది పోగుల దారములతో కట్టినట్లుగా అష్టాక్షరి మహా మంత్రములో చెప్పిన శ్రీమన్నారాయణుని దాచి వుంచింది. అర్థాత్ అష్టాక్షరి మహా మంత్రము సకల వేదములలోను అంతరంగముగా నిధిలాగా ఇమిడి వున్నది . తిరుచంద విరుత్తములో  “ఎట్టినోడుం ఇరణ్డెనుం కయిఱినాల్ అనంతనై కట్టి” అని చెప్పినట్లుగా వేదము అన్నింటికి ప్రమాణము .ఇక్కడ ‘నాంగు ‘అనగా వేదములో ఎక్కడో ఏ మూలనో చెప్పుటకాదు , శాఖోపశాఖలుగా విస్తరించిన వేదము అంతటా ఈ అష్టాక్షరి మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుని గురించిన సత్యము వ్యాపించి వున్నదని అర్థము.

కోదిల్ మను ముదల్ నూల్ కూరువదుం.……కోదు..దోషము…అది లేకపోవుట కోదిల్. అర్థాత్ ఒకదానిని మరొకటిగా మార్చి చెప్పు దోషము . ఉదాహరణకు ముత్యపుచిప్పను చూసి వెండి అని తప్పుగా చెప్పకుండా ముత్యపుచిప్ప అని చెప్పుట . ఇటువంటి దోషములు లేనిది మను ధర్మ శాస్త్రము . మనువుకు కోదిల్ అన్న ప్రయోగము చేయుట వలన , మనువు యొక్క ప్రామాణికత్వము తెలుస్తున్నది .  దీని వలన మను విషయ ములో ప్రమాణ నిర్ధారణకు ఇంక పరిశోధన ఎదీ చేయనవసరము లేదని అది మందు వంటిదని అర్థము . ఉన్నది ఉన్నట్లుగా చెప్పె ఇతిహాసములు“సాత్విక స్మృతులు, శ్రీవిష్ణు పురాణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము ,  పాంచరాత్ర ఆగమములు . మనుశాస్త్రముతో సహా  ఈ శాస్త్రములన్ని“అష్టాక్షరి మహా మంత్రము” లో చెప్పబడిన శరణాగతి శాత్రమును ఏకకంఠముగా ఘోషిస్తున్నవి .  కావున శరణాగతి శాత్రమునే వేదము మొదలగు వాటిలో చెప్పబడినది అని ఇక్కడ చెపుతున్నారు .

తీదిల్ శరణాగతి తంద ..…….తీదు ….ఏ దోషము చెప్పలేనిది .  శరణాగతిని గురించి చెప్పిన గ్రంధములలోనే ఇతర మార్గములైన జ్ఞాన యోగము,భక్తి యోగము మొదలైన వాటి గురించి కూడా చెప్పబడినది. వాటిని ఆచరించే వారికి చేయదగిన, చేయదగని నియమములు అనేకము చెప్పబడినవి . కాని శరణాగతిలో ఇటువంటి నియమములేవీ లేకుండా ఆచరించుటకు సులభముగా వుంటుంది , అందుకే దోషములు లేనిది అన్నారు . ప్రత్యక్షముగా భగవంతుని శ్రీపాదములను పట్టుకోవటమే శరణాగతి . ( ప్రపత్తి )ఈశ్వర అంటే భగవద్విషయ వాక్యము . శరణాగతి అంటే భగవంతుడనే అర్థమును చెపుతున్నారు . ఇటువంటి శరణాగతి శాస్త్రమును ఇచ్చుట తీవ్రమైన దుర్భిక్షములో వున్నవాడికి అపారమైన సంపదను ఇచ్చినట్లే అవుతుంది .

తన్ ఇరైవన్ …….తమ ఆచార్యుని ‘ మాత్తుం  మనైయుం ‘ అన్న పాశురములో అష్టాక్షరిని ఉపదేశించిన వారుగా చెప్పుకున్నారు . ఇక్కడ శరణాగతి ఇచ్చిన వారని చెప్పుకుంటున్నారు . అర్థాత్ అష్టాక్షరి మంత్రమునకు , శరణాగతి మంత్రమునకు భేదము ఉందని తేటతెల్లముగా తెలుస్తున్నది . అష్టాక్షరి అని ప్రస్పుటముగాను, శరణాగతి అని గోప్యముగా చెప్పబడింది . తిరుమంత్రము , ద్వయము , చర్రమశ్లోకము అనే మూడు మహా మంత్రములలో మొదటి ,చివరి మంత్రములలో అర్థమును గోప్యము చేసి మంత్రమును బహిరంగముగా చెప్పుట మన ఆచార్యుల అలవాటుగా వస్తున్నది . అలా కాక శరణాగతి అని చెప్పబడే ద్వయమంత్రము అర్థమునే కాక, శబ్దమును కూడా గోప్య పరచి మనసులోనే అనుసంధానము చేసుకునే అచారము కలదు . దీని వలన  ద్వయమంత్రము యొక్క ఔన్నత్యము బొధపడుతున్నది . దీని విషయముగా నంజీయర్ అనే అచార్యులు ద్వయమమత్రములో భగవంతుడి అందమైన  రూపమును గురించి , దాని గుణములను గురించి పరమాత్మ స్వరూపము ,ఆయన గుణ విశేషణములు , నిత్యులు, ముక్తులు నిత్యానందులుగా వుండుట గురించి చెప్పుట వలన ఇక్కడ మోక్షము కోరుకొను వారు శరణాగతి చేయు దాసులకు ద్వయ మంత్రమే ఆనందాబుధిలో తేలుస్తుంది  అని అన్నారు . అందు వలన ద్వయ మహా మంత్రమునుపదేశించిన  ఆచార్యులు తనకు దైవము అనగా అందరికి దైవమైన భగవంతుడిలా కాక తనకు మాత్రమే దైవమని చెపుతున్నారు .

తాళే.…….. అంత గొప్ప తన దైవము శ్రీపాదములే తనకు ఉత్తారకమని చెపుతున్నారు . భగవంతుని ఆశ్రయించిన వారికి , ఆచార్యుని ఆశ్రయించిన వారికి  ఆ శ్రీపాదములే ఉత్తారకమని భావము . తాళే అన్న పదములోని ఏవకారము శిష్యునికి చేయు ఉపకారమును ఆచార్యులు తప్ప మరెవరూ చేయలేరని బొధపడుతున్నది .

అరణాగుం ఎన్నుం అదు………..అరణ్ ..అనగా చేరదగిన స్థానము అని అర్థము , అది ఆచార్యుల శ్రీపాదములే . ఈశ్వ రుడు అన్న పదములో నాయకత్వము ,మార్గము , ఉపయోగము అని మూడు అర్థములు చెప్పబడుతున్నవి . ఈ మూడిటిని కలిగి ఉన్నవాడు భగవంతుడు . ‘ తన్ ఇరైవన్ ‘ అనగా ఆచార్యుల శ్రీపాదములే ఉత్తారకము . అవే నడిపించునవి ,అవే మార్గమును నిర్దేశించునవి , అవే అంతిమ ప్రయోజనము అని అర్థము .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-31-vedham-oru-nangin/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org