ప్రమేయసారము 10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< పాశురము 9

azhwar-emperumanar

 

అవతారిక:

              కిందటి పాశురములో  ఆచార్యులు శ్రీమన్నారాయణుని అవతారమని చెప్పారు. జ్ఞానసారంలో “తిరుమామగళ్ కొళునన్ తానె గురువాగి”అని 39 పాశురములో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి .

             అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్యుల గొప్పదనాన్ని చెప్పి, వారు చేసే మహోపకారాన్ని తెలియజేస్తూ ఈ పాశురంతో ప్రబంధాన్ని సుసంపన్నం చేశారు.

 

పాశురము:

ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా

ముఱైయుం ముఱైయే మొళియుం

మఱైయుం ఉణర్తువార్ ఇల్లా నాళ్ ఒన్ఱల్ల ఆన

ఉణర్తువార్ ఉణ్దాన పోదు

 

ప్రతిపదార్థము:

ఇఱైయుం = ‘ అ ‘ కార వాచ్యుడైన పరమాత్మ

ఉయిరుం = ‘ మ ‘ కార వాచ్యుడైన జీవాత్మ

ఇరువర్కుముళ్ళా ముఱైయుం = ఈ ఇరువురి సంబంధము (జీవాత్మ పరమాత్మకే చెందిన వాడు) చతుర్ధీ విభక్తిలో చెప్పిన సంబంధము

ముఱైయే మొళియుం =ఈ సంబంధమునే ఉన్నతముగా గ్రహించి

మఱైయుం = వేద సారమైన తిరుమంత్రము యొక్క సారమును

ఉణర్తువార్ ఇల్లా నాళ్ = ఉపదేశించేవారు లేకపోతే

ఒన్ఱల్ల = పైన చెప్పుకున్న విషయాలన్నీ అర్థమయ్యీ కానట్టుగా ఉన్నప్పుడు

ఉణర్తువార్ = తిరుమంత్రార్థాన్ని విడమరచి చెప్పే ఆచార్యులు

ఉణ్దాన పోదు =  ఉన్నప్పుడు కదా

ఆన =అందు వలన ఉజ్జీవనము

 

వ్యాఖ్యానము:

ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా ముఱైయుం…….. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ గ్రంధ ప్రరంభంలో “అవ్వానవరుక్కు ” అన్న పాశురంలో  “అ” కారార్థము  శ్రీమన్నారాయణుడే(ప్రాణము) అని , వెంటనే  “మవ్వానవర్” అని మకారార్థాన్ని  చేతనుడని చెప్పారు.  “అవ్వానవరుక్కు మవ్వానవర్ ” పరమాత్మకు -జీవాత్మకు ఉన్న  సంబంధాన్ని  చెప్పారు. “ ఇంకా జీవాత్మ పరమాత్మకే చెందిన వాడు అని చతుర్దీ విభక్తిలో చెప్పటం వలన పర్మాత్మకు జీవాత్మకు ఉన్న శేష శేషి సంబంధాన్ని తెలియజేసారు.

ముఱైయే మొళియుం మఱైయుం ……. పైన చెప్పిన సంబంధం వేదాలలోను , తిరుమంత్రములోను, జ్ఞాన సారం లోని  31వ పాశురంలోను  వివరించబడింది. ” వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయిప్పొరుళుం ” (వేదములో నిక్షేపించబడింది ) అని తిరుమంత్రము వేదములో విస్తారంగా చర్చించ బడింది.  తిరుమంత్రమును వేదసారంగా చెప్పారు మన పూర్వాచార్యులు.  ఇటువంటి తిరుమంత్రాన్ని ఉపదేశించే వారే లేకపోతే…….

ఉణర్తువార్ ఇల్లా నాళ్ ఒన్ఱల్ల ………పైన చెప్పిన తిరుమంత్రార్థమైన పరమాత్మ, జీవాత్మ, వారి మధ్య సంబంధం ఎప్పటికీ కొనసాగుతుంది , ఆది,అంతము లేనిది ,నిత్యమైనది  అనే విషయాలను వివరించి చెప్పే వారు ఉన్నప్పుడే అవి ప్రకాశిస్తాయి. అలా చెప్పే వారు లేనప్పుడు అవి మరుగున పడిపోతాయి.

ఆన ఉణర్తువార్ ఉణ్దాన పోదు ….….” ఆన ” …కావున…చెప్పెవారు ఉన్నప్పుడే పై విషయాలన్ని ఉనికిలో ఉంటాయి. చెప్పెవారు ఎవరంటే వారే ఆచార్యులు. ఈ గ్రంధ ప్రారంభంలోనే   “ఉవ్వానవర్ ఉఱైతార్ ” అన్నారు . ఇది చేతనుల పట్ల ఆచార్యులు చేసిన మహోపకారం. దీనినే  నమ్మాళ్వార్లు “అఱియాదన అఱివిత్త అత్తా ” అని  పెరియాళ్వార్లు   “ పీదగవాడైప్పిరానార్ పిరమ గురువాగి వందు ” అని అన్నారు .

 ఈ ప్రకారంగా ఈ గ్రంధంలో అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్య వైభవాన్ని చక్కగా వివరించారు .

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-10/

archived in http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment