శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆళవందారులు మరియు నాథమునులు – కాట్టు మన్నార్ కోయిల్
పూజ్యనీయులైన ఆచార్య పురుషులు నాథమునుల మనముడైన ఆళవందారులు విశిష్థాద్వైత సిద్దాంతము/ శ్రీవైష్ణవ సాంప్రదాయము యొక్క గొప్ప పండితులు. వారు ప్రాప్యము మరియు ప్రాపకమునకు సంబంధించిన అత్యావశ్యక సూత్రములను ద్వయ మహా మంత్రము యొక్క విస్తారమైన వివరణతో స్తోత్ర రత్నములో వెల్లడి చేశారు. ఇది మనకు అందుబాటులో ఉన్న మన పూర్వాచార్యుల మొట్టమొదటి సంస్కృత స్తోత్ర గ్రంథము.
ఇళైయాళ్వార్ని (శ్రీ రామానుజ) ఆళవందారుల శిష్యులుగా చేయాలనే కోరికతో పెరియ నంబి కాంచిపురానికి వెళ్తారు. తిరుక్కచ్చినంబి మార్గదర్శకత్వంలో దేవపెరుమాళ్ల కోసం కైంకర్య రూపంగా సాళైక్కినాఱు (ఒక బావి) నుండి తీర్థమును వారు (నీళ్లను) తీసుకొని వస్తుండేవారు. పెరియ నంబి స్తోత్ర రత్నములోని కొన్ని శ్లోకములు పఠిస్తుండగా విని ఆకర్శితులైన ఇళైయాళ్వార్, ఆ తరువాత మన సాంప్రదాయములోకి ప్రవేశించెను. తరువాత కాలములో ఇళైయాళ్వారులు ఎంబెరుమానార్ గా పిలువబడ్డారు. ఈ ప్రబంధము పట్ల వారికి ఎనలేని ప్రీతి ఉన్న కారణముగా ఇందులోని కొన్ని వివరణ (గద్యము) లను వారి శ్రీవైకుంఠ గద్యములో ఉపయోగించారు.
పెరియ వాచ్ఛాన్ పిళ్ళై ఈ దివ్య ప్రబంధానికి విశదమైన వ్యాఖ్యానము వ్రాశారు. ఈ స్తోత్రము యొక్క గోప్య అర్థములను పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారి వ్యాఖ్యానములో అనర్గళంగా వివరించారు. వారి వ్యాఖ్యానమాధారముగా ఈ శ్లోకముల సరళ వివరణ మనమిక్కడ ముందు ముందు చూస్తాము.
- తనియన్లు
- శ్లోకములు 1-10
- శ్లోకములు 11 – 20
- శ్లోకములు 21 – 30
- శ్లోకములు 31 – 40
- శ్లోకములు 41 – 50
- శ్లోకములు 51 – 60
- శ్లోకములు 61 – 65
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org