జ్ఞానసారము 8

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 7

పాశురము-8

vishnu
ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్
కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – మఱ్ఱొన్ఱై
ఇచ్చియా అన్బర్ తనక్కు ఎంగనే సెయిదిడినుం
ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు

ప్రతిపదార్థము

భువనం ఎల్లాం = సకల భువనములు
ముఱ్ఱ  ఉండ =  ఒక్కటి కూడా విడువక భుజించి తన గర్భమున దాచుకున్న
ముగిల్వణ్ణన్ = నీలమేఘ చ్చాయ గలవాడి
కఱ్ఱై తుళాయ్ సేర్ = సువాసనలు వెదజల్లు తులసి మాలను ధరించిన వాడి
కళలన్ఱి = శ్రీపాదములు తప్ప
మఱ్ఱొన్ఱై = వేరొక ప్రయోజనమును
ఇచ్చియా అన్ బర్ = కోరని భక్తులు
తనక్కు = భగవంతుడైన తనకు
ఎంగనే సెయిదిడినుం = కైంకర్యములు ఎలా చేసినా
ఉగందు = సంతోషించి
ఉచ్చియాల్ ఏఱ్కుం = తల మీద పెట్టుకుంటాడు

అవతారిక

శేషత్వము తప్ప మరే ఇతర ప్రయోజనములను ఆశించక ఆయన మీద అపారమైన ప్రీతిని కలిగివున్న వారు ,దాసత్వములో క్రమము తప్పినను భగవంతుడు దానిని దోషముగా భావించక ప్రేమతో స్వీకరిస్తాడు. గీతలో తన భక్తులు భక్తితో ఇచ్చిన పత్రం,పుష్పం, ఫల, తోయం ఏదైనా ప్రీతితో స్వీరిస్తానని చెప్పాడు. ఆ భావమే ఈ పాశురములో చెప్పబడింది.

వ్యాఖ్యానము

” ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్ ” ప్రళయ కాలములో సమస్త జీవరాశులను నాశము కానీయకుండా తన ఉదరములో భద్రపరచిన చరిత్ర చెప్పబడుతున్నది.ఈ విధముగా లోక రక్షణ చేసి అది చేతనోధ్ధరణ కోసము కాక తన కోసమే  అన్నట్లు ఆయన నీల మేఘ వర్ణ  శరీరము తెలియజేస్తున్నది. ఎందుకంటే మేఘములు లోక కల్యాణార్థము వర్షిస్తుంది, భగవంతుడు తన భక్తుల కోసమే దయను కురిపిస్తాడని బోధ పడుతున్నది. పాశురము లో  ‘తాయిరుక్కుం వణ్ణమే ఉమ్మై తన్ వయిఱ్ఱిరుందు ఉయ్యకొండాన్ ‘ ( సృష్టి చేసే క్రమములోఅనే నిన్ను రక్షించాడు) అని చెప్పినట్లుగా ప్రళయ కాలములో లోకములను వాటికి తెలియని తనకు మాత్రమే తెలిసిన సంబంధమే కారణముగా రక్షించి, అది కూడా తనకోసమే  చేసినట్లుగా భావించి తన రూపములో ఆ విషయమును స్పష్టము చేసాడు అని చెప్పబడింది.

కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – ఇక్కడ భగవంతుడీ శ్రీపాదములను మహత్యము చెప్పబడింది. భూమిలో పరిగే తులసి కమే ఆయన శ్రీపాదములపై ఉన్న తులసి ప్రకాసమానముగా వుంటుంది . ఎందు వలన అంటే ఆయన తిరుమేని సంబంధమే కారణము.  ఈ వర్ణన వలన భగవంతుడీ శ్రీపాదములకు అందము,ఔన్నత్యము అనేక రెట్లు పెరుగుతుంది.

– మఱ్ఱొన్ఱై ఇచ్చియా అన్ బర్ – పరమ భక్తులైన వారు అటువంటి శ్రీపాదములను తప్ప మరి ఇతరములను ఆశ్రయించము, అంటున్నారు .  లోకములో భగవంతుడిని పూజించేవారు ఆయన మీది ప్రీతితో కాక తమ కోరికలు తీర్చుకోవటము కోసామే చేయడము మనము చూస్తూనే ఉంటాము. అలా కాక ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా ,’ నూరు తడా అక్కార వడిశలుం సొన్నేన్ నూరు తడావిల్ వెణ్ణై వై నేర్దు పరావివైత్తేణ్ ( నీకు ఇష్టమైన నూరు గంగాళాల అక్కర వడిసల్, నూరు గంగాళాల వెన్న సమర్పిస్తాను) .దీనిని నువ్వు స్వీకరిస్తే ఒక్కొదానికి నూరు చొప్పున ఇంకా సమర్పిస్తానూ అనే వారెవరు? నిజమైన భక్తులు భగవంతుడు స్వీకరించడమే పరమ ప్రయోజనముగా భావిస్తారు. వీరినే అన్య ప్రయోజనమాశించని భక్తులని లోకము కీర్తిస్తుంది.

తనక్కు ఎంగనే సెయిదిడినుం- అఒతటి భక్తి గలవారు భగవాంతుడికి కైంకర్యము చేయునపుడు క్రమము తప్పినను….

ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు –  మహా ప్రీతితో తల మీద పెట్టుకుంటాడని అర్థము. అనగా భక్తుడు కాలితో విసిరి వేసినా తలతో స్వీకరిస్తారనీ అంటున్నారు. ఉదాహరణకు.. పెరుమాళ్ళ కోసము కట్టి వుంచిన పూల మాలను ఆండాళ్ తల్లి తాను ధరించి అందము చూసుకున్నది . అప్పుడు ఆ మాలలో ఆమె తల వెంట్రుక ఒకటి చిక్కుకున్నది. ఆమాలను చూసిన పెరియాళ్వార్లు దానిని విసిరివేశి మరొక మాలను కట్టి తీసుకు వెళ్ళారు.   కాని పెరుమాళ్ళు తనకు ఆమాలె కావాలని అడిగి ధరించిన విషయము జగద్విదితము. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు భక్తులపై భగవంతుది  ప్రీతిని తెలియజేసేవి చూడవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-8-murrap-buvanam/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment